Trends

వైరల్ ఫోటోపై నాసా స్పందన.. సునీతా సురక్షితమే!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బారీ విల్మోర్ కూడా అమెతోనే ఉన్నారు. అయితే ఫోటోలో సునీతా బలహీనంగా, బరువు తగ్గినట్లు కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో ఆరోగ్యం విషయంలో చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన శ్యాసకోశ నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా సునీతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, అందువల్లే బలహీనంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఇంతటి చర్చ జరుగుతుండగా, సునీతా ఆరోగ్యం గురించి నాసా అధికారిక ప్రకటన చేసింది. ఐఎస్ఎస్‌లో ఉన్న సునీతా సహా ఇతర వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది.

అంతేకాదు, అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, వారి ఆరోగ్యం పర్యవేక్షణలో ఫ్లైట్ సర్జన్లు ఉంటారని వెల్లడించింది. అంతరిక్షంలో మారే శరీర పరిస్థితులను గమనిస్తూ పోషకాహారం విషయంలో నిపుణుల సూచనలు పాటిస్తున్నారని కూడా నాసా తెలియజేసింది. సునీతా విలియమ్స్ ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలపై నాసా స్పందించడంతో, ఆందోళనకు చెక్ పడింది.

భూమిపైకి వచ్చేది ఎప్పుడు?

స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్‌ భాగస్వాములైన వీరిద్దరూ భూమికి తిరిగి రావాలని భావించినప్పటికీ పలు సాంకేతిక లోపల వలన రాలేని పరిస్థితి, తాజా నివేదికల ప్రకారం కనీసం 2025 ఫిబ్రవరి వరకు వారు ఇస్ఎస్ఎస్‌లోనే ఉండవలసి రావచ్చు. అయితే దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండడం వల్ల వ్యోమగాములు ఎముకల సాంద్రత, కండరాల బలం కోల్పోవడం, శరీర కొవ్వు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు.

This post was last modified on November 8, 2024 12:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

2 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

2 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

4 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

5 hours ago