అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం కొన్ని అగ్ర దేశాలు ఎంతో ఆసక్తి చూపించాయి. ఇక ఆయన విజయం సాధించడంతో మార్కెట్లో గట్టి ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కంపెనీలకు జాక్ పాట్ తగిలినట్లయ్యింది. ఎలాన్ మస్క్ మొదటి నుంచి కూడా ట్రంప్ గెలవాలి అని ప్రత్యేకంగా ప్రచారం కూడా చేశారు. సోషల్ మీడియాలో సైతం జనాలను ప్రభావితం చేసేలా ప్రణాళికలు రచించారు.
ఇక ఎలాన్ మస్క్ కంపెనీ షేర్లు ట్రంప్ గెలుపు నేపధ్యంలో మరింత బలపడి, భారీ లాభాలను అందుకున్నాయి. ఈ విజయంతో మస్క్ సంపద ఏకంగా 26.5 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.2 లక్షల కోట్లు) పెరిగింది. దీంతో ఆయన నికర సంపద 290 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది.
అంతేకాక, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద కూడా 7.14 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.60 వేల కోట్లు) పెరిగింది. తద్వారా ఆయన సంపద 228 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రంప్ గెలుపుతో అమెరికా స్టాక్ మార్కెట్లు మంచి ఊపు చూపడం, బెజోస్ కంపెనీల స్టాక్స్పై కూడా ఆ ప్రభావం పడడం విశేషం.
ఇక, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, సీటీవో లారీ ఎలిసన్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వంటి ప్రపంచ స్థాయి కుబేరుల నికర సంపదలోనూ మెరుగుదల కనిపించింది. అమెరికా స్టాక్ మార్కెట్లు ట్రంప్ విజయం నేపథ్యంలో తక్షణ ప్రాప్తిలో ఉన్న గ్లోబల్ మార్కెట్స్కు బలాన్ని అందించాయి. ఈ ప్రభావం వలన అమెరికా మార్కెట్లలో లాభాలు పెరిగి, ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీల షేర్లు మరింత గట్టిపడినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…