అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం కొన్ని అగ్ర దేశాలు ఎంతో ఆసక్తి చూపించాయి. ఇక ఆయన విజయం సాధించడంతో మార్కెట్లో గట్టి ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కంపెనీలకు జాక్ పాట్ తగిలినట్లయ్యింది. ఎలాన్ మస్క్ మొదటి నుంచి కూడా ట్రంప్ గెలవాలి అని ప్రత్యేకంగా ప్రచారం కూడా చేశారు. సోషల్ మీడియాలో సైతం జనాలను ప్రభావితం చేసేలా ప్రణాళికలు రచించారు.
ఇక ఎలాన్ మస్క్ కంపెనీ షేర్లు ట్రంప్ గెలుపు నేపధ్యంలో మరింత బలపడి, భారీ లాభాలను అందుకున్నాయి. ఈ విజయంతో మస్క్ సంపద ఏకంగా 26.5 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.2 లక్షల కోట్లు) పెరిగింది. దీంతో ఆయన నికర సంపద 290 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది.
అంతేకాక, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద కూడా 7.14 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.60 వేల కోట్లు) పెరిగింది. తద్వారా ఆయన సంపద 228 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రంప్ గెలుపుతో అమెరికా స్టాక్ మార్కెట్లు మంచి ఊపు చూపడం, బెజోస్ కంపెనీల స్టాక్స్పై కూడా ఆ ప్రభావం పడడం విశేషం.
ఇక, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, సీటీవో లారీ ఎలిసన్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వంటి ప్రపంచ స్థాయి కుబేరుల నికర సంపదలోనూ మెరుగుదల కనిపించింది. అమెరికా స్టాక్ మార్కెట్లు ట్రంప్ విజయం నేపథ్యంలో తక్షణ ప్రాప్తిలో ఉన్న గ్లోబల్ మార్కెట్స్కు బలాన్ని అందించాయి. ఈ ప్రభావం వలన అమెరికా మార్కెట్లలో లాభాలు పెరిగి, ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీల షేర్లు మరింత గట్టిపడినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…