Trends

IPL: అతను వేలంలోకి వస్తే రూ.25కోట్లకు పైనే..

ఐపీఎల్ 2025 కోసం రిటెయిన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితా ప్రకటనకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. గత కొన్ని వారాలుగా వేలానికి సంబంధించిన అనేక రకాల ఊహాగానాలు కూడా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక అక్టోబర్ 31న ఈ జాబితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ పేరును జట్టు రిటెయిన్‌ చేస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.

అతన్ని వేలంలోకి వదలవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. పంత్‌ రిటెన్షన్‌పై ఢిల్లీ యాజమాన్యం అంతిమ నిర్ణయం తీసుకోనుండగా, అతను వేలంలోకి వస్తే భారీ ధర పలుకుతాడని అంటున్నారు. ఇంతలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ కోసం రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు ఉపయోగించవచ్చు. అతనికి కెప్టెన్, కీపర్ కావాల్సిన ముంబై, బెంగళూరు, పంజాబ్, కోల్‌కతా, సూపర్ జెయింట్స్ వంటి జట్లు ఆసక్తి చూపవచ్చు” అని వ్యాఖ్యానించారు.

“రాజస్థాన్‌, గుజరాత్ వంటి జట్లకు ముఖ్యంగా కీపర్ అవసరం. బ్యాటింగ్ లైనప్ లో కూడా హార్డ్ హిట్లర్ గా క్లిక్కయితే టీమ్ కు మరింత బలం. ఇక పంత్‌ వేలంలో ఉంటే అన్ని ఫ్రాంచైజీలు ప్రతిష్ఠాత్మకంగా అతన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతాయి. అతని ధర రూ.25-30 కోట్ల వరకూ చేరవచ్చని నా అంచనా” అని చోప్రా అన్నారు. రిషబ్ పంత్‌ టీ20 ఫార్మాట్‌లో పెద్దగా సత్తా చాటకపోయినా, ఐపీఎల్‌లో అతని టాలెంట్‌కు భారీ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. “ఐపీఎల్ వేలంలోకి వస్తే అతనికి ప్రీమియం ధర రావడం ఖాయం” అంటూ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించారు.

This post was last modified on October 30, 2024 10:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago