Trends

IPL: అతను వేలంలోకి వస్తే రూ.25కోట్లకు పైనే..

ఐపీఎల్ 2025 కోసం రిటెయిన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితా ప్రకటనకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. గత కొన్ని వారాలుగా వేలానికి సంబంధించిన అనేక రకాల ఊహాగానాలు కూడా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక అక్టోబర్ 31న ఈ జాబితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ పేరును జట్టు రిటెయిన్‌ చేస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.

అతన్ని వేలంలోకి వదలవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. పంత్‌ రిటెన్షన్‌పై ఢిల్లీ యాజమాన్యం అంతిమ నిర్ణయం తీసుకోనుండగా, అతను వేలంలోకి వస్తే భారీ ధర పలుకుతాడని అంటున్నారు. ఇంతలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ కోసం రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు ఉపయోగించవచ్చు. అతనికి కెప్టెన్, కీపర్ కావాల్సిన ముంబై, బెంగళూరు, పంజాబ్, కోల్‌కతా, సూపర్ జెయింట్స్ వంటి జట్లు ఆసక్తి చూపవచ్చు” అని వ్యాఖ్యానించారు.

“రాజస్థాన్‌, గుజరాత్ వంటి జట్లకు ముఖ్యంగా కీపర్ అవసరం. బ్యాటింగ్ లైనప్ లో కూడా హార్డ్ హిట్లర్ గా క్లిక్కయితే టీమ్ కు మరింత బలం. ఇక పంత్‌ వేలంలో ఉంటే అన్ని ఫ్రాంచైజీలు ప్రతిష్ఠాత్మకంగా అతన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతాయి. అతని ధర రూ.25-30 కోట్ల వరకూ చేరవచ్చని నా అంచనా” అని చోప్రా అన్నారు. రిషబ్ పంత్‌ టీ20 ఫార్మాట్‌లో పెద్దగా సత్తా చాటకపోయినా, ఐపీఎల్‌లో అతని టాలెంట్‌కు భారీ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. “ఐపీఎల్ వేలంలోకి వస్తే అతనికి ప్రీమియం ధర రావడం ఖాయం” అంటూ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించారు.

This post was last modified on October 30, 2024 10:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago