Trends

మీకు ఒక్కటే దారి.. లేదంటే వేటాడి చంపుతాం: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా కీలక ప్రకటన చేశారు. హమాస్ నేత యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం మరో మలుపు తిప్పుకుంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు ఇక ఒక్కటే దారి, తమ బందీలను విడిచిపెడితే, ఈ యుద్ధం రేపే ముగుస్తుందని తెలిపారు. సిన్వర్ మరణంతో ఇజ్రాయెల్‌కు ఒక ప్రధాన విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు.

“హమాస్ తమ ఆయుధాలను వదిలిపెట్టి, బందీలను తిరిగి పంపిస్తే యుద్ధం రేపే ముగుస్తుంది. ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వాళ్లు ఇలాగే ఉంటారు. కానీ బందీలను విడిచిపెడితే హమాస్ సైనికులు బయటకు వచ్చి బతకగలుగుతారు. లేకపోతే వేటాడి మరీ చంపుతాం” అని స్పష్టం చేశారు. గత అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడుల్లో దాదాపు 1,200 మంది చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.

దీనికి సూత్రధారి యహ్యా సిన్వర్ అని ఇజ్రాయెల్ అధికారికంగా తెలిపింది. బుధవారం జరిగిన యాక్షన్‌లో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజాలో ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చాయి. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ పరీక్ష ద్వారా ధృవీకరించారు. అయితే హమాస్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.

సిన్వర్ మరణం తమకు పెద్ద విజయం అని నెతన్యాహు పేర్కొన్నారు. యుద్ధం పూర్తిగా ముగియకపోయినా, ఈ దశ తర్వాత పరిణామాలు మరింత స్పష్టతతో ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యలపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కూడా స్పందించారు. హమాస్ నాయకుడు యహ్యా సిన్వర్ మరణాన్ని న్యాయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పుడు బందీలు విడిపోతే ఇరు దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని అన్నారు.

This post was last modified on October 18, 2024 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

50 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago