Trends

మీకు ఒక్కటే దారి.. లేదంటే వేటాడి చంపుతాం: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా కీలక ప్రకటన చేశారు. హమాస్ నేత యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం మరో మలుపు తిప్పుకుంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు ఇక ఒక్కటే దారి, తమ బందీలను విడిచిపెడితే, ఈ యుద్ధం రేపే ముగుస్తుందని తెలిపారు. సిన్వర్ మరణంతో ఇజ్రాయెల్‌కు ఒక ప్రధాన విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు.

“హమాస్ తమ ఆయుధాలను వదిలిపెట్టి, బందీలను తిరిగి పంపిస్తే యుద్ధం రేపే ముగుస్తుంది. ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వాళ్లు ఇలాగే ఉంటారు. కానీ బందీలను విడిచిపెడితే హమాస్ సైనికులు బయటకు వచ్చి బతకగలుగుతారు. లేకపోతే వేటాడి మరీ చంపుతాం” అని స్పష్టం చేశారు. గత అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడుల్లో దాదాపు 1,200 మంది చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.

దీనికి సూత్రధారి యహ్యా సిన్వర్ అని ఇజ్రాయెల్ అధికారికంగా తెలిపింది. బుధవారం జరిగిన యాక్షన్‌లో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజాలో ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చాయి. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ పరీక్ష ద్వారా ధృవీకరించారు. అయితే హమాస్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.

సిన్వర్ మరణం తమకు పెద్ద విజయం అని నెతన్యాహు పేర్కొన్నారు. యుద్ధం పూర్తిగా ముగియకపోయినా, ఈ దశ తర్వాత పరిణామాలు మరింత స్పష్టతతో ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యలపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కూడా స్పందించారు. హమాస్ నాయకుడు యహ్యా సిన్వర్ మరణాన్ని న్యాయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పుడు బందీలు విడిపోతే ఇరు దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని అన్నారు.

This post was last modified on October 18, 2024 3:10 pm

Share

Recent Posts

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

1 hour ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

2 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

3 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

3 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

3 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

4 hours ago