ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా కీలక ప్రకటన చేశారు. హమాస్ నేత యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం మరో మలుపు తిప్పుకుంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు ఇక ఒక్కటే దారి, తమ బందీలను విడిచిపెడితే, ఈ యుద్ధం రేపే ముగుస్తుందని తెలిపారు. సిన్వర్ మరణంతో ఇజ్రాయెల్కు ఒక ప్రధాన విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు.
“హమాస్ తమ ఆయుధాలను వదిలిపెట్టి, బందీలను తిరిగి పంపిస్తే యుద్ధం రేపే ముగుస్తుంది. ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వాళ్లు ఇలాగే ఉంటారు. కానీ బందీలను విడిచిపెడితే హమాస్ సైనికులు బయటకు వచ్చి బతకగలుగుతారు. లేకపోతే వేటాడి మరీ చంపుతాం” అని స్పష్టం చేశారు. గత అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్పై జరిపిన దాడుల్లో దాదాపు 1,200 మంది చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.
దీనికి సూత్రధారి యహ్యా సిన్వర్ అని ఇజ్రాయెల్ అధికారికంగా తెలిపింది. బుధవారం జరిగిన యాక్షన్లో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజాలో ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చాయి. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ పరీక్ష ద్వారా ధృవీకరించారు. అయితే హమాస్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.
సిన్వర్ మరణం తమకు పెద్ద విజయం అని నెతన్యాహు పేర్కొన్నారు. యుద్ధం పూర్తిగా ముగియకపోయినా, ఈ దశ తర్వాత పరిణామాలు మరింత స్పష్టతతో ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యలపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కూడా స్పందించారు. హమాస్ నాయకుడు యహ్యా సిన్వర్ మరణాన్ని న్యాయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పుడు బందీలు విడిపోతే ఇరు దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని అన్నారు.
This post was last modified on October 18, 2024 3:10 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…