Trends

మీకు ఒక్కటే దారి.. లేదంటే వేటాడి చంపుతాం: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా కీలక ప్రకటన చేశారు. హమాస్ నేత యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం మరో మలుపు తిప్పుకుంది. హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు ఇక ఒక్కటే దారి, తమ బందీలను విడిచిపెడితే, ఈ యుద్ధం రేపే ముగుస్తుందని తెలిపారు. సిన్వర్ మరణంతో ఇజ్రాయెల్‌కు ఒక ప్రధాన విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నామని నెతన్యాహు పేర్కొన్నారు.

“హమాస్ తమ ఆయుధాలను వదిలిపెట్టి, బందీలను తిరిగి పంపిస్తే యుద్ధం రేపే ముగుస్తుంది. ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వాళ్లు ఇలాగే ఉంటారు. కానీ బందీలను విడిచిపెడితే హమాస్ సైనికులు బయటకు వచ్చి బతకగలుగుతారు. లేకపోతే వేటాడి మరీ చంపుతాం” అని స్పష్టం చేశారు. గత అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడుల్లో దాదాపు 1,200 మంది చనిపోగా, 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.

దీనికి సూత్రధారి యహ్యా సిన్వర్ అని ఇజ్రాయెల్ అధికారికంగా తెలిపింది. బుధవారం జరిగిన యాక్షన్‌లో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ గాజాలో ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చాయి. అందులో సిన్వర్ ఉన్నట్లు డీఎన్ఏ పరీక్ష ద్వారా ధృవీకరించారు. అయితే హమాస్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.

సిన్వర్ మరణం తమకు పెద్ద విజయం అని నెతన్యాహు పేర్కొన్నారు. యుద్ధం పూర్తిగా ముగియకపోయినా, ఈ దశ తర్వాత పరిణామాలు మరింత స్పష్టతతో ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యలపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కూడా స్పందించారు. హమాస్ నాయకుడు యహ్యా సిన్వర్ మరణాన్ని న్యాయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పుడు బందీలు విడిపోతే ఇరు దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని అన్నారు.

This post was last modified on October 18, 2024 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బ్రేకింగ్!.. వల్లభనేని వంశీ అరెస్ట్!

టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ…

23 seconds ago

జగన్ మీటింగ్ లో ‘మర్రి’ కనిపించలేదే!

వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైనప్పటి నుంచి కూడా…

4 hours ago

లోకేశ్ తో వేగేశ్న భేటీ… విశాఖపై సిఫీ ఆసక్తి

కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7…

8 hours ago

ఉచితాల‌తో `బ‌ద్ధ‌క‌స్తు`ల‌ను పెంచుతున్నారు: సుప్రీం సీరియ‌స్‌

``ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. స‌మాజంలో బ‌ద్ధ‌క‌స్తుల‌ను పెంచుతున్నాయి. ఇది స‌రికాదు. స‌మాజంలో ప‌నిచేసే వారు త‌గ్గిపోతున్నారు.…

10 hours ago

‘తండేల్’ బౌండరీ దాటలేకపోయిందా?

బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…

10 hours ago

తులసిబాబుకు రూ.48 లక్షలు!.. ఎందుకిచ్చారంటే..?

కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…

11 hours ago