*సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం.
*కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వీడియో విడుదల చేసిన చిత్రం యూనిట్.
టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,‘నేహాశెట్టి‘ నాయికగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే.’కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి.
నేడు చిత్ర కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల తో కూడిన వీడియోను విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ వీడియో, అందులోని ఆసక్తికరమైన సంభాషణ ఏమిటో పరికించి చూస్తే అర్థమవుతుంది ఇది ఖచ్చితగా విభిన్న కథాచిత్రమని. ఇందులో కథానాయకుడు సిద్ధు ఎవరితోనో సంభాషణ ఈ విధంగా సాగుతుంది…..
”అరె సత్తి షోల్డర్ మసాజ్ చెయ్యరా…
సాయంత్రం సాంగ్ లాంచ్ ఉన్నది
పార్టీలోన… జిమ్ కొడుతున్నట్టున్నావ్ గా గట్టిగా
ఏడరా… మొత్తం కీటో డైట్ మీదున్నా నేను
ఏందన్నా… అది
కీటో డైట్ రా… రైస్ తినం… ఆలుగడ్డ తినం… ఖాళీ ప్రోటీన్ తింటాం… ఫాట్ తింటాం..నో కార్బో హైడ్రేట్..
డైట్ లో ఫాట్ తింటావా అన్నా…
మరి… ఫాటే కదరా లోపలికి పోయి ఫాట్ ను కట్ చేసేటిది.
ఏ… ఊరుకో అన్నా మజాక్ చేయకు ప్లీజ్
అరె… హవులే…. డైమండ్ ను ఎట్లా కోస్తారో తెలుసారా నీకు ఆ…
చెప్పు..
డైమండ్ తోని….
నిజంగానా…
ఎట్టుంటది మరి మనతోని….
తిన్న ప్రొటీనంతా ఏడికి పోతుందిరా టిల్లు…..
గమ్మత్తుగా సాగే ఈ సంభాషణ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రంలో ఏ సందర్భంలో వస్తుందో వెండితెరపై చూడాల్సిందే”….
పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అని తెలిపారు దర్శకుడు విమల్ కృష్ణ.
చిత్రంలో ప్రిన్స్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రలలో, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ ఇప్పటివరకు ఎంపికైన తారాగణం.
This post was last modified on February 8, 2021 12:34 am
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…