నందమూరి బాలకృష్ణ పేరు నిన్న సోషల్ మీడియాలో కొన్ని గంటల పాటు మార్మోగిపోయింది. బాలయ్యను దాన కర్ణుడిగా అభివర్ణిస్తూ అభిమానులు రెచ్చిపోయి ట్వీట్లు వేసేశారు. బాలయ్య సేవా భావాన్ని తెగ పొగిడేశారు. హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య కోటిన్నర రూపాయల సాయం అందజేశాడని, వెయ్యి మందికి ఆహారం అందిస్తున్నాడన్న వార్త కొన్ని గంటల్లోనే నెట్టింట తెగ చక్కర్లు కొట్టేసింది. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలింది. …
Read More »ఎలాగైనా వంశీని ఓడిస్తారట
తెగించినోడికి తెడ్డే లింగం! కానీ, అన్నా.. ఏదైదే అదేజరుగుతుంది!– తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ అసమ్మతి నాయకుడు, వైసీపీ సానుకూల నేత వల్లభనేని చేసిన వ్యాఖ్యలు ఇవేనని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా ఆయన ఇంత మాట ఎందుకు అన్నారు? నిన్నమొన్నటి వరకు అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పిన వంశీలో మారిన వైఖరి ఏంటి? ఇప్పుడు అందరి ఆలోచింప చేస్తున్న ప్రశ్నలు ఇవి. వరుస విజయాలతో …
Read More »కేసీఆర్ దత్తపుత్రిక ఎంగేజ్ మెంట్.. ఎవరు వెళ్లారంటే?
సవతితల్లి చేతుల్లో దారుణ హింసకు గురై.. స్థానికుల అందించిన సమాచారంతో నరకం నుంచి బయటపడిన ఒక అమ్మాయి గుర్తుందా? చావుబతుకుల మధ్య ఉన్న ఆ అమ్మాయిని తన ఇంటికి పిలిపించుకోవటమే కాదు.. ఆమెను తన దత్తపుత్రికగా స్వీకరిస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించటం.. ఆమె బాధ్యతల్ని స్వయంగా స్వీకరించటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆ అమ్మాయి ప్రత్యూష. సవతితల్లితో పాటు కన్నతండ్రి హింసకు బాధితురాలిగా మారిన ఆమె …
Read More »నేతలు ఎక్కువైపోవటం వల్లే గొడవలు పెరిగిపోతున్నాయా ?
జిల్లాలో నేతల వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది.మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లను వైసిపినే గెలుచుకుంది. అలాగే నెల్లూరు ఎంపి సీటులో కూడా వైసిపినే జెండా ఎగరేసింది. గెలిచిన వాళ్ళలో అత్యధికులు హెవీ వెయిట్సే ఉండటంతో పార్టీలో సమన్వయం కొరవడిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ఒకళ్ళు చెబితే మరోకళ్ళు వినే పరిస్ధితి కూడా కనిపించటం లేదు. దాంతో జిల్లాలో నేతల పరిస్ధితి ఎవరికి …
Read More »వైసీపీ-టీడీపీల్లో ఒక్కటే రగడ.. ఏజ్ ఫ్యాక్టరే తేడా!!
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల్లో అంతర్గత కుమ్ములాటలు కామనే! మాకు పదవులు దక్కలేదని కొందరు.. మాకు దక్కకుండా చేశారని మరికొందరు.. అసలు మా మొహం చూసేవారు ఎవరని ఇంకొందరు.. ఇలా అసంతృప్తులు, ఆవేదనలు కోకొల్లలు. అయితే, ఈ రెండు పార్టీల్లోనూ ఇలా ఆవేదనకు, ఆందోళనకు గురవుతున్నవారిలో ఏజ్ ఫ్యాక్టరే తేడా కనిపిస్తోంది. అదేంటంటే.. వైసీపీలో సీనియర్లు.. టీడీపీలో జూనియర్లు.. తమను ఎదగనివ్వడం లేదని, తమకు అసలు విలువే లేకుండా …
Read More »ఆమెను వైసీపీలో ఎవరు పట్టించుకోవటం లేదట !
శ్రీకాకుళం మాజీ ఎంపి, కేంద్ర మాజీమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి గుర్తింపు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా ? అధికారపార్టీలోనే ఉన్నా అనుకున్నంత గుర్తింపు రావటం లేదా ? కిల్లి విషయాన్ని ఆరాతీస్తే పార్టీ నేతల్లోనే ఈ విషయాలు చర్చ జరుగుతున్నాయి. జిల్లా పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు, మంత్రులు, ఎంఎల్ఏలు కిల్లిని ఏమాత్రం పట్టించుకోవటం లేదట. ఆధిపత్య సమస్యలతోనే మాజీమంత్రికి పార్టీలోని చాలామంది సీనియర్ నేతలతో ఏమాత్రం పడటం లేదని …
Read More »సబ్బం హరి టీఆర్పీ తగ్గిపోతోందా?
రాజకీయ నాయకుడిగా కంటే విశ్లేషకుడిగా ఎక్కువ ప్రచారంలో ఉన్న మాజీ ఎంపి సబ్బంహరి వైఖరి రోజురోజుకు విపరీతంగా మారిపోతోంది. వివిధ కారణాలతో జగన్మోహన్ రెడ్డిపై తనలో పేరుకుపోయిన కసిని ఆరోపణలు, విమర్శల రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రిపై సబ్బం చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు మీడియాలో బాగా ప్రయారిటి ఇస్తుండటంతో ఈయన మరింత ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడుతున్నారు. తాజాగా సబ్బం చేసిన వ్యాఖ్యలేమిటంటే 2021 లో జగన్ ముఖ్యమంత్రిగా …
Read More »జగన్ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకుంటుందా ?
గడచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ముంపు తీవ్రత వల్ల సుమారు రూ. 4450 కోట్ల విలువైన ఆస్తులు, పంటలకు నష్టం జరిగినట్లు రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపింది. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ జగన్ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. వరద సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నా, తిరిగి సాధారణ పరిస్ధితులు రావాలంటే కేంద్రం తక్షణమే రూ. వెయ్యికోట్లు మంజూరు చేయాలంటూ లేఖలో …
Read More »చేతులు కాలాక.. జగన్ చర్యలు.. చోద్యం కాదా!
చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు. పార్టీలో ఎవరైనా హద్దు దాటితే.. వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే.. హెచ్చరించి లైన్లో పెట్టుకోవాలి. కానీ, అంతా అయిపోయిన తర్వాత.. చర్యలు తీసుకుంటే ఏంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకుడు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై చర్యలకు జగన్ పూనుకొన్నారనేవార్తలు వస్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించేందుకురంగం సిద్ధం చేస్తున్నట్టు …
Read More »హర్షకుమార్ ఏ పార్టీకీ సెట్ కాలేదా?..
అమలాపురం మాజీ ఎంపీ.. సీనియర్ నాయకుడు, ఎస్సీ నేత.. జీవీ హర్షకుమార్ రాజకీయాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. పొలిటికల్ సర్కిళ్లలో మరోసారి ఆయన చర్చ నీయాంశంగా మారారు. ఒకప్పుడు కాంగ్రెస్ టికెట్పై అమలాపురం నుంచి రెండు సార్లు విజయం సాధించారు హర్షకుమార్. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా విజయం సాదించారు. అప్పటి కీలక నాయకుడు వైఎస్కు అనుంగు అనుచరుడిగా కూడా హర్షకుమార్ పేరు తెచ్చుకున్నారు. తర్వాత.. రాష్ట్ర విభజన …
Read More »అంతా ఆయనే.. చక్రం తిప్పుతున్న సజ్జల!
సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీలో నాయకుడు, వ్యూహాత్మక నేత, సీఎం రాజకీయ సలహాదారు. ఇంత వరకేనా ఆయన విధులు. అంటే.. కాదని అంటున్నారు వైసీపీ నాయకులు. ఆయన షాడో చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారని పార్టీలో కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. తమకు ఏదైనా సమస్య వస్తే.. నేరుగా సీఎం జగన్కు చెప్పుకొనే అవకాశం ఏనాడో పోయిందని నేతలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకొనేందుకు సీఎం అవకాశం ఇవ్వడం లేదని.. ఏదైనా ఉంటే.. …
Read More »ఈ ఎంఎల్ఏ చివరకు ఎవరికీ కాకుండా పోయాడా ?
జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పరిస్దితిని గమనించిన వాళ్ళకు ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు (ఎస్సీ) నియోజకవర్గంలో గెలిచిన రాపాక పరిస్దితి ఇపుడు గందరగోళంలో పడిందని సమాచారం. గెలిచిన జనసేన పార్టీని కాదని వైసిపికి దగ్గరైన రాపాకకు ఇపుడు అధికారపార్టీలో ఆదరణ కరువైందట. గెలిచిన దగ్గర నుండి తన వ్యవహారశైలి కారణంగా వైసీపీకి అనుబంద సభ్యునిగానే రాపాక కంటిన్యు అవుతున్నారు. తనకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates