ఇరాన్ ఇటీవల అమెరికా సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్లోని ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది. కానీ, అమెరికా మరింత దూకుడుగా ఇజ్రాయెల్కు మద్దతు అందిస్తోంది. ఆ దేశంలో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రతిఘటనా చర్యగా, ఇజ్రాయెల్ ఈ వ్యవస్థలను చక్కగా ఉపయోగించేందుకు సిద్ధమవుతుందని అమెరికా పేర్కొనడం, పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనను కలిగించింది.
ఇరాన్ కు అమెరికా శతృదేశాలు తోడైతే ఎక్కడ వరల్డ్ వార్ 3 మొదలవుతుందేమో అనే భయం కూడా చాలా దేశాల్లో ఉంది. ఇక అమెరికా సైనిక శాఖ, పెంట్గాన్ ద్వారా ప్రకటించినట్టు, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (టీహెచ్ఏఏడీ)ని ఇజ్రాయెల్కు పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవస్థ బాలిస్టిక్ క్షిపణులను నిరోధించేందుకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల ప్రకారం, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఈ చర్యకు అనుమతి ఇచ్చారని ప్రకటించారు. ఇరాన్ ఈ క్రమంలో అమెరికాపై ఆరోపణలు చేస్తూ, ఇజ్రాయెల్కు అత్యధిక స్థాయిలో ఆయుధాలను అందిస్తున్నది అని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయాద్ అబ్బాస్ ఆరాఘ్చీ, పశ్చిమాసియాలో యుద్ధం నివారించేందుకు తమ దేశం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరిగిపోతుండగా, అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ గా గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వహించేందుకు సైనిక బలగాలను కూడా పంపుతోంది. ఇరాన్ ఈ చర్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, తమ ప్రజల మరియు దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో అల్లర్లు మరియు స్థిరత్వం కోల్పోయే పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయని భావిస్తున్నారు. మరి ఈ యుద్ధంలో అమెరికా ఎలాంటి పరిష్కారాన్నీ తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on October 14, 2024 11:57 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…