ఇరాన్ ఇటీవల అమెరికా సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్లోని ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది. కానీ, అమెరికా మరింత దూకుడుగా ఇజ్రాయెల్కు మద్దతు అందిస్తోంది. ఆ దేశంలో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రతిఘటనా చర్యగా, ఇజ్రాయెల్ ఈ వ్యవస్థలను చక్కగా ఉపయోగించేందుకు సిద్ధమవుతుందని అమెరికా పేర్కొనడం, పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనను కలిగించింది.
ఇరాన్ కు అమెరికా శతృదేశాలు తోడైతే ఎక్కడ వరల్డ్ వార్ 3 మొదలవుతుందేమో అనే భయం కూడా చాలా దేశాల్లో ఉంది. ఇక అమెరికా సైనిక శాఖ, పెంట్గాన్ ద్వారా ప్రకటించినట్టు, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (టీహెచ్ఏఏడీ)ని ఇజ్రాయెల్కు పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవస్థ బాలిస్టిక్ క్షిపణులను నిరోధించేందుకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల ప్రకారం, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఈ చర్యకు అనుమతి ఇచ్చారని ప్రకటించారు. ఇరాన్ ఈ క్రమంలో అమెరికాపై ఆరోపణలు చేస్తూ, ఇజ్రాయెల్కు అత్యధిక స్థాయిలో ఆయుధాలను అందిస్తున్నది అని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయాద్ అబ్బాస్ ఆరాఘ్చీ, పశ్చిమాసియాలో యుద్ధం నివారించేందుకు తమ దేశం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరిగిపోతుండగా, అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ గా గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వహించేందుకు సైనిక బలగాలను కూడా పంపుతోంది. ఇరాన్ ఈ చర్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, తమ ప్రజల మరియు దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో అల్లర్లు మరియు స్థిరత్వం కోల్పోయే పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయని భావిస్తున్నారు. మరి ఈ యుద్ధంలో అమెరికా ఎలాంటి పరిష్కారాన్నీ తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on October 14, 2024 11:57 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…