ఇరాన్ ఇటీవల అమెరికా సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్లోని ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది. కానీ, అమెరికా మరింత దూకుడుగా ఇజ్రాయెల్కు మద్దతు అందిస్తోంది. ఆ దేశంలో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రతిఘటనా చర్యగా, ఇజ్రాయెల్ ఈ వ్యవస్థలను చక్కగా ఉపయోగించేందుకు సిద్ధమవుతుందని అమెరికా పేర్కొనడం, పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనను కలిగించింది.
ఇరాన్ కు అమెరికా శతృదేశాలు తోడైతే ఎక్కడ వరల్డ్ వార్ 3 మొదలవుతుందేమో అనే భయం కూడా చాలా దేశాల్లో ఉంది. ఇక అమెరికా సైనిక శాఖ, పెంట్గాన్ ద్వారా ప్రకటించినట్టు, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (టీహెచ్ఏఏడీ)ని ఇజ్రాయెల్కు పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవస్థ బాలిస్టిక్ క్షిపణులను నిరోధించేందుకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల ప్రకారం, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఈ చర్యకు అనుమతి ఇచ్చారని ప్రకటించారు. ఇరాన్ ఈ క్రమంలో అమెరికాపై ఆరోపణలు చేస్తూ, ఇజ్రాయెల్కు అత్యధిక స్థాయిలో ఆయుధాలను అందిస్తున్నది అని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయాద్ అబ్బాస్ ఆరాఘ్చీ, పశ్చిమాసియాలో యుద్ధం నివారించేందుకు తమ దేశం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరిగిపోతుండగా, అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ గా గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వహించేందుకు సైనిక బలగాలను కూడా పంపుతోంది. ఇరాన్ ఈ చర్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, తమ ప్రజల మరియు దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో అల్లర్లు మరియు స్థిరత్వం కోల్పోయే పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయని భావిస్తున్నారు. మరి ఈ యుద్ధంలో అమెరికా ఎలాంటి పరిష్కారాన్నీ తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on October 14, 2024 11:57 pm
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ఇంకో 50 రోజులే సమయం ఉంది.…
వైసీపీ కార్యకర్త, గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసుల రికార్డులో రౌడీ షీటర్గా నమోదైన బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. మూసీ నది…
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలు క్రికెట్ పరంగా మరింత హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. రెండు…
థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చడంలో మల్టీప్లెక్సుల పాత్ర చాలా పెద్దది. పట్టుమని పాతిక రూపాయలు…
అల్లు అర్జున్ను తాజాగా ఓ నార్త్ ఇండియన్ అభిమాని కలవడం చర్చనీయాంశం అయింది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ నుంచి సైకిల్ మీద…