బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, దక్షిణాదిలో విలక్షణ నటుడిగా షాయాజీ షిండే మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనదైన డైలాగ్ డెలివరీతో, టైమింగ్ తో పలు తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే తాజాగా షాయాజీ షిండే సినీ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు.
తాజాగా మహారాష్ట్రలోని ఎన్సీపీలో షాయాజీ షిండే చేరారు. ఎన్సీపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్…షిండేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షాయాజీ షిండే పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో షాయాజీ షిండే ఎటువంటి ముద్ర వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో షిండే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే తన అభిప్రాయాన్ని పవన్ తో పంచుకున్నారు.
తాను మహారాష్ట్రలో ఇప్పటికే మూడు ఆలయాల్లో అమలు చేశానని అన్నారు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ హై కమాండ్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో షిండే-పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీలో షిండే చేరడంతో పవన్-షిండేల భేటీ దీని గురించేనేమో అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
This post was last modified on October 12, 2024 12:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…