బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, దక్షిణాదిలో విలక్షణ నటుడిగా షాయాజీ షిండే మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనదైన డైలాగ్ డెలివరీతో, టైమింగ్ తో పలు తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే తాజాగా షాయాజీ షిండే సినీ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు.
తాజాగా మహారాష్ట్రలోని ఎన్సీపీలో షాయాజీ షిండే చేరారు. ఎన్సీపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్…షిండేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షాయాజీ షిండే పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో షాయాజీ షిండే ఎటువంటి ముద్ర వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో షిండే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే తన అభిప్రాయాన్ని పవన్ తో పంచుకున్నారు.
తాను మహారాష్ట్రలో ఇప్పటికే మూడు ఆలయాల్లో అమలు చేశానని అన్నారు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ హై కమాండ్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో షిండే-పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీలో షిండే చేరడంతో పవన్-షిండేల భేటీ దీని గురించేనేమో అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…