Political News

రాజకీయాల్లోకి షాయాజీ షిండే

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, దక్షిణాదిలో విలక్షణ నటుడిగా షాయాజీ షిండే మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనదైన డైలాగ్ డెలివరీతో, టైమింగ్ తో పలు తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే తాజాగా షాయాజీ షిండే సినీ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు.

తాజాగా మహారాష్ట్రలోని ఎన్సీపీలో షాయాజీ షిండే చేరారు. ఎన్సీపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్…షిండేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షాయాజీ షిండే పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

మహారాష్ట్ర రాజకీయాల్లో షాయాజీ షిండే ఎటువంటి ముద్ర వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో షిండే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే తన అభిప్రాయాన్ని పవన్ తో పంచుకున్నారు.

తాను మహారాష్ట్రలో ఇప్పటికే మూడు ఆలయాల్లో అమలు చేశానని అన్నారు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ హై కమాండ్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో షిండే-పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీలో షిండే చేరడంతో పవన్-షిండేల భేటీ దీని గురించేనేమో అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

This post was last modified on October 12, 2024 12:52 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago