బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, దక్షిణాదిలో విలక్షణ నటుడిగా షాయాజీ షిండే మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనదైన డైలాగ్ డెలివరీతో, టైమింగ్ తో పలు తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే తాజాగా షాయాజీ షిండే సినీ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు.
తాజాగా మహారాష్ట్రలోని ఎన్సీపీలో షాయాజీ షిండే చేరారు. ఎన్సీపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్…షిండేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షాయాజీ షిండే పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో షాయాజీ షిండే ఎటువంటి ముద్ర వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో షిండే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే తన అభిప్రాయాన్ని పవన్ తో పంచుకున్నారు.
తాను మహారాష్ట్రలో ఇప్పటికే మూడు ఆలయాల్లో అమలు చేశానని అన్నారు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ హై కమాండ్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో షిండే-పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీలో షిండే చేరడంతో పవన్-షిండేల భేటీ దీని గురించేనేమో అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
This post was last modified on October 12, 2024 12:52 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…