టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా చంద్రబాబు కంటే ఎక్కువగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆరా తీసినట్టు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. “అసలేం జరిగింది?” అని చంద్రబాబును గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం.
దీనిపై చంద్రబాబు కూడా ఎన్ డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు-గుజరాత్) ఇచ్చిన నివేదికను కూడా ప్రధానికి అందించారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని పేర్కొందని.. దీనినే తాను మీడియా ముందు చెప్పుకొచ్చానని చంద్రబాబు వివరించినట్టు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇదేసమయంలో తిరుమల పవిత్రతను, రోజుకు ఎంత మంది భక్తులు వస్తున్నారు? ఎంతమందికి లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు? అసలు లడ్డూ ప్రాదాన్యం.. ఇలా అన్ని విషయాలను కూడా చంద్రబాబు వివరించినట్టు తెలిసింది.
వైసీపీ హయాంలో జరిగిన కొన్ని లోపాలు.. చేసిన నిర్ణయాల కారణంగానే ఇలా తక్కువ ధరలకు నెయ్యిని కొన్నారని.. దీనివల్లే కల్తీ జరిగి ఉంటుందని తాము అభిప్రాయపడుతున్నామని ప్రధానికి చంద్రబాబు వివరించినట్టు తెలిసింది. ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్లో కేటాయించిన 12 వేల కోట్ల రూపాయల్లో 6 వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని కూడా అభ్యర్థించారు. అదేవిధంగా వరద సాయం పై నా చంద్రబాబు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపారు. గడిచిన 100 రోజులపాలన కూడా బాగుందని ప్రధాని మోడీ సందర్భంగా చంద్రబాబును ప్రశంసించినట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు.
This post was last modified on October 7, 2024 9:45 pm
ఈ మధ్య వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు, దివ్వెల మాధురి అనే వివాహితకు మధ్య సంబంధం గురించి ఎంత రచ్చ…
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా రు. ఇటీవల వెలుగు చూసిన తిరుమల…
తెలంగాణ టీడీపీకి జోష్ వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత.. పార్టీకి పునర్వైభవం తెచ్చేలా.. వచ్చేలా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న,…
సూపర్ స్టార్ రజినీకాంత్కు సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్తో మంచి అనుబంధం ఉంది. వీరి కలయికలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్…
ఇటీవలే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిన ‘ఎన్’ కన్వెన్షన్ విషయమై ఇటీవల పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్…
ఒకప్పుడు తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే చక్కటి తెలుగు టైటిళ్లు పెట్టేవారు. మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు,…