Political News

ల‌డ్డూ విష‌యం ఏంటి: చంద్ర‌బాబుకు మోడీ ప్ర‌శ్న‌?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా చంద్ర‌బాబు కంటే ఎక్కువ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంపై ఆరా తీసిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. “అస‌లేం జ‌రిగింది?” అని చంద్ర‌బాబును గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.

దీనిపై చంద్ర‌బాబు కూడా ఎన్ డీడీబీ(నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డు-గుజ‌రాత్‌) ఇచ్చిన నివేదిక‌ను కూడా ప్ర‌ధానికి అందించారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టులో నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌ని పేర్కొంద‌ని.. దీనినే తాను మీడియా ముందు చెప్పుకొచ్చాన‌ని చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదేస‌మ‌యంలో తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను, రోజుకు ఎంత మంది భ‌క్తులు వ‌స్తున్నారు? ఎంత‌మందికి లడ్డూ ప్ర‌సాదం పంపిణీ చేస్తున్నారు? అస‌లు ల‌డ్డూ ప్రాదాన్యం.. ఇలా అన్ని విష‌యాల‌ను కూడా చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు తెలిసింది.

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని లోపాలు.. చేసిన నిర్ణ‌యాల కార‌ణంగానే ఇలా త‌క్కువ ధ‌ర‌ల‌కు నెయ్యిని కొన్నార‌ని.. దీనివ‌ల్లే క‌ల్తీ జ‌రిగి ఉంటుంద‌ని తాము అభిప్రాయ‌ప‌డుతున్నామ‌ని ప్ర‌ధానికి చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. పోల‌వరం ప్రాజెక్టుకు సంబంధించి బ‌డ్జెట్‌లో కేటాయించిన 12 వేల కోట్ల రూపాయ‌ల్లో 6 వేల కోట్ల‌ను త‌క్ష‌ణం విడుద‌ల చేయాల‌ని కూడా అభ్య‌ర్థించారు. అదేవిధంగా వ‌ర‌ద సాయం పై నా చంద్ర‌బాబు చ‌ర్చించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపారు. గ‌డిచిన 100 రోజులపాల‌న కూడా బాగుంద‌ని ప్ర‌ధాని మోడీ సంద‌ర్భంగా చంద్ర‌బాబును ప్ర‌శంసించిన‌ట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

48 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

51 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago