Political News

ల‌డ్డూ విష‌యం ఏంటి: చంద్ర‌బాబుకు మోడీ ప్ర‌శ్న‌?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా చంద్ర‌బాబు కంటే ఎక్కువ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంపై ఆరా తీసిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. “అస‌లేం జ‌రిగింది?” అని చంద్ర‌బాబును గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.

దీనిపై చంద్ర‌బాబు కూడా ఎన్ డీడీబీ(నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డు-గుజ‌రాత్‌) ఇచ్చిన నివేదిక‌ను కూడా ప్ర‌ధానికి అందించారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టులో నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌ని పేర్కొంద‌ని.. దీనినే తాను మీడియా ముందు చెప్పుకొచ్చాన‌ని చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదేస‌మ‌యంలో తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను, రోజుకు ఎంత మంది భ‌క్తులు వ‌స్తున్నారు? ఎంత‌మందికి లడ్డూ ప్ర‌సాదం పంపిణీ చేస్తున్నారు? అస‌లు ల‌డ్డూ ప్రాదాన్యం.. ఇలా అన్ని విష‌యాల‌ను కూడా చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు తెలిసింది.

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని లోపాలు.. చేసిన నిర్ణ‌యాల కార‌ణంగానే ఇలా త‌క్కువ ధ‌ర‌ల‌కు నెయ్యిని కొన్నార‌ని.. దీనివ‌ల్లే క‌ల్తీ జ‌రిగి ఉంటుంద‌ని తాము అభిప్రాయ‌ప‌డుతున్నామ‌ని ప్ర‌ధానికి చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. పోల‌వరం ప్రాజెక్టుకు సంబంధించి బ‌డ్జెట్‌లో కేటాయించిన 12 వేల కోట్ల రూపాయ‌ల్లో 6 వేల కోట్ల‌ను త‌క్ష‌ణం విడుద‌ల చేయాల‌ని కూడా అభ్య‌ర్థించారు. అదేవిధంగా వ‌ర‌ద సాయం పై నా చంద్ర‌బాబు చ‌ర్చించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపారు. గ‌డిచిన 100 రోజులపాల‌న కూడా బాగుంద‌ని ప్ర‌ధాని మోడీ సంద‌ర్భంగా చంద్ర‌బాబును ప్ర‌శంసించిన‌ట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు.

This post was last modified on October 7, 2024 9:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

11 minutes ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

1 hour ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

1 hour ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

3 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

3 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

4 hours ago