Political News

ల‌డ్డూ విష‌యం ఏంటి: చంద్ర‌బాబుకు మోడీ ప్ర‌శ్న‌?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా చంద్ర‌బాబు కంటే ఎక్కువ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంపై ఆరా తీసిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. “అస‌లేం జ‌రిగింది?” అని చంద్ర‌బాబును గుచ్చి గుచ్చి ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.

దీనిపై చంద్ర‌బాబు కూడా ఎన్ డీడీబీ(నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్ మెంట్ బోర్డు-గుజ‌రాత్‌) ఇచ్చిన నివేదిక‌ను కూడా ప్ర‌ధానికి అందించారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టులో నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌ని పేర్కొంద‌ని.. దీనినే తాను మీడియా ముందు చెప్పుకొచ్చాన‌ని చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదేస‌మ‌యంలో తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను, రోజుకు ఎంత మంది భ‌క్తులు వ‌స్తున్నారు? ఎంత‌మందికి లడ్డూ ప్ర‌సాదం పంపిణీ చేస్తున్నారు? అస‌లు ల‌డ్డూ ప్రాదాన్యం.. ఇలా అన్ని విష‌యాల‌ను కూడా చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు తెలిసింది.

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని లోపాలు.. చేసిన నిర్ణ‌యాల కార‌ణంగానే ఇలా త‌క్కువ ధ‌ర‌ల‌కు నెయ్యిని కొన్నార‌ని.. దీనివ‌ల్లే క‌ల్తీ జ‌రిగి ఉంటుంద‌ని తాము అభిప్రాయ‌ప‌డుతున్నామ‌ని ప్ర‌ధానికి చంద్ర‌బాబు వివ‌రించిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. పోల‌వరం ప్రాజెక్టుకు సంబంధించి బ‌డ్జెట్‌లో కేటాయించిన 12 వేల కోట్ల రూపాయ‌ల్లో 6 వేల కోట్ల‌ను త‌క్ష‌ణం విడుద‌ల చేయాల‌ని కూడా అభ్య‌ర్థించారు. అదేవిధంగా వ‌ర‌ద సాయం పై నా చంద్ర‌బాబు చ‌ర్చించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపారు. గ‌డిచిన 100 రోజులపాల‌న కూడా బాగుంద‌ని ప్ర‌ధాని మోడీ సంద‌ర్భంగా చంద్ర‌బాబును ప్ర‌శంసించిన‌ట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు.

This post was last modified on October 7, 2024 9:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

23 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago