టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా చంద్రబాబు కంటే ఎక్కువగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆరా తీసినట్టు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. “అసలేం జరిగింది?” అని చంద్రబాబును గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం.
దీనిపై చంద్రబాబు కూడా ఎన్ డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు-గుజరాత్) ఇచ్చిన నివేదికను కూడా ప్రధానికి అందించారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని పేర్కొందని.. దీనినే తాను మీడియా ముందు చెప్పుకొచ్చానని చంద్రబాబు వివరించినట్టు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇదేసమయంలో తిరుమల పవిత్రతను, రోజుకు ఎంత మంది భక్తులు వస్తున్నారు? ఎంతమందికి లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు? అసలు లడ్డూ ప్రాదాన్యం.. ఇలా అన్ని విషయాలను కూడా చంద్రబాబు వివరించినట్టు తెలిసింది.
వైసీపీ హయాంలో జరిగిన కొన్ని లోపాలు.. చేసిన నిర్ణయాల కారణంగానే ఇలా తక్కువ ధరలకు నెయ్యిని కొన్నారని.. దీనివల్లే కల్తీ జరిగి ఉంటుందని తాము అభిప్రాయపడుతున్నామని ప్రధానికి చంద్రబాబు వివరించినట్టు తెలిసింది. ఇదిలావుంటే.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్లో కేటాయించిన 12 వేల కోట్ల రూపాయల్లో 6 వేల కోట్లను తక్షణం విడుదల చేయాలని కూడా అభ్యర్థించారు. అదేవిధంగా వరద సాయం పై నా చంద్రబాబు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపారు. గడిచిన 100 రోజులపాలన కూడా బాగుందని ప్రధాని మోడీ సందర్భంగా చంద్రబాబును ప్రశంసించినట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు.
This post was last modified on October 7, 2024 9:45 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…