Political News

జ‌గ‌న్ ప్ర‌భుత్వ కుర్చీలు దొంగిలించాడు: లోకేష్

కొత్త సీసాలో పాత సారా! అనే సామెత‌ను వైసీపీ, టీడీపీలు మ‌రోసారి నిరూపిస్తున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితా లు వ‌చ్చిన జూన్ 4 త‌ర్వాత తొలిసారి ఒక కీల‌క వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఫ‌స్టు ఫ‌స్టు.. ఈ వివాదంతోనే రెండు పార్టీలు విమ‌ర్శ‌లు కూడా చేసుకున్నాయి. అదే.. ఫ‌ర్నిచ‌ర్ ర‌గ‌డ. అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అప్ప‌ట్లో వైసీపీ అధికారం దిగిపోయిన త‌ర్వాత‌.. కోటిన్న‌ర రూపాయ‌ల విలువ చేసే ఫ‌ర్నిచ‌ర్‌ను త‌న ద‌గ్గ‌రే ఉంచేసుకుంద‌ని.. క్యాంపు కార్యాల‌యంలో మ‌రో రెండు కోట్ల రూపాయ‌లు పెట్టి హంగామా చేసుకు న్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు.

ఇది రాజ‌కీయంగా అప్ప‌ట్లో ర‌చ్చ‌కు దారి తీసింది. ఫ‌ర్నిచ‌ర్ దొంగ‌లు అంటూ వైసీపీ నేత‌ల‌పై టీడీపీ ఫైర్ బ్రాండ్లు కొంద‌రు ర‌చ్చ చేశారు. చివ‌ర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌(జీఏడీ) అధికారులు జోక్యం చేసుకుని.. వైసీపీ కార్యాల‌యానికి లేఖ రాశారు. ఫ‌ర్నిచ‌ర్‌ను అప్ప‌గించండి అని పేర్కొన్నారు. అయితే.. దీనికి ముందే.. వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా లేఖ రాశారు. మీకు కావాలంటే ఫ‌ర్నిచ‌ర్ తీసుకువెళ్లండి.. లేక‌పోతే ఇంత కావాల‌ని లెక్క‌గ‌డితే .. ఆ సొమ్మునైనా ఇచ్చేస్తాం అని తేల్చి చెప్పారు.

ఆ త‌ర్వాత‌.. ఈ వ్య‌వ‌హారం మాయ‌మైంది. ఇంత‌లో ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న క్షేత్ర‌స్థా యి వివాదాలు, పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి జైలు, తాడిప‌త్రిలో జేసీ వ‌ర్సెస్ పెద్దారెడ్డి వివాదాల నేప‌థ్యంలో ఫ‌ర్నిచ‌ర్ సంగ‌తిని అంద‌రూ మ‌రిచిపోయారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఈ విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్పుడు వైసీపీనే ముందుగా స్పందించింది. లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మ‌రో లేఖ సంధించారు. మీరు తీసుకుంటామ‌ని చెప్పిన ఫ‌ర్నిచ‌ర్‌ను ఎందుకు తీసుకోలేదు.. అని కూడా ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టికే తాము నాలుగు సార్లు లేఖలు రాశామ‌ని అయినా.. స‌ర్కారు స్పందించ‌లేద‌ని అప్పిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు.. త‌మ‌పై నింద‌లు మోపేందుకు ఇలా తాత్సారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ దాదా 40 దొంగ‌లు అంటూ ఆయ‌న ఎదురు దాడి చేశారు. ప్ర‌జ‌లు కుర్చీ దింపేసినా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ కుర్చీలు దొంగిలించాడ‌ని.. అన్నారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి ఫ‌ర్నిచ‌ర్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రి ఇప్ప‌టికైనా దీనికి ముగింపు ప‌లుకుతారో.. లేక సాగ‌దీస్తారో చూడాలి.

This post was last modified on October 4, 2024 4:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

45 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago