Political News

జ‌గ‌న్ ప్ర‌భుత్వ కుర్చీలు దొంగిలించాడు: లోకేష్

కొత్త సీసాలో పాత సారా! అనే సామెత‌ను వైసీపీ, టీడీపీలు మ‌రోసారి నిరూపిస్తున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితా లు వ‌చ్చిన జూన్ 4 త‌ర్వాత తొలిసారి ఒక కీల‌క వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఫ‌స్టు ఫ‌స్టు.. ఈ వివాదంతోనే రెండు పార్టీలు విమ‌ర్శ‌లు కూడా చేసుకున్నాయి. అదే.. ఫ‌ర్నిచ‌ర్ ర‌గ‌డ. అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అప్ప‌ట్లో వైసీపీ అధికారం దిగిపోయిన త‌ర్వాత‌.. కోటిన్న‌ర రూపాయ‌ల విలువ చేసే ఫ‌ర్నిచ‌ర్‌ను త‌న ద‌గ్గ‌రే ఉంచేసుకుంద‌ని.. క్యాంపు కార్యాల‌యంలో మ‌రో రెండు కోట్ల రూపాయ‌లు పెట్టి హంగామా చేసుకు న్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు.

ఇది రాజ‌కీయంగా అప్ప‌ట్లో ర‌చ్చ‌కు దారి తీసింది. ఫ‌ర్నిచ‌ర్ దొంగ‌లు అంటూ వైసీపీ నేత‌ల‌పై టీడీపీ ఫైర్ బ్రాండ్లు కొంద‌రు ర‌చ్చ చేశారు. చివ‌ర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌(జీఏడీ) అధికారులు జోక్యం చేసుకుని.. వైసీపీ కార్యాల‌యానికి లేఖ రాశారు. ఫ‌ర్నిచ‌ర్‌ను అప్ప‌గించండి అని పేర్కొన్నారు. అయితే.. దీనికి ముందే.. వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా లేఖ రాశారు. మీకు కావాలంటే ఫ‌ర్నిచ‌ర్ తీసుకువెళ్లండి.. లేక‌పోతే ఇంత కావాల‌ని లెక్క‌గ‌డితే .. ఆ సొమ్మునైనా ఇచ్చేస్తాం అని తేల్చి చెప్పారు.

ఆ త‌ర్వాత‌.. ఈ వ్య‌వ‌హారం మాయ‌మైంది. ఇంత‌లో ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న క్షేత్ర‌స్థా యి వివాదాలు, పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి జైలు, తాడిప‌త్రిలో జేసీ వ‌ర్సెస్ పెద్దారెడ్డి వివాదాల నేప‌థ్యంలో ఫ‌ర్నిచ‌ర్ సంగ‌తిని అంద‌రూ మ‌రిచిపోయారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఈ విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్పుడు వైసీపీనే ముందుగా స్పందించింది. లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మ‌రో లేఖ సంధించారు. మీరు తీసుకుంటామ‌ని చెప్పిన ఫ‌ర్నిచ‌ర్‌ను ఎందుకు తీసుకోలేదు.. అని కూడా ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టికే తాము నాలుగు సార్లు లేఖలు రాశామ‌ని అయినా.. స‌ర్కారు స్పందించ‌లేద‌ని అప్పిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు.. త‌మ‌పై నింద‌లు మోపేందుకు ఇలా తాత్సారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ దాదా 40 దొంగ‌లు అంటూ ఆయ‌న ఎదురు దాడి చేశారు. ప్ర‌జ‌లు కుర్చీ దింపేసినా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ కుర్చీలు దొంగిలించాడ‌ని.. అన్నారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి ఫ‌ర్నిచ‌ర్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌రి ఇప్ప‌టికైనా దీనికి ముగింపు ప‌లుకుతారో.. లేక సాగ‌దీస్తారో చూడాలి.

This post was last modified on October 4, 2024 4:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శంకర్‌కు నష్టం.. నిర్మాతకు లాభం

ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్‌ల క్రేజీ…

2 hours ago

నా భ‌వ‌నాలైనా కూల్చేయండి: రేవంత్‌కు కేపీవీ ఆఫ‌ర్‌

కేవీపీ రామ‌చంద్ర‌రావు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని దాదాపు…

5 hours ago

ప్రభాస్ పుట్టినరోజుకి ఏం ఇవ్వబోతున్నారు

ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…

6 hours ago

నందిగం సురేష్‌కు బెయిల్‌.. ఎన్ని ష‌ర‌తులంటే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బాప‌ట్ల‌ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం గుంటూరు జైల్లో…

6 hours ago

తగ్గిపోతున్న OTT జోరు దేనికి సంకేతం

కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…

8 hours ago

జ‌న‌సేన రైటిస్టు పార్టీగా మారిందా?: ష‌ర్మిల

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

9 hours ago