తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దేశమంతా ఒకటే గళం వినిపించాలని, జాతి, మత భేదం లేకుండా మాట్లాడాలని వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలని పవన్ అన్నారు.
సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఎదురు దాడి చేయడం లేదని, ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సెక్యులరిజం వన్ వే కాదని, టూ వే అని, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని పవన్ అన్నారు. ఈ వారాహి డిక్లరేషన్ ను తిరుపతి స్వామి వారి సన్నిధి నుండి ప్రకటిస్తున్నానని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిలుపునిస్తున్నానని పవన్ చెప్పారు.
తప్పు అని తెలిసినపుడు మతాలకు అతీతంగా మాట్లాడాలి కదా? అని పవన్ అన్నారు. హిందువులలో చిత్ర పరిశ్రమ, పారిశ్రామిక వేత్తలు, మేధావులు ఉన్నారని, వారంతా సనాతన ధర్మానికి భంగం కలిగినప్పుడు ఎందుకు మాట్లాడరని అన్నారు. మహ్మద్ ప్రవక్త లేదా జీసస్ మీద ఇలా జరిగితే మౌనంగా ఉంటారా? ఇదేనా మీ సెక్యులరిజం? అని ప్రశ్నించారు. ఇతర మతాలపై దాడి జరిగితే అందరూ మాట్లాడుతారని, కానీ సనాతన ధర్మం పై దాడి జరిగితే మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అన్ని మతాల సంస్కృతి, దేవతా మూర్తుల బొమ్మలు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకి అది నిదర్శనం అని, ఆ విషయానికి ప్రధాని మోడీ మళ్లీ ప్రాచుర్యం కల్పించారని పవన్ అన్నారు.
7 పాయింట్లతో వారాహి డిక్లరేషన్:
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…