తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దేశమంతా ఒకటే గళం వినిపించాలని, జాతి, మత భేదం లేకుండా మాట్లాడాలని వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలని పవన్ అన్నారు.
సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఎదురు దాడి చేయడం లేదని, ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సెక్యులరిజం వన్ వే కాదని, టూ వే అని, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని పవన్ అన్నారు. ఈ వారాహి డిక్లరేషన్ ను తిరుపతి స్వామి వారి సన్నిధి నుండి ప్రకటిస్తున్నానని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిలుపునిస్తున్నానని పవన్ చెప్పారు.
తప్పు అని తెలిసినపుడు మతాలకు అతీతంగా మాట్లాడాలి కదా? అని పవన్ అన్నారు. హిందువులలో చిత్ర పరిశ్రమ, పారిశ్రామిక వేత్తలు, మేధావులు ఉన్నారని, వారంతా సనాతన ధర్మానికి భంగం కలిగినప్పుడు ఎందుకు మాట్లాడరని అన్నారు. మహ్మద్ ప్రవక్త లేదా జీసస్ మీద ఇలా జరిగితే మౌనంగా ఉంటారా? ఇదేనా మీ సెక్యులరిజం? అని ప్రశ్నించారు. ఇతర మతాలపై దాడి జరిగితే అందరూ మాట్లాడుతారని, కానీ సనాతన ధర్మం పై దాడి జరిగితే మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అన్ని మతాల సంస్కృతి, దేవతా మూర్తుల బొమ్మలు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకి అది నిదర్శనం అని, ఆ విషయానికి ప్రధాని మోడీ మళ్లీ ప్రాచుర్యం కల్పించారని పవన్ అన్నారు.
7 పాయింట్లతో వారాహి డిక్లరేషన్:
This post was last modified on October 4, 2024 10:06 am
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…