తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. దేశమంతా ఒకటే గళం వినిపించాలని, జాతి, మత భేదం లేకుండా మాట్లాడాలని వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలని పవన్ అన్నారు.
సనాతన ధర్మంపై దాడులు జరుగుతుంటే ఎదురు దాడి చేయడం లేదని, ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సెక్యులరిజం వన్ వే కాదని, టూ వే అని, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని పవన్ అన్నారు. ఈ వారాహి డిక్లరేషన్ ను తిరుపతి స్వామి వారి సన్నిధి నుండి ప్రకటిస్తున్నానని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిలుపునిస్తున్నానని పవన్ చెప్పారు.
తప్పు అని తెలిసినపుడు మతాలకు అతీతంగా మాట్లాడాలి కదా? అని పవన్ అన్నారు. హిందువులలో చిత్ర పరిశ్రమ, పారిశ్రామిక వేత్తలు, మేధావులు ఉన్నారని, వారంతా సనాతన ధర్మానికి భంగం కలిగినప్పుడు ఎందుకు మాట్లాడరని అన్నారు. మహ్మద్ ప్రవక్త లేదా జీసస్ మీద ఇలా జరిగితే మౌనంగా ఉంటారా? ఇదేనా మీ సెక్యులరిజం? అని ప్రశ్నించారు. ఇతర మతాలపై దాడి జరిగితే అందరూ మాట్లాడుతారని, కానీ సనాతన ధర్మం పై దాడి జరిగితే మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అన్ని మతాల సంస్కృతి, దేవతా మూర్తుల బొమ్మలు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకి అది నిదర్శనం అని, ఆ విషయానికి ప్రధాని మోడీ మళ్లీ ప్రాచుర్యం కల్పించారని పవన్ అన్నారు.
7 పాయింట్లతో వారాహి డిక్లరేషన్:
This post was last modified on October 4, 2024 10:06 am
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…