అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ సీనియర్ మంత్రి, పైగా మహిళా నాయకురాలు కొండా సురేఖ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా.. సామాజికంగా కూడా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల పర్యవసానం ఎలా ఉన్నా.. అన్ని వర్గాల ప్రముఖులు, సాధారణ ప్రజలు కూడా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించడం లేదు. ఈ క్రమంలో ఆయా వర్గాలు అక్కినేని కుటుంబానికి అండగా నిలిచాయి.
ముఖ్యంగా టాలీవుడ్ అయితే.. మీడియా సమావేశం పెట్టి మరీ సురేఖ తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది. అయితే.. అప్పటికే సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ప్రెస్మీట్ను వాయిదా వేసుకున్నారు. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం సురేఖ తీరుపై నిప్పులు చెరిగారు. వారు వీరు అనే తేడా లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నాగార్జున కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నటులు, ఇతర ఆర్టిస్టులు కూడా ఖండించారు.
ఇది మంచి పరిణామమే. ఒక్క కాకికి కష్టం వస్తే.. మిగిలిన కాకులు కూడా ఏకమైనట్టుగా టాలీవుడ్ కలిసి రావడాన్ని అందరూ హర్షిస్తున్నారు. కానీ, ఇక్కడే చిన్న చిక్కు వచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో చిరంజీవి సహా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయి లో దుర్భాషలాడినప్పుడు ఈ టాలీవుడ్ నుంచి ఒక్కరూ స్పందించలేదన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఇది ప్రస్తావనార్హం కాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆగడం లేదు.
నాడు మౌనంగా ఎందుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. మెగా కుటుంబంలోని చిరు మాతృమూర్తి నుంచి అనేక మందివైసీపీ నాయకులు దుర్భాషలాడారని, అప్పట్లో ఈ టాలీవుడ్ ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియా జనాలు నిప్పులు చెరుగుతున్నారు. సహజంగానే ఇలాంటివి ఒక్కరితో పోవు.. తర్వాత పాకుతాయి.. అనడానికి కొండా సురేఖ ఉదంతాన్నివారు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అప్పట్లోనే టాలీవుడ్ స్పందించి కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పుడు తెలంగాణ ఉదంతం జరిగి ఉండేది కాదన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.
This post was last modified on October 3, 2024 7:54 pm
ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో…
కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు…
దేవర విజయాన్ని ఆస్వాదిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఇచ్చిన కమిట్ మెంట్లు మూడు. మొదటిది వార్ 2. ఇది జనవరి…
అతి సర్వత్ర వర్జయేత్! అంటుంది 'సనాతన ధర్మం'. అతిగా ఏ విషయంపైనా స్పందించకూడదనేది ఈ ధర్మం చెబుతున్న మాట. అంతేకాదు..…