అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ సీనియర్ మంత్రి, పైగా మహిళా నాయకురాలు కొండా సురేఖ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా.. సామాజికంగా కూడా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల పర్యవసానం ఎలా ఉన్నా.. అన్ని వర్గాల ప్రముఖులు, సాధారణ ప్రజలు కూడా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించడం లేదు. ఈ క్రమంలో ఆయా వర్గాలు అక్కినేని కుటుంబానికి అండగా నిలిచాయి.
ముఖ్యంగా టాలీవుడ్ అయితే.. మీడియా సమావేశం పెట్టి మరీ సురేఖ తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది. అయితే.. అప్పటికే సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ప్రెస్మీట్ను వాయిదా వేసుకున్నారు. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం సురేఖ తీరుపై నిప్పులు చెరిగారు. వారు వీరు అనే తేడా లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నాగార్జున కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నటులు, ఇతర ఆర్టిస్టులు కూడా ఖండించారు.
ఇది మంచి పరిణామమే. ఒక్క కాకికి కష్టం వస్తే.. మిగిలిన కాకులు కూడా ఏకమైనట్టుగా టాలీవుడ్ కలిసి రావడాన్ని అందరూ హర్షిస్తున్నారు. కానీ, ఇక్కడే చిన్న చిక్కు వచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో చిరంజీవి సహా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయి లో దుర్భాషలాడినప్పుడు ఈ టాలీవుడ్ నుంచి ఒక్కరూ స్పందించలేదన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఇది ప్రస్తావనార్హం కాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆగడం లేదు.
నాడు మౌనంగా ఎందుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. మెగా కుటుంబంలోని చిరు మాతృమూర్తి నుంచి అనేక మందివైసీపీ నాయకులు దుర్భాషలాడారని, అప్పట్లో ఈ టాలీవుడ్ ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియా జనాలు నిప్పులు చెరుగుతున్నారు. సహజంగానే ఇలాంటివి ఒక్కరితో పోవు.. తర్వాత పాకుతాయి.. అనడానికి కొండా సురేఖ ఉదంతాన్నివారు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అప్పట్లోనే టాలీవుడ్ స్పందించి కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పుడు తెలంగాణ ఉదంతం జరిగి ఉండేది కాదన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.
This post was last modified on October 3, 2024 7:54 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…