తెలంగాణ మహిళా మంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు కొండా సురేఖ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కు కున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబాన్ని రాజకీయంగా ఆమె రోడ్డుకు లాగేసిన తర్వాత.. పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. టాలీవుడ్ నుంచి సెలబ్రిటీల వరకు కూడా అనేక మంది ఆమె తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా నాగార్జున మాజీ కోడలు సమంతను టార్గెట్ చేయడాన్ని చాలా మంది నిరసిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు.
అయినా.. అక్కినేని నాగార్జున శాంతించలేదు. తాజాగా మంత్రి కొండా సురేఖపై ఆయన నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే అక్కినేని కుటుంబం ఈ విషయంలోనూ ముందు.. సెన్సిటివ్గానే స్పందించింది. సురేఖ వ్యాఖ్యల తర్వాత అక్కినేని వెంటనే తెరమీది వచ్చారు. ఇలా చేయడం సమంజసం కాదన్నారు. మంత్రిగారు తమ కుటుంబాన్ని రాజకీయాల్లో కి లాగరాదని కూడా పేర్కొన్నారు.
అంతేకాదు.. రాజకీయాల్లోకి సెలబ్రిటీల జీవితాలను లాగొద్దని కూడా ఆయన అభ్యర్థించారు. అయినా.. ఎక్కడో ముల్లు మాదిరిగా సురేఖ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని గుచ్చుతూనే ఉన్నాయి. పైగా సురేఖ వ్యాఖ్యలు సీరియస్గా ఉండడం.. తమ కుటుంబానికి మాయని మచ్చగా మారుతున్నట్టు భావించారో ఏమో.. నాగార్జున గురువారం.. న్యాయపోరాటానికి దిగారు. మంత్రి సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు. తాము ఇన్నేళ్లుగా పరువుగా బతుకుతున్నామని.. సమాజంలో తమకు ఒక స్టేటస్ ఉందని, ఎన్నడూ తాము రాజకీయాల్లోకి రాలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అలాంటి తమ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్కు సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియో పెన్ డ్రైవ్ను కూడా కోర్టుకు సమర్పించారు.
This post was last modified on October 3, 2024 7:53 pm
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…