తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ.. సీఎం చంద్రబాబు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. సదరు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, ఇది తనను ఎంతో బాధించిందని ఆయన గత నెల 18న నేరుగా మీడియా ముందు చెప్పుకొచ్చారు.
అప్పటి వరకు దీనిపై ఎవరూ కామెంట్ చేయకపోవడం.. అనూహ్యంగా సీఎం స్పం దించడంతో ఇది పెను వివాదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించా రు. అయితే.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత.. సీఎం చంద్రబాబును సుప్రీంకోర్టు ద్వి సభ్య ధర్మాసనం నిలదీసింది.
నెయ్యిలో కల్తీ జరిగిందని.. మీడియా ముందుకు వచ్చి ఎలా చెబుతారని, అసలు నెయ్యి కల్తీ జరిగిందన్న రుజువులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతల నుంచి ఎవరూ స్పందించలే దు. కోర్టు అభిమతం మేరకు తాము నడుచుకుంటామని మాత్రమే మంత్రులు చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఈ విషయంపై స్పందించారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోతే.. ఎవరు మాట్లాడతారని ఆమె ప్రశ్నిచారు. లడ్డూ వివాదం లో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు విన్నాను. కానీ, ఈ విషయంలో ఏం జరిగిందో అదే చంద్రబాబు మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదు. సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అనడం సరికాదు. రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ఆయనకు తప్పకుండా ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనైనా మాట్లాడతారు. చట్టవిరుద్ధంగా ఏం మాట్లాడలేదు. కానీ లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
This post was last modified on October 2, 2024 2:57 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…