Political News

బాబుకు అండ గా నిలిచిన చిన్నమ్మ

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి వినియోగించే నెయ్యి క‌ల్తీ జ‌రిగిందంటూ.. సీఎం చంద్ర‌బాబు మీడియా ముందు చెప్పిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని, ఇది త‌న‌ను ఎంతో బాధించింద‌ని ఆయ‌న గ‌త నెల 18న నేరుగా మీడియా ముందు చెప్పుకొచ్చారు.

అప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎవ‌రూ కామెంట్ చేయ‌క‌పోవ‌డం.. అనూహ్యంగా సీఎం స్పం దించ‌డంతో ఇది పెను వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై త‌ర్వాత ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా నియ‌మించా రు. అయితే.. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టుకు చేరిన త‌ర్వాత‌.. సీఎం చంద్ర‌బాబును సుప్రీంకోర్టు ద్వి స‌భ్య ధ‌ర్మాసనం నిల‌దీసింది.

నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని.. మీడియా ముందుకు వ‌చ్చి ఎలా చెబుతార‌ని, అస‌లు నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌న్న రుజువులు ఎక్క‌డ ఉన్నాయ‌ని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ల నుంచి ఎవ‌రూ స్పందించ‌లే దు. కోర్టు అభిమతం మేర‌కు తాము న‌డుచుకుంటామ‌ని మాత్ర‌మే మంత్రులు చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఈ విష‌యంపై స్పందించారు. సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె అన్నారు. మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడేందుకు ఆయ‌నకు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌న్నారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ వివాదంపై సీఎం చంద్ర‌బాబు మాట్లాడ‌క‌పోతే.. ఎవ‌రు మాట్లాడ‌తార‌ని ఆమె ప్ర‌శ్నిచారు. లడ్డూ వివాదం లో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు విన్నాను. కానీ, ఈ విష‌యంలో ఏం జరిగిందో అదే చంద్రబాబు మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదు. సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అనడం సరికాదు. రాజ్యాంగబ‌ద్ధ‌మైన సీఎం పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ఆయ‌న‌కు త‌ప్ప‌కుండా ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనైనా మాట్లాడతారు. చట్టవిరుద్ధంగా ఏం మాట్లాడలేదు. కానీ లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

This post was last modified on October 2, 2024 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago