Political News

బాబుకు అండ గా నిలిచిన చిన్నమ్మ

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి వినియోగించే నెయ్యి క‌ల్తీ జ‌రిగిందంటూ.. సీఎం చంద్ర‌బాబు మీడియా ముందు చెప్పిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని, ఇది త‌న‌ను ఎంతో బాధించింద‌ని ఆయ‌న గ‌త నెల 18న నేరుగా మీడియా ముందు చెప్పుకొచ్చారు.

అప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎవ‌రూ కామెంట్ చేయ‌క‌పోవ‌డం.. అనూహ్యంగా సీఎం స్పం దించ‌డంతో ఇది పెను వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై త‌ర్వాత ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా నియ‌మించా రు. అయితే.. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టుకు చేరిన త‌ర్వాత‌.. సీఎం చంద్ర‌బాబును సుప్రీంకోర్టు ద్వి స‌భ్య ధ‌ర్మాసనం నిల‌దీసింది.

నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని.. మీడియా ముందుకు వ‌చ్చి ఎలా చెబుతార‌ని, అస‌లు నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌న్న రుజువులు ఎక్క‌డ ఉన్నాయ‌ని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ల నుంచి ఎవ‌రూ స్పందించ‌లే దు. కోర్టు అభిమతం మేర‌కు తాము న‌డుచుకుంటామ‌ని మాత్ర‌మే మంత్రులు చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఈ విష‌యంపై స్పందించారు. సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె అన్నారు. మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడేందుకు ఆయ‌నకు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌న్నారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ వివాదంపై సీఎం చంద్ర‌బాబు మాట్లాడ‌క‌పోతే.. ఎవ‌రు మాట్లాడ‌తార‌ని ఆమె ప్ర‌శ్నిచారు. లడ్డూ వివాదం లో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు విన్నాను. కానీ, ఈ విష‌యంలో ఏం జరిగిందో అదే చంద్రబాబు మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదు. సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అనడం సరికాదు. రాజ్యాంగబ‌ద్ధ‌మైన సీఎం పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ఆయ‌న‌కు త‌ప్ప‌కుండా ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనైనా మాట్లాడతారు. చట్టవిరుద్ధంగా ఏం మాట్లాడలేదు. కానీ లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

This post was last modified on October 2, 2024 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

18 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

44 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

1 hour ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago