Political News

ల‌డ్డూపై `సిట్‌` విచార‌ణ‌కు బ్రేక్‌.. ఏం జ‌రిగింది?

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారన్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై నిగ్గు తేల్చేందుకు.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) త‌న ప‌నిని ఆపేసింది. వాస్త‌వానికి గ‌త రెండు రోజులుగా ఇదే ప‌నిపై సిట్ ఉన్న విష‌యం తెలిసిందే. సిట్ అధిప‌తి స‌ర్వ‌శ్రేష్ఠ త్రిపాఠీ స్వ‌యంగా రంగంలోకి దిగి.. తిరుమ‌ల‌లో ప‌ర్య‌టించి.. ల‌డ్డూ త‌యారు చేసే పోటు ప్రాంతాన్ని ప‌రిశీలించారు. అదేవిధంగా తిరుమ‌ల‌కు వివిధ ప్రాంతాల నుంచి కాంట్రాక్టుపై నెయ్యిని తీసుకువ‌చ్చే ట్యాంక‌ర్ల‌ను కూడా ఆయ‌న ప‌రిశీలించారు. అధికారుల‌ను కూడా సంప్ర‌దించి ఏం జ‌రుగుతోందో తెలుసుకున్నారు.

ఈ సిట్ ద‌ర్యాప్తు మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఈ విచార‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం బ్రేక్ వేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా డీజీపీ ద్వారకా తిరుమ‌ల రావు వెల్ల‌డించారు. సిట్ ద‌ర్యాప్తును తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డం.. వాటిపై విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చే వ‌ర‌కు సిట్ ద‌ర్యాప్తును నిలుపుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ద్వార కా తిరుమ‌ల రావు తెలిపారు. అంతేకాదు.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ముందుకు సాగుతామ‌న్నారు.

ఇదిలావుంటే.. సిట్ ఎందుకు వేయాల్సి వ‌చ్చింద‌నే విష‌యాన్ని డీజీపీ తిరుమ‌ల‌రావు ప్ర‌స్తావిస్తూ.. కేసు తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద ని.. కోట్లాది మంది హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన విష‌యం కావ‌డంతో ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కు సిట్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు డీజీపీ వివ‌రించారు. ద‌ర్యాప్తును నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిపిస్తామ‌ని.. రాజ‌కీయ జోక్యానికి తావు ఉండ‌ద‌ని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసును సుప్రీంకోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించిన నేప‌థ్యంలో ఆ కోర్టు ఆదేశాల మేర‌కు త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే సిట్ ద‌ర్యాప్తును ఈ నెల 3వ తేదీ వ‌ర‌కు నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు వివ‌రించారు.  

ఏఆర్ సంస్థ‌పై కేసు

తిరుమ‌ల‌కు నెయ్యిని స‌ర‌ఫ‌రా చేసిన త‌మిళ‌నాడులోని దుండిగ‌ల్ కు చెందిన ఏఆర్ సంస్థ‌పై కేసు న‌మోదైన‌ట్టు డీజీపీ తెలిపారు. నెయ్యి క‌ల్తీ స‌హా.. ఆహార ప‌దార్థాల నాణ్య‌త‌పైనా ఫిర్యాదులు రావ‌డంతోనే కేసు న‌మోదు చేశామ‌న్నారు. అయితే.. నోటీసులు ఇవ్వ‌లేద‌న్న ఆ సంస్థ య‌జ‌మాని రాజ‌శేఖ‌ర‌న్ వాద‌న‌ల‌పై స్పందించేందుకు డీజీపీ నిరాక‌రించారు. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉంద‌ని.. కాబ‌ట్టి దీనిపైకోర్టు సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్తామ‌న్నారు. 

Satya

Recent Posts

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

2 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

2 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

3 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

3 hours ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

4 hours ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

4 hours ago