Political News

ల‌డ్డూపై `సిట్‌` విచార‌ణ‌కు బ్రేక్‌.. ఏం జ‌రిగింది?

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారన్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై నిగ్గు తేల్చేందుకు.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) త‌న ప‌నిని ఆపేసింది. వాస్త‌వానికి గ‌త రెండు రోజులుగా ఇదే ప‌నిపై సిట్ ఉన్న విష‌యం తెలిసిందే. సిట్ అధిప‌తి స‌ర్వ‌శ్రేష్ఠ త్రిపాఠీ స్వ‌యంగా రంగంలోకి దిగి.. తిరుమ‌ల‌లో ప‌ర్య‌టించి.. ల‌డ్డూ త‌యారు చేసే పోటు ప్రాంతాన్ని ప‌రిశీలించారు. అదేవిధంగా తిరుమ‌ల‌కు వివిధ ప్రాంతాల నుంచి కాంట్రాక్టుపై నెయ్యిని తీసుకువ‌చ్చే ట్యాంక‌ర్ల‌ను కూడా ఆయ‌న ప‌రిశీలించారు. అధికారుల‌ను కూడా సంప్ర‌దించి ఏం జ‌రుగుతోందో తెలుసుకున్నారు.

ఈ సిట్ ద‌ర్యాప్తు మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఈ విచార‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం బ్రేక్ వేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా డీజీపీ ద్వారకా తిరుమ‌ల రావు వెల్ల‌డించారు. సిట్ ద‌ర్యాప్తును తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డం.. వాటిపై విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చే వ‌ర‌కు సిట్ ద‌ర్యాప్తును నిలుపుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ద్వార కా తిరుమ‌ల రావు తెలిపారు. అంతేకాదు.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ముందుకు సాగుతామ‌న్నారు.

ఇదిలావుంటే.. సిట్ ఎందుకు వేయాల్సి వ‌చ్చింద‌నే విష‌యాన్ని డీజీపీ తిరుమ‌ల‌రావు ప్ర‌స్తావిస్తూ.. కేసు తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద ని.. కోట్లాది మంది హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన విష‌యం కావ‌డంతో ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కు సిట్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు డీజీపీ వివ‌రించారు. ద‌ర్యాప్తును నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిపిస్తామ‌ని.. రాజ‌కీయ జోక్యానికి తావు ఉండ‌ద‌ని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసును సుప్రీంకోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించిన నేప‌థ్యంలో ఆ కోర్టు ఆదేశాల మేర‌కు త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే సిట్ ద‌ర్యాప్తును ఈ నెల 3వ తేదీ వ‌ర‌కు నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు వివ‌రించారు.  

ఏఆర్ సంస్థ‌పై కేసు

తిరుమ‌ల‌కు నెయ్యిని స‌ర‌ఫ‌రా చేసిన త‌మిళ‌నాడులోని దుండిగ‌ల్ కు చెందిన ఏఆర్ సంస్థ‌పై కేసు న‌మోదైన‌ట్టు డీజీపీ తెలిపారు. నెయ్యి క‌ల్తీ స‌హా.. ఆహార ప‌దార్థాల నాణ్య‌త‌పైనా ఫిర్యాదులు రావ‌డంతోనే కేసు న‌మోదు చేశామ‌న్నారు. అయితే.. నోటీసులు ఇవ్వ‌లేద‌న్న ఆ సంస్థ య‌జ‌మాని రాజ‌శేఖ‌ర‌న్ వాద‌న‌ల‌పై స్పందించేందుకు డీజీపీ నిరాక‌రించారు. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉంద‌ని.. కాబ‌ట్టి దీనిపైకోర్టు సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్తామ‌న్నారు. 

This post was last modified on October 2, 2024 12:54 pm

Share

Recent Posts

యష్ ఇమేజ్ వల్లే ఇంత ఓపెనింగ్

టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…

6 minutes ago

చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…

1 hour ago

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

2 hours ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

2 hours ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

4 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

10 hours ago