Political News

ల‌డ్డూపై `సిట్‌` విచార‌ణ‌కు బ్రేక్‌.. ఏం జ‌రిగింది?

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారన్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై నిగ్గు తేల్చేందుకు.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) త‌న ప‌నిని ఆపేసింది. వాస్త‌వానికి గ‌త రెండు రోజులుగా ఇదే ప‌నిపై సిట్ ఉన్న విష‌యం తెలిసిందే. సిట్ అధిప‌తి స‌ర్వ‌శ్రేష్ఠ త్రిపాఠీ స్వ‌యంగా రంగంలోకి దిగి.. తిరుమ‌ల‌లో ప‌ర్య‌టించి.. ల‌డ్డూ త‌యారు చేసే పోటు ప్రాంతాన్ని ప‌రిశీలించారు. అదేవిధంగా తిరుమ‌ల‌కు వివిధ ప్రాంతాల నుంచి కాంట్రాక్టుపై నెయ్యిని తీసుకువ‌చ్చే ట్యాంక‌ర్ల‌ను కూడా ఆయ‌న ప‌రిశీలించారు. అధికారుల‌ను కూడా సంప్ర‌దించి ఏం జ‌రుగుతోందో తెలుసుకున్నారు.

ఈ సిట్ ద‌ర్యాప్తు మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఈ విచార‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం బ్రేక్ వేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా డీజీపీ ద్వారకా తిరుమ‌ల రావు వెల్ల‌డించారు. సిట్ ద‌ర్యాప్తును తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డం.. వాటిపై విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చే వ‌ర‌కు సిట్ ద‌ర్యాప్తును నిలుపుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ద్వార కా తిరుమ‌ల రావు తెలిపారు. అంతేకాదు.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ముందుకు సాగుతామ‌న్నారు.

ఇదిలావుంటే.. సిట్ ఎందుకు వేయాల్సి వ‌చ్చింద‌నే విష‌యాన్ని డీజీపీ తిరుమ‌ల‌రావు ప్ర‌స్తావిస్తూ.. కేసు తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద ని.. కోట్లాది మంది హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన విష‌యం కావ‌డంతో ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కు సిట్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు డీజీపీ వివ‌రించారు. ద‌ర్యాప్తును నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిపిస్తామ‌ని.. రాజ‌కీయ జోక్యానికి తావు ఉండ‌ద‌ని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసును సుప్రీంకోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించిన నేప‌థ్యంలో ఆ కోర్టు ఆదేశాల మేర‌కు త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే సిట్ ద‌ర్యాప్తును ఈ నెల 3వ తేదీ వ‌ర‌కు నిలుపుద‌ల చేస్తున్న‌ట్టు వివ‌రించారు.  

ఏఆర్ సంస్థ‌పై కేసు

తిరుమ‌ల‌కు నెయ్యిని స‌ర‌ఫ‌రా చేసిన త‌మిళ‌నాడులోని దుండిగ‌ల్ కు చెందిన ఏఆర్ సంస్థ‌పై కేసు న‌మోదైన‌ట్టు డీజీపీ తెలిపారు. నెయ్యి క‌ల్తీ స‌హా.. ఆహార ప‌దార్థాల నాణ్య‌త‌పైనా ఫిర్యాదులు రావ‌డంతోనే కేసు న‌మోదు చేశామ‌న్నారు. అయితే.. నోటీసులు ఇవ్వ‌లేద‌న్న ఆ సంస్థ య‌జ‌మాని రాజ‌శేఖ‌ర‌న్ వాద‌న‌ల‌పై స్పందించేందుకు డీజీపీ నిరాక‌రించారు. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉంద‌ని.. కాబ‌ట్టి దీనిపైకోర్టు సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్తామ‌న్నారు. 

This post was last modified on October 2, 2024 12:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

5 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

6 hours ago