తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారన్న విమర్శలు, ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన పనిని ఆపేసింది. వాస్తవానికి గత రెండు రోజులుగా ఇదే పనిపై సిట్ ఉన్న విషయం తెలిసిందే. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠీ స్వయంగా రంగంలోకి దిగి.. తిరుమలలో పర్యటించి.. లడ్డూ తయారు చేసే పోటు ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి కాంట్రాక్టుపై నెయ్యిని తీసుకువచ్చే ట్యాంకర్లను కూడా ఆయన పరిశీలించారు. అధికారులను కూడా సంప్రదించి ఏం జరుగుతోందో తెలుసుకున్నారు.
ఈ సిట్ దర్యాప్తు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ విషయాన్ని స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. వాటిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు సిట్ దర్యాప్తును నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు ద్వార కా తిరుమల రావు తెలిపారు. అంతేకాదు.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే మార్గదర్శకాల మేరకు ముందుకు సాగుతామన్నారు.
ఇదిలావుంటే.. సిట్ ఎందుకు వేయాల్సి వచ్చిందనే విషయాన్ని డీజీపీ తిరుమలరావు ప్రస్తావిస్తూ.. కేసు తీవ్రత ఎక్కువగా ఉంద ని.. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వం సూచనల మేరకు సిట్ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ వివరించారు. దర్యాప్తును నిష్పక్షపాతంగా జరిపిస్తామని.. రాజకీయ జోక్యానికి తావు ఉండదని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసును సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో ఆ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ దర్యాప్తును ఈ నెల 3వ తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్టు వివరించారు.
ఏఆర్ సంస్థపై కేసు
తిరుమలకు నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడులోని దుండిగల్ కు చెందిన ఏఆర్ సంస్థపై కేసు నమోదైనట్టు డీజీపీ తెలిపారు. నెయ్యి కల్తీ సహా.. ఆహార పదార్థాల నాణ్యతపైనా ఫిర్యాదులు రావడంతోనే కేసు నమోదు చేశామన్నారు. అయితే.. నోటీసులు ఇవ్వలేదన్న ఆ సంస్థ యజమాని రాజశేఖరన్ వాదనలపై స్పందించేందుకు డీజీపీ నిరాకరించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ పరిధిలో ఉందని.. కాబట్టి దీనిపైకోర్టు సూచనల మేరకు ముందుకు వెళ్తామన్నారు.
This post was last modified on October 2, 2024 12:54 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…