Political News

నా దీక్ష తిరుమ‌ల ల‌డ్డూ కోస‌మే కాదు:  ప‌వ‌న్‌

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌న్న ఆరోప‌ణ‌లు తెర‌మీదికి వ‌చ్చిన నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్రాయ‌శ్చిత్త దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

బుధ‌వారం ఈ దీక్ష‌ను విరమించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు ఆల‌యానికి వ‌చ్చారు. అలిపిరి మెట్ల మార్గంలో ఆయ‌న ఏడు కొండ‌లు ఎక్కారు.

మంగ‌ళ‌వారం రాత్రి తిరుమ‌ల‌లోనే బ‌స చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తాను దీక్ష ఎందుకు చేప‌ట్టిందీ వివ‌రించారు. కేవ‌లం తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ అయింద‌న్న ఒకే ఒక్క కార‌ణానికి దీక్ష చేప‌ట్ట‌లేద‌న్నారు.

రాష్ట్రంలో ఆల‌యాల ప‌రిస్థితి దుర్భ‌రంగా ఉంద‌ని.. ఎక్క‌డేంచేసినా ఎవ‌రూ అడ‌గ‌ర‌నే రీతిలో గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని.. అందుకే ఆల‌యాల‌పై దాడులు జ‌రిగాయ‌ని తెలిపారు.

ఎక్క‌డో రామ‌తీర్థంలో శ్రీరాముడి విగ్ర‌హం త‌ల‌ను ఛేదిస్తే.. ఎవ‌రూ ప‌ట్టించు కోలేద‌న్నారు. అంత‌ర్వేది ర‌థాన్ని ద‌గ్ధం చేశార‌ని, విజ‌య‌వాడ దుర్గ‌మ్మ వెండి ర‌థానికి ఉన్న బొమ్మ‌ల‌ను కూడా దోచుకున్నార ని తెలిపారు.

అదేవిధంగా ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌లో అన‌మ‌స్తుల జోక్యం పెరిగింద‌ని చెప్పారు. ఈ కార‌ణాల‌తో హిందూ ధ‌ర్మం, దేవాల‌యాల‌ను పర‌రక్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్పేందుకే తాను దీక్ష చేప‌ట్టాన‌ని ప‌వ‌న్ వివ‌రించారు.

ఇక‌, తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ప‌వ‌న్ స్పందించారు. ల‌డ్డులో వినియోగించిన నెయ్యి క‌ల్తీ కాలేద‌ని కానీ, అయింద‌ని కానీ సుప్రీంకోర్టు స్ప‌ష్టంగా ఏమీ చెప్ప‌లేద న్నారు. అయితే.. నెయ్యికి సంబంధించి వ‌చ్చిన ల్యాబు రిపోర్టులో తేడాలు ఉన్న విష‌యాన్ని మాత్ర‌మే ప్ర‌శ్నించింద‌న్నారు.

దీని పై విచార‌ణ సాగుతోంద‌ని, కాబ‌ట్టి తానేమీ వ్యాఖ్యానించ‌ద‌లుచుకోలేద‌న్నారు. రాష్ట్రంలో ఆల‌యాల ప‌రిర‌క్ష‌ణ‌కు శాశ్వ‌త విధానం అంటూ ఒక‌టి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందుకే తాను ప్రాయ‌శ్చిత్త దీక్ష చేప‌ట్టిన‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. 

This post was last modified on October 2, 2024 7:38 am

Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

4 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

5 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

6 hours ago