Political News

శ్రీవారికి సొంతంగా డెయిరీ ఏర్పాటు చేయాలి

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి వినియోగించే నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు హిందువుల మ‌నో భావాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై సిట్ విచార‌ణ సాగు తోంది. ఇదేస‌మ‌యంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగానే ప‌రిగ‌ణించింది. ప్ర‌స్తుతం ఈ కేసుపై కూడా విచార‌ణ కొన‌సాగుతోంది. అయితే.. నెయ్యి కల్తీ ఘ‌ట‌న వ్య‌వ‌హారంపై నిర‌స‌న‌లు, ప్ర‌జాస్వామ్య యుత ధ‌ర్నాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో బీసీవై పార్టీ అధ్య‌క్షుడు బోడే రామ‌చంద్ర యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

తిరుమ‌ల శ్రీవారి కైంక‌ర్యాలు, ప్ర‌సాదాలు, భోజ‌నాల్లో వినియోగించే నెయ్యిని స్వంతంగానే త‌యారు చేసు కునేందుకు తాను కృషి చేస్తాన‌ని చెప్పారు. స్వ‌యంగా వేయి గోవులు ఇవ్వ‌డంతోపాటు దాత‌ల నుంచి లక్ష గోవులు సమకూరుస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అదేవిధంగా తిరుమ‌ల దేవ‌స్థానం సొంత డెయిరీ ఏర్పాటు చేసేందుకు కూడా తాను స‌హ‌క‌రిస్తాన‌ని తెలిపారు. నెయ్యి వివాదం నేప‌థ్యంలో బోడే.. తిరుమల పరిరక్షణ పాదయాత్ర చేప‌ట్టారు. పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తిరుమ‌ల‌కు ఆయ‌న పాద‌యాత్ర‌గా వ‌చ్చారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం శ్రీవారిని త‌న అనుచ‌రుల‌తో స‌హా ద‌ర్శించుకున్న బోడే.. అనంత‌రం మీడియా తో మాట్లాడారు. రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీ చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని.. కానీ, ఈ దిశ‌గా ఎవ‌రూ అడుగులు వేయ‌లేద‌ని అన్నారు. తిరుమ‌ల సొంతంగా ఏర్పాటు చేసుకునే డెయిరీలో 10 వేల మందికి ఉపాధి కల్పించే అవ‌కాశం కూడా ఉంద‌న్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన నెయ్యిని సొంతంగా తయారు చేసుకునేందుకు తిరుమ‌ల‌కు అన్ని అవ‌కాశాలూ ఉన్నాయ‌ని చెప్పారు.

వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్న తిరుమల శ్రీవారికి సొంతంగా డెయిరీ ఏర్పాటు చేస్తే.. ఎలాంటి అపోహ‌ల‌కు, అపార్థాల‌కు తావులేకుండా.. నెయ్యిని ఉత్పత్తి చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. లడ్డు ప్రసాదం సహా, పూజా నెయ్యి కూడా అపవిత్రంగా నిర్వ‌హించ‌వ‌చ్చున‌ని తెలిపారు. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేస్తే.. తన వంతుగా వేయి ఆవులు ఇస్తానన్నారు.

This post was last modified on October 1, 2024 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago