Political News

శ్రీవారికి సొంతంగా డెయిరీ ఏర్పాటు చేయాలి

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి వినియోగించే నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు హిందువుల మ‌నో భావాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై సిట్ విచార‌ణ సాగు తోంది. ఇదేస‌మ‌యంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగానే ప‌రిగ‌ణించింది. ప్ర‌స్తుతం ఈ కేసుపై కూడా విచార‌ణ కొన‌సాగుతోంది. అయితే.. నెయ్యి కల్తీ ఘ‌ట‌న వ్య‌వ‌హారంపై నిర‌స‌న‌లు, ప్ర‌జాస్వామ్య యుత ధ‌ర్నాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో బీసీవై పార్టీ అధ్య‌క్షుడు బోడే రామ‌చంద్ర యాద‌వ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

తిరుమ‌ల శ్రీవారి కైంక‌ర్యాలు, ప్ర‌సాదాలు, భోజ‌నాల్లో వినియోగించే నెయ్యిని స్వంతంగానే త‌యారు చేసు కునేందుకు తాను కృషి చేస్తాన‌ని చెప్పారు. స్వ‌యంగా వేయి గోవులు ఇవ్వ‌డంతోపాటు దాత‌ల నుంచి లక్ష గోవులు సమకూరుస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అదేవిధంగా తిరుమ‌ల దేవ‌స్థానం సొంత డెయిరీ ఏర్పాటు చేసేందుకు కూడా తాను స‌హ‌క‌రిస్తాన‌ని తెలిపారు. నెయ్యి వివాదం నేప‌థ్యంలో బోడే.. తిరుమల పరిరక్షణ పాదయాత్ర చేప‌ట్టారు. పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తిరుమ‌ల‌కు ఆయ‌న పాద‌యాత్ర‌గా వ‌చ్చారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం శ్రీవారిని త‌న అనుచ‌రుల‌తో స‌హా ద‌ర్శించుకున్న బోడే.. అనంత‌రం మీడియా తో మాట్లాడారు. రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీ చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని.. కానీ, ఈ దిశ‌గా ఎవ‌రూ అడుగులు వేయ‌లేద‌ని అన్నారు. తిరుమ‌ల సొంతంగా ఏర్పాటు చేసుకునే డెయిరీలో 10 వేల మందికి ఉపాధి కల్పించే అవ‌కాశం కూడా ఉంద‌న్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన నెయ్యిని సొంతంగా తయారు చేసుకునేందుకు తిరుమ‌ల‌కు అన్ని అవ‌కాశాలూ ఉన్నాయ‌ని చెప్పారు.

వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్న తిరుమల శ్రీవారికి సొంతంగా డెయిరీ ఏర్పాటు చేస్తే.. ఎలాంటి అపోహ‌ల‌కు, అపార్థాల‌కు తావులేకుండా.. నెయ్యిని ఉత్పత్తి చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. లడ్డు ప్రసాదం సహా, పూజా నెయ్యి కూడా అపవిత్రంగా నిర్వ‌హించ‌వ‌చ్చున‌ని తెలిపారు. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేస్తే.. తన వంతుగా వేయి ఆవులు ఇస్తానన్నారు.

This post was last modified on October 1, 2024 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago