ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయి.. తీహార్ జైల్లో నెలల తరబడి ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. జైల్లో ఉన్న వేళలో ఆమె ఆరోగ్యం బాగా పాడైనట్లుగా వార్తలు రావటం తెలిసిందే. తాజాగా ఆమె అనారోగ్యంతో హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఆమె వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు.
ఉదయాన్నే తనకు తానే కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చిన ఆమె.. ఏఐజీ ఆసుపత్రిలోకి వెళ్లారు. అనంతరం ఆమెను ఆడ్మిట్ చేసిన సిబ్బంది.. వైద్య పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు పరీక్షలు పూర్తి అవుతాయని చెబుతున్నారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఆరోగ్యం దెబ్బ తిన్న వేళలో ఢిల్లీ ఎయిమ్స్ లో ఆమెకు పరీక్షలు నిర్వహించారు.
లిక్కర్ స్కాంలో దాదాపు ఐదు నెలలకు పైనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వటంతో జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోకుండా ఇంటికే పరిమితం అయ్యారు.
ఇటీవల కాలంలో ఆమె అస్సలు కనిపించటం లేదన్న మాట వినిపిస్తున్న వేళలోనే.. అనారోగ్యంతో ఆసుపత్రికి రావటం గమనార్హం. గైనిక్ సమస్యలతో బాధ పడుతున్న ఆమె.. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
This post was last modified on October 1, 2024 1:04 pm
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……