Political News

క‌ర్ణాట‌క సీఎం జైలుకు వెళ్లాల్సిందేనా? పొలిటిక‌ల్ ర‌చ్చ‌!

క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య వ్య‌వ‌హారం తీవ్ర ఉత్కంఠ‌గా మారిపోయింది. మైసూరు అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(ముడా) భూముల కుంభ‌కోణం కేసు ఆయ‌న కుటుంబానికి చుట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో సిద్దూ స‌తీమ‌ణి పార్వ‌తి స‌హా బావ‌మ‌రిది మ‌ల్లికార్జున స్వామిపై కూడా కేసులు న‌మోద‌య్యాయి. త‌న‌పై న‌మోదు చేసిన లోకాయుక్త కేసులను కొట్టి వేయాల‌ని కోరుతూ.. సిద్ద‌రామ‌య్య క‌ర్ణాట‌క హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. ఈ కేసు తీవ్ర‌త నేప‌థ్యంలో విచార‌ణ జ‌రిగి తీరాల్సిందేన‌ని, కేసును కొట్టివేయ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. దీంతో సిద్దూ విచార‌ణ‌కు రెడీ కాక‌త‌ప్ప‌లేదు.

ఇదిలావుంటే.. ఇదే కేసుకు సంబంధించి.. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు తాజాగా కేసు న‌మోదు చేశారు. ఈ భూముల కుంభ‌కోణానికి సంబంధించి భారీ ఎత్తున మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని పేర్కొంటూ దీనిలో సీఎం సిద్ద‌రామ‌య్య‌ను ఏ1గా పేర్కొంటూ కేసు పెట్టారు. దీనికి లోకాయుక్త కూడా అనుమ‌తి ఇచ్చింది. వాస్త‌వానికి లోకాయుక్త న‌మోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ ఇప్పుడు కేసు పెట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతో సీఎం సిద్ద‌రామ‌య్య‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని క‌ర్ణాట‌క‌లో పెద్ద ఎత్తున రాజ‌కీయ చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను ఈడీ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. వీరిలో ఒక‌రు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ . ఈయ‌న ఇటీవ‌లే బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మ‌రొక‌రు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌. కొన్నాళ్ల‌పాటు జైల్లో ఉన్న ఆయ‌న త‌ర్వాత‌.. బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌ళ్లీ సీఎం అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌ను కూడా కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కారు టార్గెట్ చేసింద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిపైనే స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.

అస‌లేంటీ కేసు?

సీఎం సిద్ద‌రామ‌య్య స‌తీమ‌ణి పార్వ‌తికి వార‌స‌త్వంగా ప‌సుపు కుంకాల కింద మైసూరులో సుమారు 200 ఎక‌రాల భూమి వ‌చ్చింది. అయితే.. మైసూరు అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంటు అధారిటీ.. న‌గ‌ర అభివృద్ధిలో భాగంగా ఈ భూముల‌ను స్వాధీనం చేసుకుంది. ప్ర‌త్యామ్నాయంగా మ‌రోచోట భూములు కేటాయించారు. అయితే.. ఇవి తీసుకున్న భూముల ధ‌ర‌ల కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అంతేకాదు.. అప్ప‌ట్లో సిద్ద‌రామ‌య్య స‌ర్కారే ఉండ‌డంతో ఉద్దేశ పూర్వకంగా త‌న స‌తీమ‌ణికి ఇలా భూములు కేటాయించుకున్నార‌ని గ‌వ‌ర్న‌ర్ ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై లోకాయుక్త కేసు న‌మోదు చేసింది.

This post was last modified on October 1, 2024 9:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

45 minutes ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

2 hours ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

2 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

4 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

5 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

5 hours ago