Political News

కొండా సురేఖ కంట‌త‌డి.. కేటీఆర్ కు వార్నింగ్

తెలంగాణ‌లో మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న‌రావు క‌లిసి ఉన్న ఫొటోను అభ్యంత‌రక‌ర రీతిలో చిత్రీక‌రించి.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీని వెనుక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నార‌నేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోప‌ణ‌. దీనిపై సోమ‌వారం ఉద‌యం నుంచి పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. బీఆర్ఎస్ భ‌వ‌న్ ద‌గ్గ‌ర కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, కొండా సురేఖ వ‌ర్గం ఆందోళ‌న‌కు దిగారు. కేటీఆర్‌, కేసీఆర్ దిష్ట‌బొమ్మ‌ల‌ను కూడా త‌గుల బెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలావుంటే.. మీడియా ముందుకు వ‌చ్చిన సురేఖ క‌న్నీరు పెట్టుకున్నారు.

ర‌ఘునంద‌న‌రావు-తాను పాల్గొన్న ఓ కార్య‌క్ర‌మంలో తీసిన ఫొటోను అభ్యంత‌రక‌ర రీతిలో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. అంతేకాదు.. కేటీఆర్ కుటుంబంలోనూ అమ్మ‌, చెల్లి ఉన్నార‌ని, వారికి ఈ ఫొటో చూపించి.. స‌రైంద‌నేని అనిపించాల‌ని స‌వాల్ రువ్వారు. ఒక కుటుంబం, బాధ్య‌త ఉన్న‌వారు.. ఈ ప‌నిని చేయ‌బోర‌ని చెప్పారు. ఫొటోను మార్ఫింగ్ చేసి.. దానికి “వీళ్లకు షాదీ ముబారక్ ఎవరు ఇచ్చారు?” అని ప్ర‌శ్నించ‌డం ఎంత జుగుప్సాక‌ర‌మో ఆలోచించుకోవాల ని సురేఖ వ్యాఖ్యానించారు. ఈ ఫొటో చూసిన త‌ర్వాత‌.. త‌నకు నిద్ర ప‌ట్ట‌లేద‌ని, అన్నం కూడా తిన‌లేద‌ని చెప్పారు.

బీఆర్ఎస్‌కు వార్నింగ్
కొండా సురేఖ‌.. బీఆర్ఎస్ నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు. “బీఆర్ఎస్ నాయకులారా ఖబడ్దార్. అసహ్యంగా పోస్టులు పెడితే ఇక ఊరుకునేది లేదు” అని వ్యాఖ్యానించారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ వాళ్లు త‌మ‌కు న‌చ్చిన‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఈ ఫొటో త‌న‌ను మాన‌సికంగా కుంగ‌దీసింద‌న్నారు. “నీ ఇంట్లో చెల్లిని ఇలాగే అంటే ఊరుకుంటారా? పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు” అని కొండా సురేఖ నిప్పులు చెరిగారు. ఇలాంటి వారిని స‌మ‌ర్థిస్తున్న కేటీఆర్‌కు ఇప్ప‌టికైనా బుద్ధి రావాల‌ని అన్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే.. ‘బట్టలిప్పి ఉరికిస్తాం’ అని సురేఖ వార్నింగ్ ఇచ్చారు.

ఏం జ‌రిగింది?

ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న‌రావు.. మంత్రి కొండా సురేఖ‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సురేఖ మెడ‌లో ర‌ఘునంద‌న‌రావు.. ‘చేనేత నూలు దండ’ వేశారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోను కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. విస్తృత స్థాయిలో ప్ర‌చారం చేశారు. దీనిపైనే కొత్త రాజ‌కీయం అలుముకుంది. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న సురేఖ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Satya

Recent Posts

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

1 hour ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

11 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

13 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

15 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

16 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

16 hours ago