అధికారంలో ఉండగా.. తనకు తిరుగులేదని.. తన మాటకు ఎదురులేదని బీరాలు పలికి.. చెలరేగిపోయిన అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇప్పుడు వాస్తవాలు గుర్తుకు వస్తున్నాయి. వాస్తవం తెలిసి వస్తోంది. అధికారం కోల్పోయాక.. తన పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసి వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన కాళ్ల బేరానికి వస్తున్నాయి. “తాడిపత్రిలోకి అనుమతించండి ప్లీజ్” అంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
2019లో తొలిసారి తాడిపత్రిలో వైసీపీ తరఫున పెద్దారెడ్డి విజయం దక్కించుకున్నారు. దీనికితోడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు తిరుగులేదన్నట్టుగా పెద్దారెడ్డి చెలరేగిపోయారు. టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదానికి దిగారు.జేసీ కుటుంబాన్ని ఎంత వేధించాలో అంతా వేధించారు. వారి ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని దెబ్బతీసేలా కూడా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. జైల్లో కూడా పెట్టించారు.
ఏకంగా జేసీ ఇంటికి వెళ్లి.. బెదిరింపులకు పాల్పడ్డారు. సవాళ్లు రువ్వారు. అయితే.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్నట్టుగానే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం మరోసారి విజయం దక్కించుకుంది. అయినా కూడా తనదే పైచేయి అన్నట్టుగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పెద్దారెడ్డి దూకుడుగానే వ్యవహరించారు. తాడిపత్రిలో తన పరివారంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తీవ్ర హింస కూడా చెలరేగింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు కేతిరెడ్డిపై బహిష్కరణ వేటు వేశారు. నియోజకవర్గంలోకి రాకుండా ఆయనపై ఆంక్షలు విధించారు. దాదాపు నెల రోజుల నుంచి కేతిరెడ్డి నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆయన దిగివచ్చారు. అనంతపురం ఎస్పీ జగదీష్ ను కలిసిన పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించాలని విన్నవించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనను తాడిపత్రికి అనుమతించాలని ఆయన వేడుకున్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా.. ఒకప్పుడు విర్రవీగిన కేతిరెడ్డి ఇప్పుడు కాళ్లబేరానికి రావడం ఆసక్తిగా మారింది.
This post was last modified on September 30, 2024 3:50 pm
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…