అధికారంలో ఉండగా.. తనకు తిరుగులేదని.. తన మాటకు ఎదురులేదని బీరాలు పలికి.. చెలరేగిపోయిన అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇప్పుడు వాస్తవాలు గుర్తుకు వస్తున్నాయి. వాస్తవం తెలిసి వస్తోంది. అధికారం కోల్పోయాక.. తన పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసి వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన కాళ్ల బేరానికి వస్తున్నాయి. “తాడిపత్రిలోకి అనుమతించండి ప్లీజ్” అంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
2019లో తొలిసారి తాడిపత్రిలో వైసీపీ తరఫున పెద్దారెడ్డి విజయం దక్కించుకున్నారు. దీనికితోడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు తిరుగులేదన్నట్టుగా పెద్దారెడ్డి చెలరేగిపోయారు. టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదానికి దిగారు.జేసీ కుటుంబాన్ని ఎంత వేధించాలో అంతా వేధించారు. వారి ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని దెబ్బతీసేలా కూడా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. జైల్లో కూడా పెట్టించారు.
ఏకంగా జేసీ ఇంటికి వెళ్లి.. బెదిరింపులకు పాల్పడ్డారు. సవాళ్లు రువ్వారు. అయితే.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్నట్టుగానే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం మరోసారి విజయం దక్కించుకుంది. అయినా కూడా తనదే పైచేయి అన్నట్టుగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పెద్దారెడ్డి దూకుడుగానే వ్యవహరించారు. తాడిపత్రిలో తన పరివారంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తీవ్ర హింస కూడా చెలరేగింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు కేతిరెడ్డిపై బహిష్కరణ వేటు వేశారు. నియోజకవర్గంలోకి రాకుండా ఆయనపై ఆంక్షలు విధించారు. దాదాపు నెల రోజుల నుంచి కేతిరెడ్డి నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆయన దిగివచ్చారు. అనంతపురం ఎస్పీ జగదీష్ ను కలిసిన పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించాలని విన్నవించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనను తాడిపత్రికి అనుమతించాలని ఆయన వేడుకున్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా.. ఒకప్పుడు విర్రవీగిన కేతిరెడ్డి ఇప్పుడు కాళ్లబేరానికి రావడం ఆసక్తిగా మారింది.
This post was last modified on September 30, 2024 3:50 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…