అధికారంలో ఉండగా.. తనకు తిరుగులేదని.. తన మాటకు ఎదురులేదని బీరాలు పలికి.. చెలరేగిపోయిన అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇప్పుడు వాస్తవాలు గుర్తుకు వస్తున్నాయి. వాస్తవం తెలిసి వస్తోంది. అధికారం కోల్పోయాక.. తన పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసి వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన కాళ్ల బేరానికి వస్తున్నాయి. “తాడిపత్రిలోకి అనుమతించండి ప్లీజ్” అంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
2019లో తొలిసారి తాడిపత్రిలో వైసీపీ తరఫున పెద్దారెడ్డి విజయం దక్కించుకున్నారు. దీనికితోడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు తిరుగులేదన్నట్టుగా పెద్దారెడ్డి చెలరేగిపోయారు. టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదానికి దిగారు.జేసీ కుటుంబాన్ని ఎంత వేధించాలో అంతా వేధించారు. వారి ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని దెబ్బతీసేలా కూడా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. జైల్లో కూడా పెట్టించారు.
ఏకంగా జేసీ ఇంటికి వెళ్లి.. బెదిరింపులకు పాల్పడ్డారు. సవాళ్లు రువ్వారు. అయితే.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్నట్టుగానే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం మరోసారి విజయం దక్కించుకుంది. అయినా కూడా తనదే పైచేయి అన్నట్టుగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పెద్దారెడ్డి దూకుడుగానే వ్యవహరించారు. తాడిపత్రిలో తన పరివారంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తీవ్ర హింస కూడా చెలరేగింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు కేతిరెడ్డిపై బహిష్కరణ వేటు వేశారు. నియోజకవర్గంలోకి రాకుండా ఆయనపై ఆంక్షలు విధించారు. దాదాపు నెల రోజుల నుంచి కేతిరెడ్డి నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆయన దిగివచ్చారు. అనంతపురం ఎస్పీ జగదీష్ ను కలిసిన పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించాలని విన్నవించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనను తాడిపత్రికి అనుమతించాలని ఆయన వేడుకున్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా.. ఒకప్పుడు విర్రవీగిన కేతిరెడ్డి ఇప్పుడు కాళ్లబేరానికి రావడం ఆసక్తిగా మారింది.
This post was last modified on September 30, 2024 3:50 pm
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…