Political News

తీగ దొరికింది డొంక ప్యాలెస్‌లో వుంది: ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం డా ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కోట్లు కొల్ల‌గొట్టిన ఘ‌నాపాఠి.. ప్యాలెస్ దోపిడీ బ‌ట్ట‌బ‌య‌లు కావాలి.. అంటూ వ్యాఖ్యానించారు.

తాజాగా గ‌నుల శాఖ మాజీ డైరెక్ట‌ర్‌(జ‌గ‌న్ హ‌యాంలో ప‌నిచేసిన‌) వెంక‌ట‌రెడ్డిని అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాల‌నా కాలంలో ఇసుక నుంచి గ‌నుల వ‌ర‌కు దోపిడీ జ‌రిగింద‌ని, కొంద‌రికే ఆయ‌న అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది.

సుమారు 2,566 కోట్ల రూపాయ‌ల మేర‌కు గ‌నులలో దోపిడీ జ‌రిగిన‌ట్టు స‌ర్కారు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో దీనికి పాత్ర ధారిగా ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అప్ప‌టి డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డిని అతి క‌ష్టం మీద అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై పీసీసీ చీఫ్ ష‌ర్మిల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌నుల దోపిడీలో తీగ మాత్ర‌మే దొరికింది. డొంక‌లు క‌ద‌లాల్సి ఉంది. ఆ డొంక ఏ ప్యాలెస్‌లో ఉందో అంద‌రికీ తెలిసిందే. కోట్లు కొల్ల గొట్టిన ఘ‌నాపాఠీ ఎవ‌ర‌నేది కూడా అంద‌రికీ తెలుసు అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, సూత్ర‌ధారిగా అన్నీ తానై రూ.వేల కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.

గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రంలో ప్ర‌కృతి సంప‌ద‌ను దోచుకున్నార‌ని, త‌మ వారికి, అయిన వారికంపెనీల‌కు గ‌నుల‌ను దోచి పెట్టార‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. క‌నీస నిబంధ‌న‌లు కూడా పాటించ‌లేద‌న్నారు. జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ నిబంధ‌న‌ల‌ను కూడా పాటించ‌లేద‌న్నారు.

రాష్ట్ర ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయ‌లను త‌మ సొంత ఖజానాకు తరలించుకున్నారంటూ.. ప‌రోక్షంగా మాజీ జ‌గ‌న్‌పై ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు. మైనింగ్ కుంభ‌కోణంపై పూర్తిస్థాయి విచార‌ణ చేసి.. తిమింగ‌లాల‌ను ప‌ట్టుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అవ‌స‌ర‌మైతే.. సీబీఐ ద‌ర్యాప్తును కూడా చేయించాల‌ని ష‌ర్మిల సూచించారు.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

1 hour ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

4 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

4 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago