వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం డా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి.. ప్యాలెస్ దోపిడీ బట్టబయలు కావాలి.. అంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా గనుల శాఖ మాజీ డైరెక్టర్(జగన్ హయాంలో పనిచేసిన) వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ పాలనా కాలంలో ఇసుక నుంచి గనుల వరకు దోపిడీ జరిగిందని, కొందరికే ఆయన అనుకూలంగా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
సుమారు 2,566 కోట్ల రూపాయల మేరకు గనులలో దోపిడీ జరిగినట్టు సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనికి పాత్ర ధారిగా ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డిని అతి కష్టం మీద అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గనుల దోపిడీలో తీగ మాత్రమే దొరికింది. డొంకలు కదలాల్సి ఉంది. ఆ డొంక ఏ ప్యాలెస్లో ఉందో అందరికీ తెలిసిందే. కోట్లు కొల్ల గొట్టిన ఘనాపాఠీ ఎవరనేది కూడా అందరికీ తెలుసు అని షర్మిల వ్యాఖ్యానించారు. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, సూత్రధారిగా అన్నీ తానై రూ.వేల కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రకృతి సంపదను దోచుకున్నారని, తమ వారికి, అయిన వారికంపెనీలకు గనులను దోచి పెట్టారని షర్మిల విమర్శించారు. కనీస నిబంధనలు కూడా పాటించలేదన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలను కూడా పాటించలేదన్నారు.
రాష్ట్ర ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయలను తమ సొంత ఖజానాకు తరలించుకున్నారంటూ.. పరోక్షంగా మాజీ జగన్పై షర్మిల విరుచుకుపడ్డారు. మైనింగ్ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ చేసి.. తిమింగలాలను పట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అవసరమైతే.. సీబీఐ దర్యాప్తును కూడా చేయించాలని షర్మిల సూచించారు.
This post was last modified on September 28, 2024 9:16 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…