వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం డా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి.. ప్యాలెస్ దోపిడీ బట్టబయలు కావాలి.. అంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా గనుల శాఖ మాజీ డైరెక్టర్(జగన్ హయాంలో పనిచేసిన) వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ పాలనా కాలంలో ఇసుక నుంచి గనుల వరకు దోపిడీ జరిగిందని, కొందరికే ఆయన అనుకూలంగా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
సుమారు 2,566 కోట్ల రూపాయల మేరకు గనులలో దోపిడీ జరిగినట్టు సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనికి పాత్ర ధారిగా ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డిని అతి కష్టం మీద అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గనుల దోపిడీలో తీగ మాత్రమే దొరికింది. డొంకలు కదలాల్సి ఉంది. ఆ డొంక ఏ ప్యాలెస్లో ఉందో అందరికీ తెలిసిందే. కోట్లు కొల్ల గొట్టిన ఘనాపాఠీ ఎవరనేది కూడా అందరికీ తెలుసు అని షర్మిల వ్యాఖ్యానించారు. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, సూత్రధారిగా అన్నీ తానై రూ.వేల కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రకృతి సంపదను దోచుకున్నారని, తమ వారికి, అయిన వారికంపెనీలకు గనులను దోచి పెట్టారని షర్మిల విమర్శించారు. కనీస నిబంధనలు కూడా పాటించలేదన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలను కూడా పాటించలేదన్నారు.
రాష్ట్ర ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయలను తమ సొంత ఖజానాకు తరలించుకున్నారంటూ.. పరోక్షంగా మాజీ జగన్పై షర్మిల విరుచుకుపడ్డారు. మైనింగ్ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ చేసి.. తిమింగలాలను పట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అవసరమైతే.. సీబీఐ దర్యాప్తును కూడా చేయించాలని షర్మిల సూచించారు.
This post was last modified on September 28, 2024 9:16 pm
తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, ప్రీమియర్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది.…
చాలా కాలంగా నిర్మాతలను వేధిస్తున్న సమస్య బుక్ మై షో రేటింగ్స్, రివ్యూస్. టికెట్లు కొన్నా కొనకపోయినా ఇవి ఇచ్చే…
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…