Political News

తీగ దొరికింది డొంక ప్యాలెస్‌లో వుంది: ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం డా ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కోట్లు కొల్ల‌గొట్టిన ఘ‌నాపాఠి.. ప్యాలెస్ దోపిడీ బ‌ట్ట‌బ‌య‌లు కావాలి.. అంటూ వ్యాఖ్యానించారు.

తాజాగా గ‌నుల శాఖ మాజీ డైరెక్ట‌ర్‌(జ‌గ‌న్ హ‌యాంలో ప‌నిచేసిన‌) వెంక‌ట‌రెడ్డిని అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాల‌నా కాలంలో ఇసుక నుంచి గ‌నుల వ‌ర‌కు దోపిడీ జ‌రిగింద‌ని, కొంద‌రికే ఆయ‌న అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది.

సుమారు 2,566 కోట్ల రూపాయ‌ల మేర‌కు గ‌నులలో దోపిడీ జ‌రిగిన‌ట్టు స‌ర్కారు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో దీనికి పాత్ర ధారిగా ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అప్ప‌టి డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డిని అతి క‌ష్టం మీద అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై పీసీసీ చీఫ్ ష‌ర్మిల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌నుల దోపిడీలో తీగ మాత్ర‌మే దొరికింది. డొంక‌లు క‌ద‌లాల్సి ఉంది. ఆ డొంక ఏ ప్యాలెస్‌లో ఉందో అంద‌రికీ తెలిసిందే. కోట్లు కొల్ల గొట్టిన ఘ‌నాపాఠీ ఎవ‌ర‌నేది కూడా అంద‌రికీ తెలుసు అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, సూత్ర‌ధారిగా అన్నీ తానై రూ.వేల కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.

గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రంలో ప్ర‌కృతి సంప‌ద‌ను దోచుకున్నార‌ని, త‌మ వారికి, అయిన వారికంపెనీల‌కు గ‌నుల‌ను దోచి పెట్టార‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. క‌నీస నిబంధ‌న‌లు కూడా పాటించ‌లేద‌న్నారు. జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ నిబంధ‌న‌ల‌ను కూడా పాటించ‌లేద‌న్నారు.

రాష్ట్ర ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయ‌లను త‌మ సొంత ఖజానాకు తరలించుకున్నారంటూ.. ప‌రోక్షంగా మాజీ జ‌గ‌న్‌పై ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు. మైనింగ్ కుంభ‌కోణంపై పూర్తిస్థాయి విచార‌ణ చేసి.. తిమింగ‌లాల‌ను ప‌ట్టుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అవ‌స‌ర‌మైతే.. సీబీఐ ద‌ర్యాప్తును కూడా చేయించాల‌ని ష‌ర్మిల సూచించారు.

This post was last modified on September 28, 2024 9:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

4 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

5 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

6 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

8 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

9 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

9 hours ago