వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం డా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి.. ప్యాలెస్ దోపిడీ బట్టబయలు కావాలి.. అంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా గనుల శాఖ మాజీ డైరెక్టర్(జగన్ హయాంలో పనిచేసిన) వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ పాలనా కాలంలో ఇసుక నుంచి గనుల వరకు దోపిడీ జరిగిందని, కొందరికే ఆయన అనుకూలంగా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
సుమారు 2,566 కోట్ల రూపాయల మేరకు గనులలో దోపిడీ జరిగినట్టు సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనికి పాత్ర ధారిగా ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డిని అతి కష్టం మీద అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గనుల దోపిడీలో తీగ మాత్రమే దొరికింది. డొంకలు కదలాల్సి ఉంది. ఆ డొంక ఏ ప్యాలెస్లో ఉందో అందరికీ తెలిసిందే. కోట్లు కొల్ల గొట్టిన ఘనాపాఠీ ఎవరనేది కూడా అందరికీ తెలుసు
అని షర్మిల వ్యాఖ్యానించారు. 2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, సూత్రధారిగా అన్నీ తానై రూ.వేల కోట్లు కొల్లగొట్టిన ఘనాపాఠి ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రకృతి సంపదను దోచుకున్నారని, తమ వారికి, అయిన వారికంపెనీలకు గనులను దోచి పెట్టారని షర్మిల విమర్శించారు. కనీస నిబంధనలు కూడా పాటించలేదన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలను కూడా పాటించలేదన్నారు.
రాష్ట్ర ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయలను తమ సొంత ఖజానాకు తరలించుకున్నారంటూ.. పరోక్షంగా మాజీ జగన్పై షర్మిల విరుచుకుపడ్డారు. మైనింగ్ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ చేసి.. తిమింగలాలను పట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అవసరమైతే.. సీబీఐ దర్యాప్తును కూడా చేయించాలని షర్మిల సూచించారు.
This post was last modified on September 28, 2024 9:16 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పెట్టుబడులకు జోష్ పెరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మూడు మాసాల్లోనే పలు కంపెనీలు పెట్టుబడులు…
మాములుగా టాలీవుడ్ దసరాకు స్టార్ హీరోల సినిమాలు రావడం సహజం. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో…
గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ పబ్లిసిటీ పరంగా దిల్ రాజు టీమ్ మీద భారీ ఆశలు…
నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అందుకున్న సౌత్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఉత్తరాదిన…
"నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం" అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ…
నిన్న దేవరతో క్లాష్ అయితే నిలవలేమని గుర్తించి కార్తీ డబ్బింగ్ మూవీ సత్యం సుందరం ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో…