Political News

జగన్ కు మరో షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన వైసీపీ అధినేత జగన్…అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకు కూడా మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే మునిగిపోతున్న నావ వంటి వైసీపీ నుంచి బయట పడేందుకు చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య పార్టీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా…పార్టీ కీలక నేత బాలినేని సహా సామినేని ఉదయ భాను వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

ఈ క్రమంలోనే ఆ షాకుల నుంచి తేరుకోకముందే జగన్ కు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ షాకిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఆయన పంపించారు. ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రశంసించారు. పాలనలో వైసీపీ అన్ని విధాలుగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.

చివరకు ఎంసెట్ పరీక్షలను కూడా వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోయిందని, అందుకే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఓటు వేయలేదని అన్నారు. వైసీపీలో తాను ఇమడలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని చెప్పారు. వైసీపీలో ఆది నుంచి రెహ్మాన్ చురుకుగా వ్యవహరించి ఉత్తరాంధ్రలో మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రెహ్మాన్ పార్టీని వీడటంతో ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇక, రెహ్మాన్ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

రెహ్మాన్ తో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ నేతలు, మద్దతుదారులు కూడా పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారట. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా పార్టీని నేతలు వీడుతున్న వ్యవహారానికి తోడు తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన అంశం తోడవడంతో జగన్ సతమతమవుతున్నారు.

This post was last modified on September 25, 2024 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

7 hours ago