Political News

సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలపడంతో కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముడా కేసులో దాఖలైన పిటిషన్‌లో విషయాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరముందని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 12న ఈ కేసు విచారణ పూర్తి చేసిన హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ కేసులో తనపై దర్యాప్తునకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని సిద్ధరామయ్య సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసును చట్ట ప్రకారం విచారణ జరపవచ్చని హైకోర్టు క్లారిటీనిచ్చింది. గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. గవర్నర్ ఉత్తర్వుల ప్రకారం ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు తెలిపింది. గవర్నర్ తీసుకున్న చర్యలో ఎలాంటి లోపం లేదని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు మైసూరులోని ఓ ప్రాంతంలో ముడా అక్రమంగా 14 ప్లాట్లను కేటాయించిందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ఆ ఫిర్యాదు ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ అనుమతినిచ్చారు. కానీ, అలా గవర్నర్ అనుమతినివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టులో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘రాజ్‌భవన్ చలో’ నిరసనకు పిలుపునిచ్చారు.

గవర్నర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ క్రమంలోనే గవర్నర్ ఉత్తర్వులను సీఎం సిద్దరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంతో సిద్దూ చిక్కుల్లో పడ్డట్లయింది. ఒకవేళ ఈ విచారణ జరిగితే కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. సిద్ధూ వారసుడిగా డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని తెలుస్తోంది.

This post was last modified on September 24, 2024 6:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

7 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

32 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

34 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago