Political News

సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలపడంతో కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముడా కేసులో దాఖలైన పిటిషన్‌లో విషయాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరముందని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 12న ఈ కేసు విచారణ పూర్తి చేసిన హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ కేసులో తనపై దర్యాప్తునకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని సిద్ధరామయ్య సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసును చట్ట ప్రకారం విచారణ జరపవచ్చని హైకోర్టు క్లారిటీనిచ్చింది. గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. గవర్నర్ ఉత్తర్వుల ప్రకారం ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు తెలిపింది. గవర్నర్ తీసుకున్న చర్యలో ఎలాంటి లోపం లేదని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు మైసూరులోని ఓ ప్రాంతంలో ముడా అక్రమంగా 14 ప్లాట్లను కేటాయించిందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ఆ ఫిర్యాదు ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ అనుమతినిచ్చారు. కానీ, అలా గవర్నర్ అనుమతినివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టులో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘రాజ్‌భవన్ చలో’ నిరసనకు పిలుపునిచ్చారు.

గవర్నర్ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ క్రమంలోనే గవర్నర్ ఉత్తర్వులను సీఎం సిద్దరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంతో సిద్దూ చిక్కుల్లో పడ్డట్లయింది. ఒకవేళ ఈ విచారణ జరిగితే కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. సిద్ధూ వారసుడిగా డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని తెలుస్తోంది.

This post was last modified on September 24, 2024 6:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జననాగయన్… విజయ్ కీలక నిర్ణయం?

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. తమిళ టాప్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ విడుదలై ఆరు వారాలు…

6 minutes ago

కల్తీ పాల మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం

రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా…

1 hour ago

బలవంత్ బిజినెస్ వర్కౌట్ అయ్యిందా

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ప్రమోషన్ల పరంగా బాగా హడావిడి చేసింది హే బలవంత్ ఒక్కటే. మిగిలినవి కూడా పబ్లిసిటీ…

2 hours ago

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…

3 hours ago

‘పోటీ’లో పవన్ దారిలోనే విజయ్

తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…

4 hours ago

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

5 hours ago