Political News

తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వరా?: చంద్రబాబు

తిరుపతి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, దోషులను పట్టుకునే విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అసలు జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని చంద్రబాబు నిలదీశారు.

ఒకవేళ జగన్ కు నమ్మకం ఉంటే అన్యమతస్థుల సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని, సంప్రదాయాన్ని గౌరవించకుంటే జగన్ తిరుమల ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు జగన్ కు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేసేందుకు కాదని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై జగన్ ను టీడీపీ నేతలు ప్రశ్నిస్తే బూతులు తిట్టారని, వైసీపీ హయాంలో రథం కాలిపోతే తేనెటీగలు వచ్చాయని వైసీపీ నేతలు చెప్పారని, తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందని వెటకారం చేశారని గుర్తు చేశారు.

ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి హిందువుల మనోభావాలు దెబ్బతిసినందుకు భగవంతుడికి అందరం క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు అన్నారు. అపచారం చేసి అబద్దాలను నిజాలు చేయాలని చూడడం స్వామికి ద్రోహం చేసినట్లేనని చంద్రబాబు అన్నారు. తిరుపతి లడ్డు తయారీలో జంతువులు కొవ్వు వాడడం హిందూ ధర్మంపై గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని, హిందువుల మనోభావాలను మాజీ సీఎం జగన్ దెబ్బతీశారని ఆరోపించారు.
ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు చేసిన కేంద్రం సిట్ టీంను ప్రకటించనుంది.

సిట్ టీం కోసం వినీత్‌ బ్రిజ్‌లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్‌, పీహెచ్‌డీ రామకృష్ణల పేర్లను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి సరఫరాపై వివరణ ఇవ్వాలని ఏఆర్ డెయిరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.

This post was last modified on September 24, 2024 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

5 hours ago