Political News

తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వరా?: చంద్రబాబు

తిరుపతి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, దోషులను పట్టుకునే విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అసలు జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని చంద్రబాబు నిలదీశారు.

ఒకవేళ జగన్ కు నమ్మకం ఉంటే అన్యమతస్థుల సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని, సంప్రదాయాన్ని గౌరవించకుంటే జగన్ తిరుమల ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు జగన్ కు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేసేందుకు కాదని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై జగన్ ను టీడీపీ నేతలు ప్రశ్నిస్తే బూతులు తిట్టారని, వైసీపీ హయాంలో రథం కాలిపోతే తేనెటీగలు వచ్చాయని వైసీపీ నేతలు చెప్పారని, తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందని వెటకారం చేశారని గుర్తు చేశారు.

ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి హిందువుల మనోభావాలు దెబ్బతిసినందుకు భగవంతుడికి అందరం క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు అన్నారు. అపచారం చేసి అబద్దాలను నిజాలు చేయాలని చూడడం స్వామికి ద్రోహం చేసినట్లేనని చంద్రబాబు అన్నారు. తిరుపతి లడ్డు తయారీలో జంతువులు కొవ్వు వాడడం హిందూ ధర్మంపై గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని, హిందువుల మనోభావాలను మాజీ సీఎం జగన్ దెబ్బతీశారని ఆరోపించారు.
ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు చేసిన కేంద్రం సిట్ టీంను ప్రకటించనుంది.

సిట్ టీం కోసం వినీత్‌ బ్రిజ్‌లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్‌, పీహెచ్‌డీ రామకృష్ణల పేర్లను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి సరఫరాపై వివరణ ఇవ్వాలని ఏఆర్ డెయిరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.

This post was last modified on September 24, 2024 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

3 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

4 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

4 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

6 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

7 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

7 hours ago