Political News

అనంతపురంలో రామాలయం రథం దగ్ధం..రంగంలోకి చంద్రబాబు

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన వ్యవహారంపై దేశవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని, రథాలు తగులబెట్టారని అయినా దోషులను పట్టుకోవలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా ఏపీలో మరో వివాదం రాజుకుంది. అనంతపురం జిల్లాలోని రామాలయంలో రథం తగలబడిన వైనం షాకింగ్ గా మారింది.

అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన వైనం షాకింగ్ గా మారింది. మంటలను గుర్తించిన స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు, రథం దగ్ధం ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనపై సంబంధిత అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. సీఎం చంద్రబాబు.. అధికారులతో మాట్లాడిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే, అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయిందని చంద్రబాబుకు జిల్లా అధికారులు తెలిపాారు. ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అధికారులు, పోలీసులను ఆదేశించారు.

అంతేకాదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని కూడా ఆదేశించారు. ఆ ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

This post was last modified on September 24, 2024 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

5 hours ago