Political News

లడ్డూ వివాదంతో రాజస్థాన్ సీఎం అలర్ట్

హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, నెయ్యి కలిపారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. కమీషన్లకు కక్కుర్తి పడి ఆ తరహా నెయ్యిని గత ప్రభుత్వం లడ్డూ తయారీలో వాడిందని సాక్ష్యాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ నిర్వాకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకపై లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిని తిరుమలలోనే పరీక్షించేలా ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యిని పరీక్షించి గుర్తించిన సెంటర్ ఫర్ అనలసిస్ అండ్ లెర్నింగ్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ (ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్) ల్యాబ్‌ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. నెయ్యిలో నాణ్యత పరీక్షకు అవసరమైన రూ. 75 లక్షల విలువైన పరికరాల ఏర్పాటుకు ఎన్‌డీడీబీ సిద్ధమైంది. టీటీడీ ఉద్యోగులకు ఆ పరికరాలను వాడడంలో శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. 2024 డిసెంబర్‌లోపు తిరుమలలో ఆ ల్యాబ్ ఏర్పాటు చేయబోతోందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

వాస్తవానికి 2015-16లోనో నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు తిరుమలలో ఓ ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ..గత ప్రస్తుతం అది నిరుపయోగంగా మారిందని చెప్పారు. ఇక, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈ రోజు సాయంత్రం ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించబోతున్నామని శ్యామల రావు తెలిపారు.

మరోవైపు, తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లోని అన్ని ఆలయాల్లో సమర్పించే భోగం, ప్రసాదం నాణ్యత, శుభ్రతను ఈ నెల 23 నుంచి 26 వరకు తనిఖీ చేయాలని నిర్ణయించింది. ’శుద్ధ్ ఆహార్, మలీవత్ పర్ వార్’ అనే ప్రచారాన్ని ఆ రాష్ట్ర సీఎం ప్రారంభించారు. ఇక, తిరుమల లడ్డూ వివాదంపై ఇండియన్ డైరీ బ్రాండ్ అమూల్ స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తామెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని, టీటీడీకి అమూల్ నెయ్యి సరఫరా చేసిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఖండించింది.

This post was last modified on September 21, 2024 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

36 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

1 hour ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago