Political News

వైసీపీ నేత‌లు ల‌క్కీ… సుప్రీంకోర్టు బెయిల్

వైసీపీ నేత‌ల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. 2021లో జ‌రిగిన టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో వారికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. కొన్ని ష‌ర‌తులు విధించింది. పోలీసులు విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు అందుబాటులో ఉండాల‌ని పేర్కొంది. అదేవిధంగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ల ను పోలీసుల‌కు ఇవ్వాల‌ని.. దేశం విడిచి వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. ఈ కేసుకుసంబంధించిన విష‌యాల‌ను బ‌య‌ట కు వెల్ల‌డించరాద‌ని కూడా పేర్కొంది.

ఎవ‌రెవ‌రికి ఊర‌ట‌..

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడులు చేశార‌న్న కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్న ఎమ్మె ల్సీ త‌ల‌శిల ర‌ఘురాం, మాజీ మంత్రి జోగి ర‌మేష్‌, మ‌రో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయ‌కులు గ‌వాస్క‌ర్‌, విజయవాడ‌కు చెందిన యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ త‌దితురుల‌కు బెయిల్ ఇచ్చింది. కొన్ని ష‌ర‌తులు విధించింది. దీంతో ఈ కేసులో ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న కొంద‌రు నాయ‌కులు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై మూక‌దాడికి దిగారు.

టీడీపీ నాయ‌కుడు, అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభి.. అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన అభ్యం త‌రక‌ర వ్యాఖ్య‌లు.. దుమారం రేపాయి. దీనికి ప్ర‌తిగా వైసీపీ నాయ‌కులు పార్టీ కార్యాల‌యంపై దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య పెద్ద దుమారం రేగింది. ఇక‌, ఆ త‌ర్వాత ప‌ట్టాభిని అభ్యంత‌ర వ్యాఖ్య‌ల‌పైనే పోలీసులు అరెస్టు చేసి.. థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని టీడీపీ నాయ‌కులు అప్ప‌ట్లో ఆరోపించారు.

ఇక‌, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. అప్ప‌టి దాడి కేసును తిర‌గ‌దోడి.. నేత‌ల‌ను అరెస్టు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 12 మంది వైసీపీ చోటా నేత‌లు జైల్లో ఉన్నారు. బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌, విజ‌య‌వాడ న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ శైల‌జ‌ భ‌ర్త అవుతు శ్రీనివాస‌రావు కూడా జైల్లోనే ఉన్నారు. వీరిని ఇటీవ‌ల జ‌గ‌న్ ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. వీరికి సంబంధించిన బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉంది.

This post was last modified on September 13, 2024 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

6 hours ago