వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. 2021లో జరిగిన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వారికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కొన్ని షరతులు విధించింది. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొంది. అదేవిధంగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ల ను పోలీసులకు ఇవ్వాలని.. దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఈ కేసుకుసంబంధించిన విషయాలను బయట కు వెల్లడించరాదని కూడా పేర్కొంది.
ఎవరెవరికి ఊరట..
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారన్న కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్న ఎమ్మె ల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేష్, మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు గవాస్కర్, విజయవాడకు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్ తదితురులకు బెయిల్ ఇచ్చింది. కొన్ని షరతులు విధించింది. దీంతో ఈ కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న కొందరు నాయకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో వైసీపీ నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడికి దిగారు.
టీడీపీ నాయకుడు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి.. అప్పటి ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి చేసిన అభ్యం తరకర వ్యాఖ్యలు.. దుమారం రేపాయి. దీనికి ప్రతిగా వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల మధ్య పెద్ద దుమారం రేగింది. ఇక, ఆ తర్వాత పట్టాభిని అభ్యంతర వ్యాఖ్యలపైనే పోలీసులు అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీడీపీ నాయకులు అప్పట్లో ఆరోపించారు.
ఇక, కూటమి ప్రభుత్వం వచ్చాక.. అప్పటి దాడి కేసును తిరగదోడి.. నేతలను అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి 12 మంది వైసీపీ చోటా నేతలు జైల్లో ఉన్నారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నగర డిప్యూటీ మేయర్ శైలజ భర్త అవుతు శ్రీనివాసరావు కూడా జైల్లోనే ఉన్నారు. వీరిని ఇటీవల జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. వీరికి సంబంధించిన బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ పరిధిలో ఉంది.
This post was last modified on September 13, 2024 3:41 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…