Political News

వైసీపీ నేత‌లు ల‌క్కీ… సుప్రీంకోర్టు బెయిల్

వైసీపీ నేత‌ల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. 2021లో జ‌రిగిన టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో వారికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. కొన్ని ష‌ర‌తులు విధించింది. పోలీసులు విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు అందుబాటులో ఉండాల‌ని పేర్కొంది. అదేవిధంగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ల ను పోలీసుల‌కు ఇవ్వాల‌ని.. దేశం విడిచి వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. ఈ కేసుకుసంబంధించిన విష‌యాల‌ను బ‌య‌ట కు వెల్ల‌డించరాద‌ని కూడా పేర్కొంది.

ఎవ‌రెవ‌రికి ఊర‌ట‌..

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడులు చేశార‌న్న కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్న ఎమ్మె ల్సీ త‌ల‌శిల ర‌ఘురాం, మాజీ మంత్రి జోగి ర‌మేష్‌, మ‌రో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయ‌కులు గ‌వాస్క‌ర్‌, విజయవాడ‌కు చెందిన యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ త‌దితురుల‌కు బెయిల్ ఇచ్చింది. కొన్ని ష‌ర‌తులు విధించింది. దీంతో ఈ కేసులో ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న కొంద‌రు నాయ‌కులు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై మూక‌దాడికి దిగారు.

టీడీపీ నాయ‌కుడు, అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభి.. అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన అభ్యం త‌రక‌ర వ్యాఖ్య‌లు.. దుమారం రేపాయి. దీనికి ప్ర‌తిగా వైసీపీ నాయ‌కులు పార్టీ కార్యాల‌యంపై దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య పెద్ద దుమారం రేగింది. ఇక‌, ఆ త‌ర్వాత ప‌ట్టాభిని అభ్యంత‌ర వ్యాఖ్య‌ల‌పైనే పోలీసులు అరెస్టు చేసి.. థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని టీడీపీ నాయ‌కులు అప్ప‌ట్లో ఆరోపించారు.

ఇక‌, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. అప్ప‌టి దాడి కేసును తిర‌గ‌దోడి.. నేత‌ల‌ను అరెస్టు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 12 మంది వైసీపీ చోటా నేత‌లు జైల్లో ఉన్నారు. బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌, విజ‌య‌వాడ న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ శైల‌జ‌ భ‌ర్త అవుతు శ్రీనివాస‌రావు కూడా జైల్లోనే ఉన్నారు. వీరిని ఇటీవ‌ల జ‌గ‌న్ ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. వీరికి సంబంధించిన బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉంది.

This post was last modified on September 13, 2024 3:41 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

23 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

6 hours ago