Political News

సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. సీబీఐపై సుప్రీం ఆగ్ర‌హం!

ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసులో బెయిల్ ఇస్తూ.. కోర్టు శుక్ర‌వారం ఉద‌యం ఫ‌స్ట్ కేసులోనే ఆదేశాలు జారీ చేసింది. వాస్త‌వానికి ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఈడీ న‌మోదు చేసిన అభియోగాల‌తో కేజ్రీవాల్ జైలు పాల‌య్యారు. కొన్ని నెల‌లుగా ఆయ‌న జైల్లోనే ఉన్నారు. అయితే.. ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు అంగీక‌రించ‌లేదు. ఇక, ఈ విష‌యంలో నైతిక బాధ్య‌త‌ను కోర్టు ఆయ‌న‌కే అప్ప‌గించింది.

ఇక‌, ఈడీ న‌మోదు చేసిన మ‌నీ లాండ‌రింగ్ కేసులో కేజ్రీవాల్‌కు గ‌త నెల‌లోనే బెయిల్ ల‌భించింది. కానీ, అప్ప‌టికే సీబీఐ ఇదే కుంభ‌కోణానికి సంబంధించి మ‌రో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. ఈ కేసు ఎటూ తేల‌క పోవ‌డంతో ఆయ‌న కు బెయిల్ ల‌భించ‌లేదు. దీనిపైనా ఆయ‌న ప‌దే ప‌దే బెయిల్ పిటిష‌న్లు స‌మ‌ర్పించారు. తాజాగా శుక్ర‌వారం ఉద‌యం తొలి కేసుగా ప‌రిగ‌ణించిన సుప్రీంకోర్టు.. దీనిపై విచార‌ణ జ‌రిపింది. త‌న‌పై న‌మోదైన ఎఫ్ ఐఆర్‌ను కేజ్రీవాల్ స‌వాల్ చేశారు.

ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌తో కూడిన ధ‌ర్మాస‌నం.. ప‌లుమార్లు విచార‌ణ చేసింది. ఈ క్ర‌మంలోనే వాద‌న‌లు ముగియ‌డం ఈ నెల 5న తీర్పును రిజ‌ర్వ్ చేసింది. ఇప్పుడు శుక్ర‌వారం(13వ తేదీ) ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు తీర్పును వెలువరించారు. అయితే.. ఇరువురు న్యాయ‌మూర్తులు వేర్వేరుగా తీర్పు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. కేజ్రీవాల్ అరెస్టును స‌మ‌ర్థించారు. ఆయ‌న‌ను చ‌ట్ట‌బ‌ద్ధంగానే అరెస్టు చేశార‌ని పేర్కొన్నారు.

అరెస్టు స‌మ‌యంలో సీఆర్ పీసీ నిబంధ‌న‌ల మేర‌కు కేజ్రీవాల్కు 41 నోటీసులు ఇచ్చార‌ని జ‌స్టిస్ తెలిపారు. ఇక‌, మ‌రో న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ మాత్రం కేజ్రీవాల్ అరెస్టుపై విభేదించారు. కేజ్రీవాల్‌కు బెయిల్ రాకూడ‌ద‌న్న ఉద్ద‌శంతోనే సీబీఐ ఆయ‌న‌పై కేసు పెట్టింద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

“22 మాసాల పాటు సీబీఐ అస‌లు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయ‌లేదు. ఈడీ పెట్టిన కేసులో ఆయ‌నకు బెయిల్ వ‌స్తుందన్న సంకేతాల నేప‌థ్యంలోనే సీబీఐ కేసు పెట్టి అరెస్టు చేసింది. దిగువ కోర్టు కేజ్రీవాల్కు రెగ్యుల‌ర్ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డిన స‌మ‌యంలోనే ఇదంతా జ‌రిగింది. 22 నెల‌ల పాటు అరెస్టు అవ‌స‌రం లేద‌న్న సీబీఐ.. అప్పుడే అరెస్టు చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది” అని జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ పేర్కొన్నారు.

కాగా.. తీర్పులు విడివిడిగా రాసిన‌ప్ప‌టికీ.. ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు మాత్రం కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాల్సిందేన‌ని.. సంయుక్తంగా తీర్పు రాయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈడీ కేసులో బెయిల్ ఇచ్చిన‌ప్పుడు.. ఎలాంటి ష‌ర‌తులు విధించారో.. అవే ష‌ర‌తులు ఇప్పుడు కూడా వ‌ర్తిస్తాయ‌ని పేర్కొన్నారు. దీంతో కేజ్రీవాల్‌కు ఉప‌శ‌మ‌నం ద‌క్కింది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

11 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago