టీడీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గం ప్రజలతో భేష్ అని అనిపించుకుంటున్నారు. ప్రస్తు తం ఆయన అమెరికాలో ఉన్నారు. అయినప్పటికీ.. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తన టీంను ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయన.. అమెరికాలో ఉంటూనే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 4న రాము అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇది ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కావడంతో రద్దు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
అయితే.. అప్పటికి బాగానే ఉన్న గుడివాడ పట్టణం.. ఆ మరుసటి రోజు నుంచి కొంత వరదలకు ప్రభావితమైంది. అయినప్పటికీ.. వెనిగండ్ల రాము సమర్థవంతంగా ఇక్కడ పనులు చక్కబెట్టారు.
లోతట్టు ప్రాంతాలైన గుడివాడ బస్ స్టాండ్ పరిధిలోని వాసులను స్థానిక కల్యాణ మందిరానికి తరిలించారు. అందరికీ ఆహారం, తాగునీటిని ఏర్పాటు చేశారు. సామాన్లను కూడా కొందరివి సురక్షిత ప్రాంతానికి చేర్చినట్టు రాము అనుచరులు సత్యనారాయణ చౌదరి, వికాస్ తెలిపారు.
ఇక, రాము లేడన్న మాటే కానీ.. ఇక్కడ అందుతున్న సహాయక చర్యలకు లోటు రాకుండా చూసుకున్నట్టు స్థానికు లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ నాయకుల జాడ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎవరూ వైసీపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టలేదు. ఇదిలావుంటే.. అమెరికాలో పర్యటిస్తున్న రాము.. డల్లాస్లోని మహత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించారు. ఇది అమెరికాలోనే అతి పెద్ద మెమోరియల్ కావడం గమనార్హం.
అదేసమయంలో ఎన్నికల వేళతనకు ఆప్తులుగా నిలిచిన ఎన్నారైలను కూడా రాము కలుసుకున్నారు. వారికి ధన్య వాదాలు తెలిపారు. అయితే.. గుడివాడలో చిత్రం ఏంటంటే.. స్థానిక ఎమ్మెల్యే లేని సమయంలో ఉన్న గ్యాప్ను వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వినియోగించుకోకపోవడమే.
నిజానికి ఇంత విపత్తు సంభవిస్తే.. నాని కానీ, ఆయన అనుచరులు కానీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మరి కారణాలు ఏమైనా.. కొడాలి ప్లేస్ను రాము ఫుల్లుగా ఆక్యుపై చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 12, 2024 5:13 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…