టీడీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గం ప్రజలతో భేష్ అని అనిపించుకుంటున్నారు. ప్రస్తు తం ఆయన అమెరికాలో ఉన్నారు. అయినప్పటికీ.. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తన టీంను ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయన.. అమెరికాలో ఉంటూనే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 4న రాము అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇది ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కావడంతో రద్దు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
అయితే.. అప్పటికి బాగానే ఉన్న గుడివాడ పట్టణం.. ఆ మరుసటి రోజు నుంచి కొంత వరదలకు ప్రభావితమైంది. అయినప్పటికీ.. వెనిగండ్ల రాము సమర్థవంతంగా ఇక్కడ పనులు చక్కబెట్టారు.
లోతట్టు ప్రాంతాలైన గుడివాడ బస్ స్టాండ్ పరిధిలోని వాసులను స్థానిక కల్యాణ మందిరానికి తరిలించారు. అందరికీ ఆహారం, తాగునీటిని ఏర్పాటు చేశారు. సామాన్లను కూడా కొందరివి సురక్షిత ప్రాంతానికి చేర్చినట్టు రాము అనుచరులు సత్యనారాయణ చౌదరి, వికాస్ తెలిపారు.
ఇక, రాము లేడన్న మాటే కానీ.. ఇక్కడ అందుతున్న సహాయక చర్యలకు లోటు రాకుండా చూసుకున్నట్టు స్థానికు లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ నాయకుల జాడ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎవరూ వైసీపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టలేదు. ఇదిలావుంటే.. అమెరికాలో పర్యటిస్తున్న రాము.. డల్లాస్లోని మహత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించారు. ఇది అమెరికాలోనే అతి పెద్ద మెమోరియల్ కావడం గమనార్హం.
అదేసమయంలో ఎన్నికల వేళతనకు ఆప్తులుగా నిలిచిన ఎన్నారైలను కూడా రాము కలుసుకున్నారు. వారికి ధన్య వాదాలు తెలిపారు. అయితే.. గుడివాడలో చిత్రం ఏంటంటే.. స్థానిక ఎమ్మెల్యే లేని సమయంలో ఉన్న గ్యాప్ను వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వినియోగించుకోకపోవడమే.
నిజానికి ఇంత విపత్తు సంభవిస్తే.. నాని కానీ, ఆయన అనుచరులు కానీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మరి కారణాలు ఏమైనా.. కొడాలి ప్లేస్ను రాము ఫుల్లుగా ఆక్యుపై చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 12, 2024 5:13 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…