టీడీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గం ప్రజలతో భేష్ అని అనిపించుకుంటున్నారు. ప్రస్తు తం ఆయన అమెరికాలో ఉన్నారు. అయినప్పటికీ.. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తన టీంను ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయన.. అమెరికాలో ఉంటూనే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 4న రాము అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇది ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కావడంతో రద్దు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
అయితే.. అప్పటికి బాగానే ఉన్న గుడివాడ పట్టణం.. ఆ మరుసటి రోజు నుంచి కొంత వరదలకు ప్రభావితమైంది. అయినప్పటికీ.. వెనిగండ్ల రాము సమర్థవంతంగా ఇక్కడ పనులు చక్కబెట్టారు.
లోతట్టు ప్రాంతాలైన గుడివాడ బస్ స్టాండ్ పరిధిలోని వాసులను స్థానిక కల్యాణ మందిరానికి తరిలించారు. అందరికీ ఆహారం, తాగునీటిని ఏర్పాటు చేశారు. సామాన్లను కూడా కొందరివి సురక్షిత ప్రాంతానికి చేర్చినట్టు రాము అనుచరులు సత్యనారాయణ చౌదరి, వికాస్ తెలిపారు.
ఇక, రాము లేడన్న మాటే కానీ.. ఇక్కడ అందుతున్న సహాయక చర్యలకు లోటు రాకుండా చూసుకున్నట్టు స్థానికు లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ నాయకుల జాడ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎవరూ వైసీపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టలేదు. ఇదిలావుంటే.. అమెరికాలో పర్యటిస్తున్న రాము.. డల్లాస్లోని మహత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించారు. ఇది అమెరికాలోనే అతి పెద్ద మెమోరియల్ కావడం గమనార్హం.
అదేసమయంలో ఎన్నికల వేళతనకు ఆప్తులుగా నిలిచిన ఎన్నారైలను కూడా రాము కలుసుకున్నారు. వారికి ధన్య వాదాలు తెలిపారు. అయితే.. గుడివాడలో చిత్రం ఏంటంటే.. స్థానిక ఎమ్మెల్యే లేని సమయంలో ఉన్న గ్యాప్ను వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వినియోగించుకోకపోవడమే.
నిజానికి ఇంత విపత్తు సంభవిస్తే.. నాని కానీ, ఆయన అనుచరులు కానీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మరి కారణాలు ఏమైనా.. కొడాలి ప్లేస్ను రాము ఫుల్లుగా ఆక్యుపై చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 12, 2024 5:13 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…