అధికారంలో ఉండగా.. ఏం చేసినా చెల్లుతుందని భావించేవారు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఎవరు మాత్రం పట్టించుకుంటారు.. అధికారం ఉండగానే నాలుగు రాళ్లు వెనుకేసుకుందామని భావిస్తున్నారు. నయానో భయానో.. ఇలా కోట్ల రూపాయలు పోగేసుకున్నవారు.. చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతోపాటు.. తమకు లభిస్తున్న భరోసా కారణంగా.. నాటి బాధితులు నేడు న్యాయం కోసం క్యూ కడుతున్నారు.
ఇలాంటి వారిలో గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన నల్లపనేని చలపతిరావు.. తెరమీదికి వచ్చారు. ఈయన యడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్(కంకర ఉత్పత్తి) యజమాని. తన మిత్రులతో కలిసి ఈయన కొన్ని దశాబ్దాలుగా స్టోన్ క్రషర్ను నిర్వహిస్తున్నారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఎన్నికలకు ఏడాది ముందు.. అప్పటి మంత్రి విడదల రజనీ.. తనను బెదిరించారని.. 5 కోట్ల రూపాయలు కప్పం కట్టాలని ఆమె తన అనుచరులతో బెదిరింపులకు దిగారని చలపతిరావు పేర్కొన్నారు.
అయితే.. ఎందుకు చెల్లించాలని తన మిత్రులు ప్రశ్నించగా.. అప్పటి ఓ పోలీసు అధికారితో నిర్బంధించి వేదింపులకు గురి చేశారు. ఇస్తే.. ఐదు కోట్లతో పోతుంది. లేకపోతే.. క్రషర్ యూనిట్టే మూసుకోవాల్సి వస్తుందని అధికారులు ఒత్తిడి చేసినట్టు చలపతిరావు పేర్కొన్నారు. దీంతో తన మిత్రులు వ్యాపారం నుంచి విరమించుకోగా.. తాను అప్పులు చేసి రజనీ చెప్పిన వారికి రూ.2.20 కోట్ల రూపాయలను చెల్లించానని ఆయన తెలిపారు.
ఈ మొత్తానికి ఇప్పుడు వడ్డీలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నానని.. తనకు ఆ సొమ్ము వెనక్కి ఇప్పించాలని చలపతిరావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారంపై పోలీసులు ఏం చేయాల ని ఆలోచనలో పడ్డారు. కేసు పెట్టి విచారణ చేస్తే.. ఏళ్ల తరబడి కేసు అలానే సాగుతుంది. అలాగని వదిలేస్తే.. ఆత్మహత్య తప్పదన్న చలపతిరావు కు న్యాయం జరగదు. సో.. ఈ పరిణామాలను గుంటూరుకు చెందిన ముఖ్య నేతలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 12, 2024 2:40 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…