కొన్నాళ్ల కిందట రిటైర్ అయిన.. సీనియర్ ఐపీఎస్ అధికారి పరారీలో ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అంటే.. ఇది బహిరంగంగా ప్రకటించకపోయినా.. అంతర్గతంగా పోలీసులు చెబుతున్న మాట. ఆయన కోసం.. ఇప్పుడు పోలీసులు నలుచెరగులా వెతుకుతున్నారు. ఎందుకు? ఏమిటి? అంటే.. దీని వెనుక చాలానే ఉందని కూడా అంటున్నారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజును నిర్బంధించిన విషయం రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది.
దీనిలో అనేక మంది ఐపీఎస్ల పాత్ర ఉందని రఘురామ అప్పట్లోనే వాదించారు. వీరిపై ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. నిర్బంధించడం వరకు ఓకే.. కానీ, అప్పటి సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని.. తన అరికాళ్లు వాచేలా కొట్టారన్నది రఘురామ వాదన. ఈ క్రమంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ పాల్. ఈయనపై రెండు నెలల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన పరారీలో ఉన్నారని డీజీపీకి అందించిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇదిలావుంటే.. తనను అరెస్టు నుంచి కాపాడాలంటూ.. విజయ్ పాల్ పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇంతలోనే ఆయన ఇంటికి తాళం వేయడంతో ఇక, పరారీలో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు.
దర్యాప్తుకు సహకరించని వాళ్లు ముందస్తు బెయిల్ కు అనర్హులని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా చేసిన వాదనలను హైకోర్టు సమర్థించింది. అంతేకాదు.. ఈ కేసులో బాధితుడిగా తన కు ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాల క్రమంలో విజయ్ పాల్ కనిపించకుండా పోవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
This post was last modified on September 12, 2024 11:29 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…