Political News

ప‌రారీలో రిటైర్డ్ ఐపీఎస్‌.. రీజ‌నేంటి?

కొన్నాళ్ల కింద‌ట రిటైర్ అయిన‌.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ప‌రారీలో ఉన్న‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. అంటే.. ఇది బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా పోలీసులు చెబుతున్న మాట‌. ఆయ‌న కోసం.. ఇప్పుడు పోలీసులు న‌లుచెర‌గులా వెతుకుతున్నారు. ఎందుకు? ఏమిటి? అంటే.. దీని వెనుక చాలానే ఉంద‌ని కూడా అంటున్నారు. గ‌తంలో వైసీపీ ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణ రాజును నిర్బంధించిన విష‌యం రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం సృష్టించింది.

దీనిలో అనేక మంది ఐపీఎస్‌ల పాత్ర ఉంద‌ని ర‌ఘురామ అప్ప‌ట్లోనే వాదించారు. వీరిపై ఆయ‌న కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. నిర్బంధించ‌డం వ‌ర‌కు ఓకే.. కానీ, అప్ప‌టి సీఎం జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం కోసం.. త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగం చేశార‌ని.. త‌న అరికాళ్లు వాచేలా కొట్టార‌న్న‌ది ర‌ఘురామ వాద‌న‌. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.. రిటైర్డ్ ఐపీఎస్ విజ‌య్ పాల్‌. ఈయ‌న‌పై రెండు నెల‌ల కింద‌ట గుంటూరు పోలీసుల‌కు ర‌ఘురామ ఫిర్యాదు కూడా చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్ల‌గా తాళం వేసి ఉంది. దీంతో ఆయ‌న ప‌రారీలో ఉన్నార‌ని డీజీపీకి అందించిన నివేదిక‌లో పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. త‌న‌ను అరెస్టు నుంచి కాపాడాలంటూ.. విజ‌య్ పాల్ పెట్టుకున్న పిటిష‌న్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు మార్గం సుగ‌మం అయింది. ఇంత‌లోనే ఆయ‌న ఇంటికి తాళం వేయ‌డంతో ఇక‌, ప‌రారీలో ఉన్న‌ట్టుగా పోలీసులు నిర్ధారించారు.

దర్యాప్తుకు సహకరించని వాళ్లు ముందస్తు బెయిల్ కు అనర్హులని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా చేసిన వాదనలను హైకోర్టు స‌మ‌ర్థించింది. అంతేకాదు.. ఈ కేసులో బాధితుడిగా తన కు ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో విజ‌య్ పాల్ క‌నిపించ‌కుండా పోవ‌డం పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

Satya

Recent Posts

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

44 minutes ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

5 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

6 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

8 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

8 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

10 hours ago