Political News

ప‌రారీలో రిటైర్డ్ ఐపీఎస్‌.. రీజ‌నేంటి?

కొన్నాళ్ల కింద‌ట రిటైర్ అయిన‌.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ప‌రారీలో ఉన్న‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. అంటే.. ఇది బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా పోలీసులు చెబుతున్న మాట‌. ఆయ‌న కోసం.. ఇప్పుడు పోలీసులు న‌లుచెర‌గులా వెతుకుతున్నారు. ఎందుకు? ఏమిటి? అంటే.. దీని వెనుక చాలానే ఉంద‌ని కూడా అంటున్నారు. గ‌తంలో వైసీపీ ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణ రాజును నిర్బంధించిన విష‌యం రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం సృష్టించింది.

దీనిలో అనేక మంది ఐపీఎస్‌ల పాత్ర ఉంద‌ని ర‌ఘురామ అప్ప‌ట్లోనే వాదించారు. వీరిపై ఆయ‌న కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. నిర్బంధించ‌డం వ‌ర‌కు ఓకే.. కానీ, అప్ప‌టి సీఎం జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం కోసం.. త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగం చేశార‌ని.. త‌న అరికాళ్లు వాచేలా కొట్టార‌న్న‌ది ర‌ఘురామ వాద‌న‌. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.. రిటైర్డ్ ఐపీఎస్ విజ‌య్ పాల్‌. ఈయ‌న‌పై రెండు నెల‌ల కింద‌ట గుంటూరు పోలీసుల‌కు ర‌ఘురామ ఫిర్యాదు కూడా చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్ల‌గా తాళం వేసి ఉంది. దీంతో ఆయ‌న ప‌రారీలో ఉన్నార‌ని డీజీపీకి అందించిన నివేదిక‌లో పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. త‌న‌ను అరెస్టు నుంచి కాపాడాలంటూ.. విజ‌య్ పాల్ పెట్టుకున్న పిటిష‌న్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు మార్గం సుగ‌మం అయింది. ఇంత‌లోనే ఆయ‌న ఇంటికి తాళం వేయ‌డంతో ఇక‌, ప‌రారీలో ఉన్న‌ట్టుగా పోలీసులు నిర్ధారించారు.

దర్యాప్తుకు సహకరించని వాళ్లు ముందస్తు బెయిల్ కు అనర్హులని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా చేసిన వాదనలను హైకోర్టు స‌మ‌ర్థించింది. అంతేకాదు.. ఈ కేసులో బాధితుడిగా తన కు ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో విజ‌య్ పాల్ క‌నిపించ‌కుండా పోవ‌డం పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

This post was last modified on September 12, 2024 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాయిపల్లవి డిమాండ్ అంతకు మించి

ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి నెంబర్ల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పేసుకుని ఎక్కువ సంపాదించాలనే యావ చూపించలేదు.…

53 minutes ago

ట్రంప్ తో ఒప్పందం… పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి…

2 hours ago

పాకిస్థానీలే విల‌న్లు… పాకిస్థాన్‌లో నంబ‌ర్‌వ‌న్‌

భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉండ‌గా.. గ‌త ఏడాది ప‌హ‌ల్గాం దాడితో అవి మ‌రింత క్షీణించాయి.…

2 hours ago

ఆ హీరోకు 80 కోట్లా?

నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని…

2 hours ago

‘దంగల్’ రికార్డుకు మూడినట్లేనా?

పదేళ్ల ముందు రిలీజైన సినిమా.. దంగల్. కానీ ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డు ఆ సినిమా పేరు…

2 hours ago

పరామర్శ యాత్రలు కాదు… అసెంబ్లీకి రండి సార్..!

వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు,…

3 hours ago