కొన్నాళ్ల కిందట రిటైర్ అయిన.. సీనియర్ ఐపీఎస్ అధికారి పరారీలో ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అంటే.. ఇది బహిరంగంగా ప్రకటించకపోయినా.. అంతర్గతంగా పోలీసులు చెబుతున్న మాట. ఆయన కోసం.. ఇప్పుడు పోలీసులు నలుచెరగులా వెతుకుతున్నారు. ఎందుకు? ఏమిటి? అంటే.. దీని వెనుక చాలానే ఉందని కూడా అంటున్నారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజును నిర్బంధించిన విషయం రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది.
దీనిలో అనేక మంది ఐపీఎస్ల పాత్ర ఉందని రఘురామ అప్పట్లోనే వాదించారు. వీరిపై ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. నిర్బంధించడం వరకు ఓకే.. కానీ, అప్పటి సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని.. తన అరికాళ్లు వాచేలా కొట్టారన్నది రఘురామ వాదన. ఈ క్రమంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ పాల్. ఈయనపై రెండు నెలల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన పరారీలో ఉన్నారని డీజీపీకి అందించిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇదిలావుంటే.. తనను అరెస్టు నుంచి కాపాడాలంటూ.. విజయ్ పాల్ పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇంతలోనే ఆయన ఇంటికి తాళం వేయడంతో ఇక, పరారీలో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు.
దర్యాప్తుకు సహకరించని వాళ్లు ముందస్తు బెయిల్ కు అనర్హులని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా చేసిన వాదనలను హైకోర్టు సమర్థించింది. అంతేకాదు.. ఈ కేసులో బాధితుడిగా తన కు ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాల క్రమంలో విజయ్ పాల్ కనిపించకుండా పోవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
This post was last modified on September 12, 2024 11:29 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…