కొన్నాళ్ల కిందట రిటైర్ అయిన.. సీనియర్ ఐపీఎస్ అధికారి పరారీలో ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అంటే.. ఇది బహిరంగంగా ప్రకటించకపోయినా.. అంతర్గతంగా పోలీసులు చెబుతున్న మాట. ఆయన కోసం.. ఇప్పుడు పోలీసులు నలుచెరగులా వెతుకుతున్నారు. ఎందుకు? ఏమిటి? అంటే.. దీని వెనుక చాలానే ఉందని కూడా అంటున్నారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజును నిర్బంధించిన విషయం రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది.
దీనిలో అనేక మంది ఐపీఎస్ల పాత్ర ఉందని రఘురామ అప్పట్లోనే వాదించారు. వీరిపై ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. నిర్బంధించడం వరకు ఓకే.. కానీ, అప్పటి సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని.. తన అరికాళ్లు వాచేలా కొట్టారన్నది రఘురామ వాదన. ఈ క్రమంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ పాల్. ఈయనపై రెండు నెలల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన పరారీలో ఉన్నారని డీజీపీకి అందించిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇదిలావుంటే.. తనను అరెస్టు నుంచి కాపాడాలంటూ.. విజయ్ పాల్ పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇంతలోనే ఆయన ఇంటికి తాళం వేయడంతో ఇక, పరారీలో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు.
దర్యాప్తుకు సహకరించని వాళ్లు ముందస్తు బెయిల్ కు అనర్హులని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా చేసిన వాదనలను హైకోర్టు సమర్థించింది. అంతేకాదు.. ఈ కేసులో బాధితుడిగా తన కు ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాల క్రమంలో విజయ్ పాల్ కనిపించకుండా పోవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
This post was last modified on September 12, 2024 11:29 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…