ఒక ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలి. ఒక మైనస్ నుంచి అనేక మార్పులు చోటు చేసుకోవాలి. ఇది రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. పైగా.. ప్రజలకు ఎంతో చేశానని చెప్పినా.. ఘోరంగా ఓడిపోయిన జగన్.. అండ్కో.. మరింత ఆత్మ విమర్శ చేసుకోవాలి. కారణాలు వెతుక్కోవాలి. లేదా.. కళ్ల ముందు కనిపిస్తున్నవాటిని ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి. కానీ, ఆదిశగా అధినేత కానీ.. నాయకులు కానీ.. అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు.
రాజకీయాల్లో కావాల్సింది.. అనునయం. అప్పటి వరకు రెచ్చిపోయిన వారు కూడా.. ఎన్నికలకు ముందు చప్పబడ్డారు. జనం నాడిని తెలుసుకున్నారు. వారికి అనుకూలంగా వ్యవహరించారు. ఫలితం కళ్ల ముందు కనిపించింది. మరి సుదీర్ఘ రాజకీయ జీవితం.. అంటే.. కనీసంలో కనీసం 25 సంవత్సరాల రాజకీయ భవితవ్యం ఉన్న జగన్ మాత్రం ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. నోరు కుదరడం లేదు.. నాణ్యంగా ప్రజలను మెప్పించలేకపోతున్నారు కూడా.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి ఆయన మెరుగైన ఫలితం అందుకునే అవకాశం ఉన్నా.. ఎక్కడో తడబడుతున్నారు. ఇంకా.. బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. మంచి ఎంత చేసినా.. చెడు అనే చిన్న ఉప్పు గల్లు.. కుండెడు పాలను కబళించిన చందంగానే.. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి. “మేం వస్తే.. మొత్తాన్నీ లోపలేస్తాం” అంటూ.. ఆయన టీడీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. జగన్ మారలేదు.. అన్న మాటను మరోసారి బలపరుస్తున్నాయి.
ప్రజలకు అల్టర్నేటివ్ ఉంది. అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ, జగన్కు ఆల్టర్నేటివ్ లేదు. ఒక్క ప్రజలు తప్ప. అలాంటిది వారిని మచ్చిక చేసుకుని.. నాలుగు మంచి మాటలతో మెప్పించే ప్రయత్నం అయితే ఆయన చేయడం లేకపోతున్నారు. కస్సుబుస్సులు.. బెదిరింపులు.. ఘీంకరింపులు.. వార్నింగు లు.. ఒక్కనాటికి కూడా ఓటు బ్యాంకును చేరువ చేయలేవు. బెదిరించి భయ పెట్టేవాడు.. బంగారం ఇచ్చినా ప్రజలు తీసుకోరు. మంచిగా మాట్లాడేవాడు గంజిపోసినా చాలనుకుంటారు. ఇప్పుడు దీనిని బట్టి జగన్ తనను తాను మార్చుకోకపోతే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం ఖాయం.
This post was last modified on September 12, 2024 11:24 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…