రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. దీనినే నిరూపించారు.. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురా మకృష్ణరాజు. తాజాగా ఆయన కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మతో భేటీ అయ్యారు.
మర్యాద పూర్వకంగానే ఇరువురు చర్చించుకున్నారు. అయితే.. వీరి భేటీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి కారణం.. ఎన్నికలకు ముందు జరిగిన తీవ్ర పరిణామాలు.
వాస్తవానికి నరసాపురం ప్రాంతానికే చెందిన వర్మ-రాజు ఇద్దరూ మిత్రులు. ఆర్ఎస్ఎస్ నుంచి వర్మ రాజకీయాల్లోకి వచ్చారు. రఘురామ మాత్రం వ్యాపార వేత్తగా ఎదిగి.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ మంచి మిత్రులు.
అయితే.. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాజు.. నరసాపురం ఎంపీ టికెట్ను ఆశించారు. బీజేపీ నుంచైనా.. లేక టీడీపీ నుంచి అయినా.. ఆయన నరసాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.
కానీ, ఇదే సమయంలో బీజేపీ శ్రీనివాసవర్మకు ఈ టికెట్ ఇచ్చేసింది. దీంతో రఘురామ తీవ్రంగా హర్ట య్యారు. ఎన్నికల నామినేషన్ సమయంలో ఏదో ఒక క్షణంలో అయినా..త నను కరుణించకపోతారా? అని ఎదురు చూశారు. కానీ, కుదరలేదు.
దీంతో చివరకు.. చంద్రబాబు జోక్యం చేసుకుని ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో రఘురామ అక్కడ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
మరోవైపు వర్మ కూడా విజయం సాధించారు. అయితే..రఘురామ మనసులో మాత్రం పార్లమెంటుకు వెళ్ల లేక పోయానన్న ఆవేదన ఉంది. దీంతో వర్మతో ఆయన చాలా రోజులు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఇరువురు నేతలు భేటీ కావడం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే.. మూడు మాసాల కిందట జరిగిన రాజకీయ పరిణామాల జోలికి పోకుండా.. ఇరువురు నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీంతో ఇరువురి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు సమసిపోయినట్టేనని తెలుస్తోంది.
This post was last modified on September 11, 2024 9:33 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…