Political News

వ‌ర్మ వ‌ర్సెస్ రాజు.. చేతులు క‌లిపారు!

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. దీనినే నిరూపించారు.. ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురా మకృష్ణ‌రాజు. తాజాగా ఆయ‌న కేంద్ర మంత్రి, న‌ర‌సాపురం ఎంపీ శ్రీనివాస‌వ‌ర్మ‌తో భేటీ అయ్యారు.

మ‌ర్యాద పూర్వ‌కంగానే ఇరువురు చ‌ర్చించుకున్నారు. అయితే.. వీరి భేటీకి ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీనికి కార‌ణం.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన తీవ్ర ప‌రిణామాలు.

వాస్త‌వానికి న‌ర‌సాపురం ప్రాంతానికే చెందిన వ‌ర్మ‌-రాజు ఇద్ద‌రూ మిత్రులు. ఆర్ఎస్ఎస్ నుంచి వ‌ర్మ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ర‌ఘురామ మాత్రం వ్యాపార వేత్త‌గా ఎదిగి.. త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇద్దరూ మంచి మిత్రులు.

అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రాజు.. న‌ర‌సాపురం ఎంపీ టికెట్‌ను ఆశించారు. బీజేపీ నుంచైనా.. లేక టీడీపీ నుంచి అయినా.. ఆయ‌న న‌ర‌సాపురం నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు.

కానీ, ఇదే స‌మ‌యంలో బీజేపీ శ్రీనివాస‌వ‌ర్మ‌కు ఈ టికెట్ ఇచ్చేసింది. దీంతో ర‌ఘురామ తీవ్రంగా హ‌ర్ట య్యారు. ఎన్నిక‌ల నామినేష‌న్ స‌మ‌యంలో ఏదో ఒక క్ష‌ణంలో అయినా..త న‌ను క‌రుణించ‌క‌పోతారా? అని ఎదురు చూశారు. కానీ, కుద‌ర‌లేదు.

దీంతో చివ‌ర‌కు.. చంద్ర‌బాబు జోక్యం చేసుకుని ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో ర‌ఘురామ అక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

మ‌రోవైపు వ‌ర్మ కూడా విజ‌యం సాధించారు. అయితే..ర‌ఘురామ మ‌న‌సులో మాత్రం పార్ల‌మెంటుకు వెళ్ల లేక పోయాన‌న్న ఆవేద‌న ఉంది. దీంతో వ‌ర్మ‌తో ఆయన చాలా రోజులు మాట్లాడ‌కుండా మౌనంగా ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఇరువురు నేత‌లు భేటీ కావ‌డం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపింది. అయితే.. మూడు మాసాల కింద‌ట జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల జోలికి పోకుండా.. ఇరువురు నేత‌లు ప‌ర‌స్ప‌రం కుశ‌ల ప్ర‌శ్న‌లు వేసుకున్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య నెల‌కొన్న రాజ‌కీయ విభేదాలు స‌మ‌సిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది.

This post was last modified on September 11, 2024 9:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

24 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

1 hour ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago