Political News

ఆ ఘ‌ట‌న న‌న్ను క‌లిచి వేసింది: చంద్ర‌బాబు

తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి నుంచి జీడిపిక్కల లోడ్‍తో వెళ్తున్న‌ లారీ.. అర్థరాత్రి దేవ‌ర‌ప‌ల్లి వ‌ద్ద బోల్తా కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో లారీపై ప్ర‌యాణిస్తున్న కూలీలు.. లారీ కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే సీఎం చంద్ర‌బాబు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

రోడ్డు ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందడంపై చంద్ర‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. “లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం న‌న్ను ఎంతో కలచివేసింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తాం” అని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇదేస‌మ‌యంలో క్ష‌త‌గాత్రుల‌కు అన్ని విధాలా మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను కూడా ఆయ‌న ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం అన్నారు.

కాగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా దేవ‌ర‌ప‌ల్లి రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిలకావారిపాకలు దగ్గర చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవడం బాధాకరమ‌ని పేర్కొన్నారు. “కష్ట జీవులు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రభుత్వం ఆ కుటుంబాలను తగిన విధంగా ఆదుకొంటుంది” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి జీడిగింజల లోడుతో నిడదవోలు మండలం తాడిమల్లకు ఓ లారీ వెళ్తోంది. అయితే.. మంగ‌ళ‌వారం రాత్రి స‌మ‌యంలో చినుకులు ప‌డుతుండ‌గా.. దారి స‌రిగా క‌నిపించ‌లేదు. దీంతో చిన్నయగూడెం శివారులో అదుపు తప్పి పంట కాలువలోకి వాహ‌నం బోల్తా కొట్టింది. ఆ స‌మ‌యంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణం చేస్తున్నారు. వీరంతా కూలీలే. జీడీ గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. అయితే.. కేబిన్లో ఉన్న డ్రైవ‌ర్ స‌హా ముగ్గురు సురక్షితంగా ఉన్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

4 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

6 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

8 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

9 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

9 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

9 hours ago