ఈ నెలలో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల నిమిత్తం లండన్ వెళ్లాలని భావించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు కొంత ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు విషయంలో నెలకొన్న వివాదానికి రాష్ట్ర హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే.. ఈ విషయంలో జగన్ కోరుకున్నట్టుగా అయితే ఆదేశాలు రాకపోవ డం గమనార్హం. కేవలం ఒకే ఒక్క విషయంలో ఆయనకు ఊరట లభించింది.
జగన్ కోరిక-1: తన పాస్ పోర్టును ఒక ఏడాదికే పరిమితం చేస్తూ.. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి.. తనకు ఐదేళ్లకు పాస్ పోర్టు ఇప్పించాలని. ఈ విషయంపైనే హైకోర్టు కు వెళ్లారు.
హైకోర్టు ఆదేశం: జగన్ కోరుకున్నట్టుగానే హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. ఏడాది కాదు.. మొత్తం ఐదేళ్లకు సరిపోయేలా పాస్ పోర్టును ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
జగన్ కోరిక-2: పాస్ పోర్టు మంజూరు చేసేందుకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన షరతులను తొలగించాలని. ఎలాంటి షరతులు లేకుండా పాస్ పోర్టు మంజూరు చేయాలని.
హైకోర్టు ఆదేశం: ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన అన్ని షరతులూ.. కొనసాగుతాయి. ఆ మేరకు పిటిషనర్(జగన్) షరతులు పాటించాలి.
ఏంటా షరతులు?
+ జగన్పై నమోదైన పరువు నష్టం కేసు(ప్రస్తుత మంత్రినారాయణ 2021లో దాఖలు చేశారు. ఇది విచారణ దశలోనే ఉంది)కు సంబంధించి రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలి.
+ ఈ పూచీకత్తును జగన్ స్వయంగా కోర్టుకు వచ్చి సమర్పించాలి.
+ పరువు నష్టం కేసులో సమన్లు అందలేదా? అందినా తీసుకోలేదా..? అనే విషయంపై స్వయంగా వివరణ ఇవ్వాలి.
ఫైనల్గా: జగన్కు ఊరట లభించింది. కానీ, షరతులు మాత్రం వర్తిస్తాయి. దీంతో ఆయన సుమారు 6 సంవత్సరాల తర్వాత.. కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on September 11, 2024 9:14 pm
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…