ఈ నెలలో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల నిమిత్తం లండన్ వెళ్లాలని భావించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు కొంత ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు విషయంలో నెలకొన్న వివాదానికి రాష్ట్ర హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే.. ఈ విషయంలో జగన్ కోరుకున్నట్టుగా అయితే ఆదేశాలు రాకపోవ డం గమనార్హం. కేవలం ఒకే ఒక్క విషయంలో ఆయనకు ఊరట లభించింది.
జగన్ కోరిక-1: తన పాస్ పోర్టును ఒక ఏడాదికే పరిమితం చేస్తూ.. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి.. తనకు ఐదేళ్లకు పాస్ పోర్టు ఇప్పించాలని. ఈ విషయంపైనే హైకోర్టు కు వెళ్లారు.
హైకోర్టు ఆదేశం: జగన్ కోరుకున్నట్టుగానే హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. ఏడాది కాదు.. మొత్తం ఐదేళ్లకు సరిపోయేలా పాస్ పోర్టును ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
జగన్ కోరిక-2: పాస్ పోర్టు మంజూరు చేసేందుకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన షరతులను తొలగించాలని. ఎలాంటి షరతులు లేకుండా పాస్ పోర్టు మంజూరు చేయాలని.
హైకోర్టు ఆదేశం: ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన అన్ని షరతులూ.. కొనసాగుతాయి. ఆ మేరకు పిటిషనర్(జగన్) షరతులు పాటించాలి.
ఏంటా షరతులు?
+ జగన్పై నమోదైన పరువు నష్టం కేసు(ప్రస్తుత మంత్రినారాయణ 2021లో దాఖలు చేశారు. ఇది విచారణ దశలోనే ఉంది)కు సంబంధించి రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలి.
+ ఈ పూచీకత్తును జగన్ స్వయంగా కోర్టుకు వచ్చి సమర్పించాలి.
+ పరువు నష్టం కేసులో సమన్లు అందలేదా? అందినా తీసుకోలేదా..? అనే విషయంపై స్వయంగా వివరణ ఇవ్వాలి.
ఫైనల్గా: జగన్కు ఊరట లభించింది. కానీ, షరతులు మాత్రం వర్తిస్తాయి. దీంతో ఆయన సుమారు 6 సంవత్సరాల తర్వాత.. కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on September 11, 2024 9:14 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…