ఈ నెలలో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల నిమిత్తం లండన్ వెళ్లాలని భావించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు కొంత ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు విషయంలో నెలకొన్న వివాదానికి రాష్ట్ర హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే.. ఈ విషయంలో జగన్ కోరుకున్నట్టుగా అయితే ఆదేశాలు రాకపోవ డం గమనార్హం. కేవలం ఒకే ఒక్క విషయంలో ఆయనకు ఊరట లభించింది.
జగన్ కోరిక-1: తన పాస్ పోర్టును ఒక ఏడాదికే పరిమితం చేస్తూ.. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి.. తనకు ఐదేళ్లకు పాస్ పోర్టు ఇప్పించాలని. ఈ విషయంపైనే హైకోర్టు కు వెళ్లారు.
హైకోర్టు ఆదేశం: జగన్ కోరుకున్నట్టుగానే హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. ఏడాది కాదు.. మొత్తం ఐదేళ్లకు సరిపోయేలా పాస్ పోర్టును ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
జగన్ కోరిక-2: పాస్ పోర్టు మంజూరు చేసేందుకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన షరతులను తొలగించాలని. ఎలాంటి షరతులు లేకుండా పాస్ పోర్టు మంజూరు చేయాలని.
హైకోర్టు ఆదేశం: ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన అన్ని షరతులూ.. కొనసాగుతాయి. ఆ మేరకు పిటిషనర్(జగన్) షరతులు పాటించాలి.
ఏంటా షరతులు?
+ జగన్పై నమోదైన పరువు నష్టం కేసు(ప్రస్తుత మంత్రినారాయణ 2021లో దాఖలు చేశారు. ఇది విచారణ దశలోనే ఉంది)కు సంబంధించి రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలి.
+ ఈ పూచీకత్తును జగన్ స్వయంగా కోర్టుకు వచ్చి సమర్పించాలి.
+ పరువు నష్టం కేసులో సమన్లు అందలేదా? అందినా తీసుకోలేదా..? అనే విషయంపై స్వయంగా వివరణ ఇవ్వాలి.
ఫైనల్గా: జగన్కు ఊరట లభించింది. కానీ, షరతులు మాత్రం వర్తిస్తాయి. దీంతో ఆయన సుమారు 6 సంవత్సరాల తర్వాత.. కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on September 11, 2024 9:14 pm
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…