తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులు ఆక్రమిస్తే.. చెరసాలేనిన వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారు.. తక్షణం వాటిని విడిచి వెళ్లాలని తేల్చి చెప్పారు. అంతేకాదు.. విడిచి వెళ్లకపోతే.. నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని తెలిపారు. ఆక్రమణలను సహించేది లేదన్నారు. `ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్లను రెగ్యులరైజ్ చేస్తామని.. కొందరు వేచి చూస్తున్నారు. కానీ, అలాంటి ఆశలు ఏమీ లేవు. అలాంటివేమీ చేయబోం“ అని రేవంత్ చెప్పారు.
తాజాగా సీఎం రేవంత్రెడ్డి బుధవారం తెలంగాణ అకాడమీలో ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు పలు విషయాల్లో దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో విచ్చలవిడిగా ఉన్న డ్రగ్స్ను, సైబర్ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
ఇక, ఆక్రమణలు.. హైడ్రా దూకుడుపై మాట్లాడుతూ.. “ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్ రెగ్యులరైస్ స్కీం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తున్నారు. దీనిలో రాజకీయాలు లేవు. కక్ష పూరిత చర్యలు లేవు. చెరువులను ఆక్రమిస్తే ఒప్పుకొనేదే లేదు“ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక, “సైనిక స్కూల్ తరహాలో పోలీసులకు 50 ఎకరాల్లో పోలీసు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం. ప్రక్షాళన చెయ్యడానికే కొత్తకోటకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేస్తాం. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం“ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
This post was last modified on September 11, 2024 9:07 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…