తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులు ఆక్రమిస్తే.. చెరసాలేనిన వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారు.. తక్షణం వాటిని విడిచి వెళ్లాలని తేల్చి చెప్పారు. అంతేకాదు.. విడిచి వెళ్లకపోతే.. నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని తెలిపారు. ఆక్రమణలను సహించేది లేదన్నారు. `ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్లను రెగ్యులరైజ్ చేస్తామని.. కొందరు వేచి చూస్తున్నారు. కానీ, అలాంటి ఆశలు ఏమీ లేవు. అలాంటివేమీ చేయబోం“ అని రేవంత్ చెప్పారు.
తాజాగా సీఎం రేవంత్రెడ్డి బుధవారం తెలంగాణ అకాడమీలో ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు పలు విషయాల్లో దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో విచ్చలవిడిగా ఉన్న డ్రగ్స్ను, సైబర్ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
ఇక, ఆక్రమణలు.. హైడ్రా దూకుడుపై మాట్లాడుతూ.. “ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్ రెగ్యులరైస్ స్కీం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తున్నారు. దీనిలో రాజకీయాలు లేవు. కక్ష పూరిత చర్యలు లేవు. చెరువులను ఆక్రమిస్తే ఒప్పుకొనేదే లేదు“ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక, “సైనిక స్కూల్ తరహాలో పోలీసులకు 50 ఎకరాల్లో పోలీసు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం. ప్రక్షాళన చెయ్యడానికే కొత్తకోటకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేస్తాం. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం“ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
This post was last modified on September 11, 2024 9:07 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…