గత వారం రోజులుగా రాజకీయంగా కీలకంగా మారిన ప్రకాశం బ్యారేజీ ఐరన్ బోట్ల వ్యవహారంపై వైసీపీ అధి నేత, మాజీ సీఎం జగన్ తాజాగా స్పందించారు. సీఎం చంద్రబాబు అయితే.. ప్రతి రోజూ దాదాపు ఈ బోట్ల గురించే మాట్లాడుతున్న విషయం తెలిసిందే.
కృష్ణానదికి వరద ఉధ్రుతి పెరిగిపోయి.. 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చిన సమయంలో మూడు ఐరన్ బోట్లు బలంగా బ్యారేజీ వెయిట్స్కు గుద్దుకు న్నాయి. దీంతో 67-69 మధ్య ఉన్న వెయిట్ దెబ్బతింది.
దీంతో అలెర్టయిన ప్రభుత్వం వెంటనే దీనికి మరమ్మతులు చేయించింది. అయితే.. ఇలా ఐరన్ బోట్లను వదిలి పెట్టడం.. బ్యారేజీవెయిట్ దెబ్బతినడం వెనుక రాజకీయ కుట్ర ఉందనేది అధికార పార్టీ నాయకు లు చెబుతున్న మాట. దీనిపైనే సీఎం చంద్రబాబు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల కుట్ర ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇవి వైసీపీ నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడికి చెందినవిగా గుర్తించామ ని కూడా చెప్పారు.
అయితే.. అప్పటి నుంచి వైసీపీ తరఫున కౌంటర్ రాలేదు. తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన జగన్.. ఈ బోట్ల వ్యవహారంపై మాట్లాడుతూ.. ఇవన్నీ.. టీడీపీ నేతలకు చెందినవేనని చెప్పారు. చంద్ర బాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని.. మూడు నెలల కిందట టీడీపీ గెలిచిన సమయంలో ఈ బొట్లలోనే టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
ఉషాద్రి, రామ్మోహన్ అనే వ్యక్తులు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేత నారా లోకేష్కు సన్నిహితులని వ్యాఖ్యానించారు.
ఎన్నారై టీడీపీ నేత బంధువులకు చెందిన బోట్లేనని, టీడీపీ నాయకుడు చిన్నాకు చెందినవేనని చెప్పా రు. ఈ బోట్లన్నీ ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొని వచ్చాయని జగన్ తెలిపారు. అయితే.. దీనిని కూడా రాజకీ యం చేయాలని చూశారని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు నెలల తర్వాత కూడా.. ఇంకా బాధ్యత లేదన్నట్టుగా.. విపక్షంవైపే వేళ్లు చూపిస్తున్నారని.. ఇదేం పద్ధతని జగన్ ప్రశ్నించారు. ప్రజల కష్టాలను తీర్చలేక.. ప్రతిపక్షం వైపు నెపం చూపుతున్నారని దుయ్యబట్టారు.
This post was last modified on September 11, 2024 9:13 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…