Political News

`ప్రకాశం` బోట్ల‌ పై ఫ‌స్ట్ టైం జ‌గ‌న్ రియాక్ష‌న్‌

గ‌త వారం రోజులుగా రాజ‌కీయంగా కీల‌కంగా మారిన ప్ర‌కాశం బ్యారేజీ ఐర‌న్ బోట్ల వ్య‌వ‌హారంపై వైసీపీ అధి నేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తాజాగా స్పందించారు. సీఎం చంద్ర‌బాబు అయితే.. ప్ర‌తి రోజూ దాదాపు ఈ బోట్ల గురించే మాట్లాడుతున్న విష‌యం తెలిసిందే.

కృష్ణాన‌దికి వ‌ర‌ద ఉధ్రుతి పెరిగిపోయి.. 11 ల‌క్ష‌ల‌కు పైగా క్యూసెక్కుల వ‌ర‌ద నీరు వ‌చ్చిన స‌మ‌యంలో మూడు ఐర‌న్ బోట్లు బ‌లంగా బ్యారేజీ వెయిట్స్‌కు గుద్దుకు న్నాయి. దీంతో 67-69 మ‌ధ్య ఉన్న వెయిట్ దెబ్బ‌తింది.

దీంతో అలెర్ట‌యిన ప్ర‌భుత్వం వెంట‌నే దీనికి మ‌రమ్మ‌తులు చేయించింది. అయితే.. ఇలా ఐర‌న్ బోట్ల‌ను వ‌దిలి పెట్ట‌డం.. బ్యారేజీవెయిట్ దెబ్బ‌తిన‌డం వెనుక రాజ‌కీయ కుట్ర ఉంద‌నేది అధికార పార్టీ నాయ‌కు లు చెబుతున్న మాట‌. దీనిపైనే సీఎం చంద్ర‌బాబు కూడా అనుమానాలు వ్య‌క్తం చేశారు.

వైసీపీ నేత‌ల కుట్ర ఉంద‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఇవి వైసీపీ నేత‌, ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం మేన‌ల్లుడికి చెందిన‌విగా గుర్తించామ ని కూడా చెప్పారు.

అయితే.. అప్ప‌టి నుంచి వైసీపీ త‌ర‌ఫున కౌంట‌ర్ రాలేదు. తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్‌.. ఈ బోట్ల వ్య‌వ‌హారంపై మాట్లాడుతూ.. ఇవ‌న్నీ.. టీడీపీ నేత‌ల‌కు చెందిన‌వేన‌ని చెప్పారు. చంద్ర బాబు హ‌యాంలోనే అనుమ‌తులు ఇచ్చార‌ని.. మూడు నెల‌ల కింద‌ట టీడీపీ గెలిచిన స‌మ‌యంలో ఈ బొట్ల‌లోనే టీడీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఉషాద్రి, రామ్మోహ‌న్ అనే వ్య‌క్తులు కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, పార్టీ నేత నారా లోకేష్‌కు స‌న్నిహితుల‌ని వ్యాఖ్యానించారు.

ఎన్నారై టీడీపీ నేత బంధువుల‌కు చెందిన బోట్లేన‌ని, టీడీపీ నాయ‌కుడు చిన్నాకు చెందిన‌వేన‌ని చెప్పా రు. ఈ బోట్ల‌న్నీ ప్ర‌కాశం బ్యారేజీకి కొట్టుకొని వ‌చ్చాయ‌ని జ‌గ‌న్ తెలిపారు. అయితే.. దీనిని కూడా రాజకీ యం చేయాల‌ని చూశార‌ని విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడు నాలుగు నెల‌ల త‌ర్వాత కూడా.. ఇంకా బాధ్య‌త లేద‌న్న‌ట్టుగా.. విపక్షంవైపే వేళ్లు చూపిస్తున్నార‌ని.. ఇదేం ప‌ద్ధ‌త‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌లేక‌.. ప్ర‌తిప‌క్షం వైపు నెపం చూపుతున్నార‌ని దుయ్య‌బట్టారు. 

This post was last modified on September 11, 2024 9:13 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

56 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

2 hours ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago