Political News

`ప్రకాశం` బోట్ల‌ పై ఫ‌స్ట్ టైం జ‌గ‌న్ రియాక్ష‌న్‌

గ‌త వారం రోజులుగా రాజ‌కీయంగా కీల‌కంగా మారిన ప్ర‌కాశం బ్యారేజీ ఐర‌న్ బోట్ల వ్య‌వ‌హారంపై వైసీపీ అధి నేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తాజాగా స్పందించారు. సీఎం చంద్ర‌బాబు అయితే.. ప్ర‌తి రోజూ దాదాపు ఈ బోట్ల గురించే మాట్లాడుతున్న విష‌యం తెలిసిందే.

కృష్ణాన‌దికి వ‌ర‌ద ఉధ్రుతి పెరిగిపోయి.. 11 ల‌క్ష‌ల‌కు పైగా క్యూసెక్కుల వ‌ర‌ద నీరు వ‌చ్చిన స‌మ‌యంలో మూడు ఐర‌న్ బోట్లు బ‌లంగా బ్యారేజీ వెయిట్స్‌కు గుద్దుకు న్నాయి. దీంతో 67-69 మ‌ధ్య ఉన్న వెయిట్ దెబ్బ‌తింది.

దీంతో అలెర్ట‌యిన ప్ర‌భుత్వం వెంట‌నే దీనికి మ‌రమ్మ‌తులు చేయించింది. అయితే.. ఇలా ఐర‌న్ బోట్ల‌ను వ‌దిలి పెట్ట‌డం.. బ్యారేజీవెయిట్ దెబ్బ‌తిన‌డం వెనుక రాజ‌కీయ కుట్ర ఉంద‌నేది అధికార పార్టీ నాయ‌కు లు చెబుతున్న మాట‌. దీనిపైనే సీఎం చంద్ర‌బాబు కూడా అనుమానాలు వ్య‌క్తం చేశారు.

వైసీపీ నేత‌ల కుట్ర ఉంద‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఇవి వైసీపీ నేత‌, ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం మేన‌ల్లుడికి చెందిన‌విగా గుర్తించామ ని కూడా చెప్పారు.

అయితే.. అప్ప‌టి నుంచి వైసీపీ త‌ర‌ఫున కౌంట‌ర్ రాలేదు. తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్‌.. ఈ బోట్ల వ్య‌వ‌హారంపై మాట్లాడుతూ.. ఇవ‌న్నీ.. టీడీపీ నేత‌ల‌కు చెందిన‌వేన‌ని చెప్పారు. చంద్ర బాబు హ‌యాంలోనే అనుమ‌తులు ఇచ్చార‌ని.. మూడు నెల‌ల కింద‌ట టీడీపీ గెలిచిన స‌మ‌యంలో ఈ బొట్ల‌లోనే టీడీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఉషాద్రి, రామ్మోహ‌న్ అనే వ్య‌క్తులు కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, పార్టీ నేత నారా లోకేష్‌కు స‌న్నిహితుల‌ని వ్యాఖ్యానించారు.

ఎన్నారై టీడీపీ నేత బంధువుల‌కు చెందిన బోట్లేన‌ని, టీడీపీ నాయ‌కుడు చిన్నాకు చెందిన‌వేన‌ని చెప్పా రు. ఈ బోట్ల‌న్నీ ప్ర‌కాశం బ్యారేజీకి కొట్టుకొని వ‌చ్చాయ‌ని జ‌గ‌న్ తెలిపారు. అయితే.. దీనిని కూడా రాజకీ యం చేయాల‌ని చూశార‌ని విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడు నాలుగు నెల‌ల త‌ర్వాత కూడా.. ఇంకా బాధ్య‌త లేద‌న్న‌ట్టుగా.. విపక్షంవైపే వేళ్లు చూపిస్తున్నార‌ని.. ఇదేం ప‌ద్ధ‌త‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌లేక‌.. ప్ర‌తిప‌క్షం వైపు నెపం చూపుతున్నార‌ని దుయ్య‌బట్టారు. 

This post was last modified on September 11, 2024 9:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago