Political News

కూట‌మి స‌ర్కారు… స‌వాళ్ల ప‌య‌నం.. !

కూట‌మి ప్ర‌భుత్వం ప‌గ్గాలు చేప‌ట్టి.. నేటికి(సెప్టెంబ‌రు 11) 90 రోజులు పూర్త‌య్యాయి. సాధార‌ణంగా.. తొలి వంద రోజులు ప్ర‌శాంతంగా జ‌రిగిపోవాల‌నిఏ ప్ర‌భుత్వ‌మైనా కొరుకుంటుంది. ఫీల్‌గుడ్ భావ‌న ల‌భించాల నే ఆశిస్తుంది.

వ‌చ్చిన తొలి రోజుల్లోనే ప్ర‌భుత్వం ఏదైనా చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మార్కులు కొట్టే యాల‌ని చూస్తుంది.త‌ద్వారా.. త‌ర్వాత పాల‌న ఎలా ఉన్నా.. తొలి 100 రోజుల పాల‌న‌ను చివ‌రి వ‌ర‌కు చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

కానీ, చిత్రంగా గ‌తంలో వైసీపీ స‌ర్కారుకు.. 200 రోజుల త‌ర్వాత‌.. క‌రోనా రూపంలో భారీ విప‌త్తు ఎదురొచ్చిం ది. అప్ప‌టి వ‌ర‌కు స‌చివాల‌యాల ఏర్పాటు, వ‌లంటీర్ల నియామ‌కం.. వంటి కార్య‌క్ర‌మాల‌తో ఉన్న స‌ర్కారు కు క‌రోనా రూపంలో వ‌చ్చిన పెద్ద విప‌త్తు అగ్ని ప‌రీక్ష‌గా మారింది.

ఇది ఒక‌రోజు రెండు రోజుల కాదు.. ఏకం గా ఏడాదిన్న‌ర పాటు ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. దీని నుంచి కోలుకునేలోగానే.. వ‌ర‌ద‌లు.. ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న వంటివి ఇబ్బంది పెట్టాయి.

ఇక‌, ఇప్పుడు కూట‌మి స‌ర్కారుకు కూడా ఇదే త‌ర‌హా ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆది నుంచి కూడా.. స‌ర్కారుకు ఇబ్బందులు త‌ప్ప‌లేదు. అన‌కాప‌ల్లి ఫార్మా కంపెనీలో త‌లెత్తిన విప‌త్తు ప‌దిమందికి పైగా ప్రాణాలు తీసింది. మ‌రోవైపు.. వైసీపీ వ‌ర్సెస్‌టీడీపీ కుమ్ములాట‌తో ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు చ‌నిపోయారు. ఈ స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్న నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద వ‌చ్చింది. ఇది ప‌ది రోజులుగా వెంటాడుతూనే ఉంది.

ఇంత‌లోనే విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, కాకినాడ స‌హా.. ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద బీభ‌త్సం.. తుఫాను వంటివి ఇబ్బందిగా మారాయి. దీంతో తొలి 90 రోజులుకూడా కూట‌మి స‌ర్కారు విప‌త్తుల‌తోనే యుద్ధం చేయాల్సి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే.. రెండు కీల‌క ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌భుత్వం ప్రారంభించింది.

పెంచిన పింఛ‌న్ల‌ను ఇవ్వ‌డం.. అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించడం. ఇక‌, మిగిలిన వాటికి.. రూప‌క‌ల్ప‌న చేసే దిశ‌లో ఈ చిక్కులు రావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. తొలి 90 రోజులు కూట‌మి స‌ర్కారు విప‌త్తుతోనే యుద్ధం చేయాల్సి వ‌చ్చింద‌నేది వాస్త‌వం.

This post was last modified on September 11, 2024 9:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

14 minutes ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

27 minutes ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

2 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago