కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి.. నేటికి(సెప్టెంబరు 11) 90 రోజులు పూర్తయ్యాయి. సాధారణంగా.. తొలి వంద రోజులు ప్రశాంతంగా జరిగిపోవాలనిఏ ప్రభుత్వమైనా కొరుకుంటుంది. ఫీల్గుడ్ భావన లభించాల నే ఆశిస్తుంది.
వచ్చిన తొలి రోజుల్లోనే ప్రభుత్వం ఏదైనా చేయడం ద్వారా ప్రజల దగ్గర మార్కులు కొట్టే యాలని చూస్తుంది.తద్వారా.. తర్వాత పాలన ఎలా ఉన్నా.. తొలి 100 రోజుల పాలనను చివరి వరకు చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంది.
కానీ, చిత్రంగా గతంలో వైసీపీ సర్కారుకు.. 200 రోజుల తర్వాత.. కరోనా రూపంలో భారీ విపత్తు ఎదురొచ్చిం ది. అప్పటి వరకు సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల నియామకం.. వంటి కార్యక్రమాలతో ఉన్న సర్కారు కు కరోనా రూపంలో వచ్చిన పెద్ద విపత్తు అగ్ని పరీక్షగా మారింది.
ఇది ఒకరోజు రెండు రోజుల కాదు.. ఏకం గా ఏడాదిన్నర పాటు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీని నుంచి కోలుకునేలోగానే.. వరదలు.. ఎల్జీ పాలిమర్స్ ఘటన వంటివి ఇబ్బంది పెట్టాయి.
ఇక, ఇప్పుడు కూటమి సర్కారుకు కూడా ఇదే తరహా ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆది నుంచి కూడా.. సర్కారుకు ఇబ్బందులు తప్పలేదు. అనకాపల్లి ఫార్మా కంపెనీలో తలెత్తిన విపత్తు పదిమందికి పైగా ప్రాణాలు తీసింది. మరోవైపు.. వైసీపీ వర్సెస్టీడీపీ కుమ్ములాటతో పదుల సంఖ్యలో నాయకులు చనిపోయారు. ఈ సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలోనే విజయవాడకు వరద వచ్చింది. ఇది పది రోజులుగా వెంటాడుతూనే ఉంది.
ఇంతలోనే విశాఖ, విజయనగరం, కాకినాడ సహా.. పలు ప్రాంతాల్లో వరద బీభత్సం.. తుఫాను వంటివి ఇబ్బందిగా మారాయి. దీంతో తొలి 90 రోజులుకూడా కూటమి సర్కారు విపత్తులతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు చూస్తే.. రెండు కీలక పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.
పెంచిన పింఛన్లను ఇవ్వడం.. అన్న క్యాంటీన్లను ప్రారంభించడం. ఇక, మిగిలిన వాటికి.. రూపకల్పన చేసే దిశలో ఈ చిక్కులు రావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. తొలి 90 రోజులు కూటమి సర్కారు విపత్తుతోనే యుద్ధం చేయాల్సి వచ్చిందనేది వాస్తవం.
This post was last modified on September 11, 2024 9:11 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…