మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఇదేసమయం లో రేవంత్రెడ్డి ప్రభుత్వంపైనా ఆయన ఫైరయ్యారు.
రేవంత్రెడ్డి సర్కారుకు కేసీఆర్ను డీల్ చేయడం చేతకావడం లేదని.. అదే తాము అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబానికి అంకుశం సినిమాలో మాదిరిగా చుక్కలు చూపించి ఉండేవారమని చెప్పారు. “రేవంత్రెడ్డి తోపు అనుకున్నం. కానీ, ఆయనకు చేతకావడం లేదని అర్థమైంది. కేసీఆర్ను ఎప్పుడో జైల్లో పెట్టాల్సింది. కానీ, ఆయన చేయలేక పోతున్నడు“ అని బండి వ్యాఖ్యానించారు.
తాజాగా బండి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్సర్కారు చేతకాని తనం వల్లే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అదే రాష్ట్రంలో బీజేపీ సర్కారు వచ్చి ఉంటే ఆయనకు చుక్కలు కనిపించేవని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు పట్టిన దశమ గ్రహం ఏదైనా ఉంటే అది కేసీఆరేనని బండి నిప్పులు చెరిగారు. “నాపైనా.. మాపార్టీ నాయకులపైనా కేసీఆర్ నాన్ బెయిలబుట్ కేసులు పెట్టాడు. రౌడీషీట్లు తెరిచాడు. ఇలాంటి వాడిని ఎప్పుడో జైల్లో పెట్టుండాలి“ అని అన్నారు. కవితకు బెయిల్ విషయంపై స్పందిస్తూ.. “ఇలాంటి విషయాల్లో కేసీఆర్ ఆరితేరిన వ్యక్తి.. ఎక్కడ ఎవరి కాళ్లకు మొక్కాలో ఆయనకు బాగా తెలుసు“ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్ నవగ్రహ యాగాలు చేయడంపై స్పందిస్తూ.. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే.. ఈయన రాజకీయ కష్టాల్లో ఉన్నారని వ్యాఖ్యా నించారు. అందుకే యాగాలు చేస్తున్నడని అన్నారు. “కేసీఆర్కు ప్రజలు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు. అసలు కేసీఆర్ బయటకే రావడం లేదు“ అని వ్యాఖ్యానించారు.
ఆరు గ్యారెంటీలు ఏమైనవి? అని రేవంత్ సర్కారును ప్రశ్నించారు. వాటిని దృష్టి మళ్లిం చేందుకు హైడ్రాతో డ్రామాలు ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. “చెరువులను ఆక్రమించుకున్నరని కూల్చుతున్నరు. మరి ఈ అనుమతులిచ్చిన వారి సంగతేంటి. వారినేం చేస్తరు? ఇదంతా డ్రామా.. హామీలపై ప్రశ్నిస్తారనే ఇలా భయ పెడుతున్నరు“ అని బండి వ్యాఖ్యానించారు.
This post was last modified on September 11, 2024 9:09 pm
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…