Political News

ఒక నేర‌స్తుడిని మ‌రో నేర‌స్తుడు ఓదార్చాడు:  టీడీపీ

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పార్టీ నేత‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధ‌వారం గుంటూరు జైల్లో ప‌రామ‌ర్శించారు. అనంతరం ఆయన బుడ‌మేరు వ‌ర‌ద‌, ప్ర‌భుత్వ సాయం.. చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈ ప‌రిణామాల‌పై టీడీపీ నాయ‌కులు తీవ్రంగా స్పందించారు. “ఒక నేర‌స్తుడు మ‌రో నేర‌స్తుడిని క‌లిశారు. ఆయ‌న‌ను ఈయ‌న‌, ఈయ‌న‌ను ఆయ‌న ఓదార్చుకున్నారు“ అని సెటైర్లు వేశారు. విజ‌య‌వాడ‌లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మాట్లాడుతూ.. జ‌గ‌న్ ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఓదార్పు యాత్ర‌లు ఇప్పుడు జైళ్లలో చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

బుడ‌మేరు వ‌ర‌ద‌తో బాధితులు రోడ్డున ప‌డితే.. సీఎం చంద్ర‌బాబు వారం రోజుల పాటు వారికోసం.. త‌న నివాసాన్ని కూడా మార్చుకుని ప‌నిచేశార‌ని.. కానీ, జ‌గ‌న్ మాత్రం బెంగ‌ళూరులో రెస్టు తీసుకున్నార‌ని వ్యాఖ్యానించారు. తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కూడా బాధితుల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం వారికి పార్టీ త‌ర‌ఫున ఒక పులిహోర పొట్లం కూడా పంపిణీ చేయ‌లేద‌న్నారు. ప్రతి క్ష‌ణంలోనూ చంద్ర‌బాబు అంద‌రికీ కుటుంబ స‌భ్యుడి మాదిరిగా అండ‌గా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌పై రాళ్లు వేసే కార్య‌క్ర‌మం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత‌పై ఆయ‌న ప్ర‌శ్న‌లు కురిపించారు. బుడమేరు పొంగ‌డానికి నాటి వైసీపీ నాయ‌కులు కార‌ణం కా దా?  బుడ‌మేరు క‌ట్ట‌ల‌ను ఎందుకు ప‌టిష్ట ప‌ర‌చ‌లేద‌న్నారు. నాయ‌కులు ఆక్ర‌మ‌ణ‌ల కార‌ణంగానే బుడ‌మేర‌కు గండి ప‌డింద‌న్న ది వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావిత మృతుల విష‌యంలోనూ జ‌గ‌న్ అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని అన్నారు. ఆ లెక్క‌ల‌ను నిరూపించాల‌ని స‌వాల్ రువ్వారు. బుడ‌మేరు డైవ‌ర్ష‌న్ కెనాల్ కోసం గ‌తంలోనేచంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్ చేశార‌ని 200 కోట్ల రూపాయ‌ల‌ను కూడా విడుద‌ల చేశార‌ని తెలిపారు.

అయితే.. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ నిధుల‌ను విడుద‌ల చేయ‌క‌పోగా.. ప‌నులు ఆపేసిన మాట వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు. “బుడమేరు డైవర్షన్ చానల్ పనులను చంద్రబాబు 80 శాతం చేశారు. ఆ మిగిలిన పనులను నీ ఐదేళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే, ముఖ్యంగా ఆ లైనింగ్ పూర్తయ్యుంటే ఇవాళ బుడమేరుకు గండ్లు పడి ఉండేవి కావు కదా. విజ‌య‌వాడ మునిగేది కాదు క‌దా.. ఇంత మంది నిరాశ్ర‌యులు అయ్యేవారు కాదు క‌దా!“ అని నిమ్మ‌ల వ్యాఖ్యానించారు. వీటిని క‌ప్పిపుచ్చుకునేందుకు జ‌గ‌న్ జైలు యాత్రలు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. 

Satya

Recent Posts

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…

20 minutes ago

అనుభవం తోడయ్యుంటే ‘బంధం’ బలంగా ఉండేది  

ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…

57 minutes ago

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

1 hour ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

2 hours ago

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

3 hours ago

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…

3 hours ago