Political News

ఒక నేర‌స్తుడిని మ‌రో నేర‌స్తుడు ఓదార్చాడు:  టీడీపీ

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పార్టీ నేత‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధ‌వారం గుంటూరు జైల్లో ప‌రామ‌ర్శించారు. అనంతరం ఆయన బుడ‌మేరు వ‌ర‌ద‌, ప్ర‌భుత్వ సాయం.. చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈ ప‌రిణామాల‌పై టీడీపీ నాయ‌కులు తీవ్రంగా స్పందించారు. “ఒక నేర‌స్తుడు మ‌రో నేర‌స్తుడిని క‌లిశారు. ఆయ‌న‌ను ఈయ‌న‌, ఈయ‌న‌ను ఆయ‌న ఓదార్చుకున్నారు“ అని సెటైర్లు వేశారు. విజ‌య‌వాడ‌లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మాట్లాడుతూ.. జ‌గ‌న్ ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఓదార్పు యాత్ర‌లు ఇప్పుడు జైళ్లలో చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

బుడ‌మేరు వ‌ర‌ద‌తో బాధితులు రోడ్డున ప‌డితే.. సీఎం చంద్ర‌బాబు వారం రోజుల పాటు వారికోసం.. త‌న నివాసాన్ని కూడా మార్చుకుని ప‌నిచేశార‌ని.. కానీ, జ‌గ‌న్ మాత్రం బెంగ‌ళూరులో రెస్టు తీసుకున్నార‌ని వ్యాఖ్యానించారు. తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కూడా బాధితుల‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం వారికి పార్టీ త‌ర‌ఫున ఒక పులిహోర పొట్లం కూడా పంపిణీ చేయ‌లేద‌న్నారు. ప్రతి క్ష‌ణంలోనూ చంద్ర‌బాబు అంద‌రికీ కుటుంబ స‌భ్యుడి మాదిరిగా అండ‌గా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌పై రాళ్లు వేసే కార్య‌క్ర‌మం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత‌పై ఆయ‌న ప్ర‌శ్న‌లు కురిపించారు. బుడమేరు పొంగ‌డానికి నాటి వైసీపీ నాయ‌కులు కార‌ణం కా దా?  బుడ‌మేరు క‌ట్ట‌ల‌ను ఎందుకు ప‌టిష్ట ప‌ర‌చ‌లేద‌న్నారు. నాయ‌కులు ఆక్ర‌మ‌ణ‌ల కార‌ణంగానే బుడ‌మేర‌కు గండి ప‌డింద‌న్న ది వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావిత మృతుల విష‌యంలోనూ జ‌గ‌న్ అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని అన్నారు. ఆ లెక్క‌ల‌ను నిరూపించాల‌ని స‌వాల్ రువ్వారు. బుడ‌మేరు డైవ‌ర్ష‌న్ కెనాల్ కోసం గ‌తంలోనేచంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్ చేశార‌ని 200 కోట్ల రూపాయ‌ల‌ను కూడా విడుద‌ల చేశార‌ని తెలిపారు.

అయితే.. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ నిధుల‌ను విడుద‌ల చేయ‌క‌పోగా.. ప‌నులు ఆపేసిన మాట వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు. “బుడమేరు డైవర్షన్ చానల్ పనులను చంద్రబాబు 80 శాతం చేశారు. ఆ మిగిలిన పనులను నీ ఐదేళ్ల పాలనలో పూర్తి చేసి ఉంటే, ముఖ్యంగా ఆ లైనింగ్ పూర్తయ్యుంటే ఇవాళ బుడమేరుకు గండ్లు పడి ఉండేవి కావు కదా. విజ‌య‌వాడ మునిగేది కాదు క‌దా.. ఇంత మంది నిరాశ్ర‌యులు అయ్యేవారు కాదు క‌దా!“ అని నిమ్మ‌ల వ్యాఖ్యానించారు. వీటిని క‌ప్పిపుచ్చుకునేందుకు జ‌గ‌న్ జైలు యాత్రలు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. 

This post was last modified on September 11, 2024 9:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుకుమార్ రైటింగ్స్.. ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…

54 minutes ago

ఇక ఓలా, ఉబేర్ పని అయిపోయినట్లేనా?

దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…

2 hours ago

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

4 hours ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

4 hours ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

8 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

13 hours ago