Political News

విజ‌య‌వాడ అయిపోయింది.. ఇక‌, విశాఖ!

సీఎం చంద్ర‌బాబు ఇక‌, విశాఖకు వెళ్ల‌నున్నారు. మంగ‌ళ‌వారం రాత్రికి ఆయ‌న విశాఖ‌కు వెళ్ల‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో ప‌రిస్థితి స‌ర్దుమ‌ణిగింది. లోత‌ట్టు ప్రాంతాల్లో ఇంకా వ‌ర‌ద త‌గ్గ‌క పోయినా.. ప్ర‌ధానంగా బుడ‌మేరు తీవ్ర‌త మాత్రం త‌గ్గిపోయింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మోటార్ల ద్వారా ఇత‌ర ప్రాంతాల్లోకి తోడుతున్నారు. మ‌రోవైపు.. సింగున‌గ‌ర్‌, ప్ర‌కాశ్ న‌గ‌ర్‌, శాంతిన‌గ‌ర్, కండ్రిక స‌హా.. ఇత‌ర అన్ని ప్ర‌బావిత ప్రాంతాల్లోనూ సాయం అందిస్తున్నారు. రేష‌న్ స‌హా.. పాలు, నీళ్లు ఇత‌ర వ‌స్తువులు కూడా అందిస్తున్నారు.

దీంతో ప్ర‌జ‌లు కొంత ఊర‌ట చెందుతున్నారు. దీంతో మంగ‌ళ‌వారం సాయంత్రం చంద్ర‌బాబు విజ‌య‌వాడ శివారు ప్రాంతాల్లో ప‌ర్యటించి.. మ‌రోసారి బాధితుల‌ను ప‌ల‌క‌రించారు. వారికి అందుతున్న సాయాన్ని విచారించారు. ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేస్తామన్నారు. అంద‌రికీ పేరు పేరునా సాయం అందుతోందా లేదా.. అనే విష‌యాన్ని సీనియ‌ర్ అధికారులు ప‌రిశీలించాల‌ని.. ఏ ఒక్క రూ త‌మ‌కు సాయం అంద‌లేద‌న్న ఫిర్యాదు చేయ‌డానికి వీల్లేద‌ని అన్నారు. మ‌రోవైపు బాధితుల‌కు సంబంధించిన ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ కూడా మంగ‌ళ‌వారం, బుధ‌వారం యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేయ‌నున్నారు.

ఇదిలావుంటే.. విజ‌య‌వాడ ప‌రిస్థితి ఒకింత ఒడ్డున ప‌డుతుంటే..మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర జిల్లాలు తుఫాను బీభ‌త్సంతో అల్లాడు తున్నాయి. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాను ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు వ‌చ్చాయి. విజ‌య‌న‌గ‌రంలో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డి ప‌దికి పైగా గ్రామాల ప్ర‌జ‌లు పున‌రావాస కేంద్రాల్లో త‌లదాచుకుంటున్నారు. నదులు… ఇతర వాగుల పరవళ్లు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయి, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

దీంతో ఉత్త‌రాంధ్ర ఇప్పుడు వ‌ణికిపోతున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం రాత్రి లేదా.. బుద‌వారం ఉద‌యం విశాఖ‌ప‌ట్నం వెళ్తున్నారు. అక్క‌డే మూడు రోజుల వ‌ర‌కు ఆయ‌న ఉండ‌నున్నారు. బాధిత ప్రాంతా ల్లో ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్ప‌నున్నారు. అదేవిధంగా వారికి సాయం కూడా అందించ‌నున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆన్‌లైన్‌లో అక్క‌డి ప‌రిస్థితిని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా సీనియ‌ర్ అధికారుల‌ను కూడా మోహ‌రించారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో తాను ఉంటే త‌ప్ప‌.. బాధితుల‌కు ఓదార్పు ద‌క్క‌ద‌న్న భావ‌న‌తో చంద్ర‌బాబు విశాఖ‌కు వెళ్తున్నారు.

This post was last modified on September 11, 2024 5:55 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

26 minutes ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

1 hour ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago