బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన హైడ్రాపై ఆయన కామెంట్లు కుమ్మరించారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్కు చెందిన కాలేజీలను కూల్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ కాలేజీలను కూల్చేస్తే.. మీరే హీరో అని ఒప్పుకొంటా! అని హైడ్రా కమిషనర్ రంగ్నాథ్ను ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
గత కొన్నాళ్ల కిందట ఓవైసీలకు చెందిన ఫాతిమా కాలేజీ వ్యవహారం తెరమీదికి వచ్చింది. వీటిని కూడా చెరువులను ఆక్రమించి కట్టారంటూ.. కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే.. తనపై తుపాకీ తూటాల వర్షం కురిపించినా ఇష్టమేనని.. కానీ, ఎంతో మంది పేదలకు విద్య నేర్పిస్తూ.. జీవితాలపై భరోసా కల్పిస్తున్న కాలేజీలను కూల్చేందుకు ఒప్పుకోనని ఆయన తేల్చి చెప్పారు.
ఆ తర్వాత.. ఈవిషయం కొంత నెమ్మదించింది. ఇక, ఇప్పుడు ఆదివారం.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూల్చి వేతలు కొనసాగుతున్నాయి. ఏకంగా 30 టీమ్లతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. భారీ అంతస్తుల కట్టడాలను భారీ మెషిన్లు పెట్టి మరీ కూల్చివేస్తున్నారు. అదేవిధంగా పలు చోట్లకూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాజా సింగ్.. ఎంఐఎంకు చెందిన ఫాతిమా కాలేజీల ప్రస్తావన తెచ్చారు.
ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పండి. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలి. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలం అయినట్లే అని రాజాసింగ్ ట్వీట్ చేశారు. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on September 8, 2024 10:10 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…