బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన హైడ్రాపై ఆయన కామెంట్లు కుమ్మరించారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్కు చెందిన కాలేజీలను కూల్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ కాలేజీలను కూల్చేస్తే.. మీరే హీరో అని ఒప్పుకొంటా! అని హైడ్రా కమిషనర్ రంగ్నాథ్ను ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
గత కొన్నాళ్ల కిందట ఓవైసీలకు చెందిన ఫాతిమా కాలేజీ వ్యవహారం తెరమీదికి వచ్చింది. వీటిని కూడా చెరువులను ఆక్రమించి కట్టారంటూ.. కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే.. తనపై తుపాకీ తూటాల వర్షం కురిపించినా ఇష్టమేనని.. కానీ, ఎంతో మంది పేదలకు విద్య నేర్పిస్తూ.. జీవితాలపై భరోసా కల్పిస్తున్న కాలేజీలను కూల్చేందుకు ఒప్పుకోనని ఆయన తేల్చి చెప్పారు.
ఆ తర్వాత.. ఈవిషయం కొంత నెమ్మదించింది. ఇక, ఇప్పుడు ఆదివారం.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూల్చి వేతలు కొనసాగుతున్నాయి. ఏకంగా 30 టీమ్లతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. భారీ అంతస్తుల కట్టడాలను భారీ మెషిన్లు పెట్టి మరీ కూల్చివేస్తున్నారు. అదేవిధంగా పలు చోట్లకూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాజా సింగ్.. ఎంఐఎంకు చెందిన ఫాతిమా కాలేజీల ప్రస్తావన తెచ్చారు.
ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పండి. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలి. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలం అయినట్లే అని రాజాసింగ్ ట్వీట్ చేశారు. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on September 8, 2024 10:10 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…