బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన హైడ్రాపై ఆయన కామెంట్లు కుమ్మరించారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్కు చెందిన కాలేజీలను కూల్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ కాలేజీలను కూల్చేస్తే.. మీరే హీరో అని ఒప్పుకొంటా! అని హైడ్రా కమిషనర్ రంగ్నాథ్ను ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
గత కొన్నాళ్ల కిందట ఓవైసీలకు చెందిన ఫాతిమా కాలేజీ వ్యవహారం తెరమీదికి వచ్చింది. వీటిని కూడా చెరువులను ఆక్రమించి కట్టారంటూ.. కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే.. తనపై తుపాకీ తూటాల వర్షం కురిపించినా ఇష్టమేనని.. కానీ, ఎంతో మంది పేదలకు విద్య నేర్పిస్తూ.. జీవితాలపై భరోసా కల్పిస్తున్న కాలేజీలను కూల్చేందుకు ఒప్పుకోనని ఆయన తేల్చి చెప్పారు.
ఆ తర్వాత.. ఈవిషయం కొంత నెమ్మదించింది. ఇక, ఇప్పుడు ఆదివారం.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూల్చి వేతలు కొనసాగుతున్నాయి. ఏకంగా 30 టీమ్లతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. భారీ అంతస్తుల కట్టడాలను భారీ మెషిన్లు పెట్టి మరీ కూల్చివేస్తున్నారు. అదేవిధంగా పలు చోట్లకూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాజా సింగ్.. ఎంఐఎంకు చెందిన ఫాతిమా కాలేజీల ప్రస్తావన తెచ్చారు.
ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పండి. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలి. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలం అయినట్లే అని రాజాసింగ్ ట్వీట్ చేశారు. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on September 8, 2024 10:10 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…