Political News

గండి పూడింది.. గండం గ‌డిచింది!

గత 5 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఆపరేషన్ బుడమేరు గండి పూడ్చే ప్ర‌క్రియ పూర్త‌యిం ది.  బుడమేరుకు పడ్డ మూడు గండ్లలో… అత్యంత కీలకమైన, పెద్దదైన మూడవ గండిని ఆర్మీ ఇంజనీర్ల సహకారంతో.. పూర్తిగా నియత్రణలోకి తెచ్చారు. ఇనుప బుట్ట‌ల‌తో పెద్ద ఎత్తున రాళ్లు, మ‌ట్టిని తీసుకువ‌చ్చి 80 నుంచి 100 మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న అతి పెద్ద గండిని పూడ్చేశారు. దీనికి ముందు రెండు గండ్ల‌ను రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు పూడ్చేయించారు.

కానీ, మూడో అతిపెద్ద‌గండి పూడ్చ‌డంలో అనేక ఇబ్బందులు వ‌చ్చాయి. దీంతో ఆర్మీని రంగంలోకి దింపా రు. గురువారం రాత్రే విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన ఆర్మీ సిబ్బంది.. శుక్ర‌వారం ఉద‌య‌మే రంగంలోకి దిగి అధ్య‌య‌నం చేశారు. దీనిని పూడ్చేందుకు గేబియాన్ బుట్ట‌లు అవ‌స‌ర‌మ‌ని గుర్తించి(ఇలాంటివి అసోం త‌దిత‌ర ఈశాన్య రాష్ట్రాల్లో వినియోగిస్తారు) వాటిని యుద్ధ ప్రాతిప‌దిక‌న రూపొందించారు. ఆ వెంట‌నే బండ రాళ్లు.. మ‌ట్టిని రెడీ చేసి.. గేబియాన్ బుట్ట‌ల‌తో గండిని పూడ్చి వేశారు.

దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం నిలిచిపోయింది.  చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రా బాద్‌కు చెందిన రెజిమెంటల్‌ బెటాలియన్‌ జవాన్లు దాదాపు 150 మంది ఈ గండి పూడ్చే కార్య‌క్ర‌మంలో నిరంత‌రం శ్ర‌మించారు. వీరికి రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అక్క‌డే ఉండి స‌హాయ స‌హ‌కారాలు అందించారు. రాత్రిప‌గ‌లు తేడా లేకుండా సాగిన ఈ కార్య‌క్ర‌మం పూర్త‌యి.. శ‌నివారం ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి గండి పూడ్చివేత ముగిసింది.

దీంతో  విజ‌య‌వాడలోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఫ‌లితంగా లోత‌ట్టు ప్రాంతాల్లో త‌గ్గుతుంద‌ని భావించిన వ‌ర‌ద మ‌రోసారి పెరుగుతోంది. ఇంకోవైపు.. తుఫాను ముప్పు పొంచి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. వ‌చ్చే రెండు రోజుల పాటు తుఫాను కార‌ణంగా ఏపీ, తెలంగాణ‌లో భారీవ‌ర్షాలు కుస్తాయ‌ని తెలిపింది. 

This post was last modified on September 9, 2024 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

6 hours ago