పాలనకు, పాలకులకు అర్థాన్ని మార్చి, ప్రజల అభివృద్దే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది అయింది. రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్టు అది. దేశాన్ని నివ్వెరపరిచిన.. ప్రభుత్వ టెర్రరిజం పతాకస్థాయికి చేర్చిన అరెస్టు. దేశంలో కోట్లమంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు కూడా. ప్రపంచంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్టు కూడా అదే.
అదే.. ప్రస్తుత సీఎం చంద్రబాబును గత ఏడాది ఇదే రోజు(సెప్టెంబరు 8)న వైసీపీ ప్రభుత్వం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్ మెంటులో మార్పుల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పెట్టిన కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ఏకంగా 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. అయితే.. ఇది నిద్రాణమై, భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చేలా చేసింది. జగన్ ప్రభుత్వం అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి గళమెత్తింది.
ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు చేశారంటూ.. దేశవిదేశాల్లోని తెలుగు వారు.. ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేశారు. రాష్ట్రంలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా వివిధ దేశాల్లోనూ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాబు అభిమానులు రోడ్డెక్కారు. తొలి వారం రోజులు అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తర్వాత.. జనసేన అధినేత పవన్ ఎంట్రీతో అంతా మారిపోయింది.
ఇక, అప్పటి నుంచి చంద్రబాబు విడుదల కోసం.. జగన్ ప్రభుత్వ అరాచకంపై ఉద్యమించని నాయకు డు, కార్యకర్త లేడంటే అతిశయోక్తికాదు. మరోవైపు.. న్యాయ పోరాటం కూడా కలిసి వచ్చింది. మొత్తంగా చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి ముగింపు పలికి బెయిల్పై బయటకు వచ్చారు. దీంతో తమ్ముళ్ల సంబరాలకు అంతు లేకుండా పోయింది. ఇక, చంద్రబాబు అరెస్టు రోజును పురస్కరించుకుని ఆదివారం(నేడు) రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నల్ల జెండాలు పట్టుకుని.. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నారు. వరద ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
This post was last modified on September 8, 2024 3:49 pm
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…