పాలనకు, పాలకులకు అర్థాన్ని మార్చి, ప్రజల అభివృద్దే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది అయింది. రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్టు అది. దేశాన్ని నివ్వెరపరిచిన.. ప్రభుత్వ టెర్రరిజం పతాకస్థాయికి చేర్చిన అరెస్టు. దేశంలో కోట్లమంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు కూడా. ప్రపంచంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్టు కూడా అదే.
అదే.. ప్రస్తుత సీఎం చంద్రబాబును గత ఏడాది ఇదే రోజు(సెప్టెంబరు 8)న వైసీపీ ప్రభుత్వం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్ మెంటులో మార్పుల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పెట్టిన కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ఏకంగా 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. అయితే.. ఇది నిద్రాణమై, భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చేలా చేసింది. జగన్ ప్రభుత్వం అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి గళమెత్తింది.
ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు చేశారంటూ.. దేశవిదేశాల్లోని తెలుగు వారు.. ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేశారు. రాష్ట్రంలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా వివిధ దేశాల్లోనూ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాబు అభిమానులు రోడ్డెక్కారు. తొలి వారం రోజులు అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తర్వాత.. జనసేన అధినేత పవన్ ఎంట్రీతో అంతా మారిపోయింది.
ఇక, అప్పటి నుంచి చంద్రబాబు విడుదల కోసం.. జగన్ ప్రభుత్వ అరాచకంపై ఉద్యమించని నాయకు డు, కార్యకర్త లేడంటే అతిశయోక్తికాదు. మరోవైపు.. న్యాయ పోరాటం కూడా కలిసి వచ్చింది. మొత్తంగా చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి ముగింపు పలికి బెయిల్పై బయటకు వచ్చారు. దీంతో తమ్ముళ్ల సంబరాలకు అంతు లేకుండా పోయింది. ఇక, చంద్రబాబు అరెస్టు రోజును పురస్కరించుకుని ఆదివారం(నేడు) రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నల్ల జెండాలు పట్టుకుని.. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నారు. వరద ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
This post was last modified on September 8, 2024 3:49 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…