Political News

త‌న టీంను రెడీ చేసుకున్న ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఎట్ట‌కేల‌కు త‌న టీంను రెడీ చేసుకున్నారు. గ‌త నెల మొదటి వారం లోనే ఏపీలో త‌న‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ప్ర‌త్యేకంగా కొంత మంది పేర్ల‌తో కూడిన బృందాన్ని ఎంపిక చేసుకుని ఢిల్లీ చేరుకున్నారు. దీనికి అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీతో ఆమోద ముద్ర వేయించుకున్నారు. దీనిపై కొన్ని విమ‌ర్శ‌లు, మ‌రికొన్ని సూచ‌న‌లు వ‌చ్చినా.. వెన‌క్కి త‌గ్గ‌ని ష‌ర్మిల‌.. మొత్తానికి అధిష్టానంతో ఆమోదం ముద్ర వేయించుకోవ‌డంలో సక్సెస్ అయ్యారు.

ప్ర‌ధానంగా వైఎస్‌కు అనుచ‌రులుగా పేరొందిన చాలా మందికి ష‌ర్మిల త‌న బృందంలో చోటు ఇచ్చారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణ మోహ‌న్ కూడా ఉన్నారు. ఈయ‌న‌కు బాప‌ట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా సీనియ‌ర్ నాయ‌కుడు న‌ర‌హ‌రిశెట్టి న‌ర‌సింహారావుకు విజ‌య‌వాడ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా చాన్స్ ఇచ్చారు. ఈయ‌న వైఎస్‌కు అత్యంత విధేయ నేతగా గుర్తింపు పొందారు.

మొత్తంగా 25 జిల్లాలకు కాంగ్రెస్ అధ్య‌క్షులు, 13 మంది రాష్ట్ర స్థాయి ఉపాధ్య‌క్షులు, 37 మంది ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, 10మంది న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల‌తో ష‌ర్మిల త‌న కొత్త టీంను ఏర్పాటు చేసుకున్న‌ట్టు అయింది. అయితే.. ఎన్నికల త‌ర్వాత‌.. ష‌ర్మిల‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారిని ఈ క‌మిటీ నుంచి ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్మం. సుదీర్ఘ కాలం పార్టీలో ప‌నిచేసిన సుంక‌ర ప‌ద్మ‌శ్రీ వంటివారికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఇదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. సాకే శైల‌జానాథ్ వంటివారికి కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదు.

ఇదీ.. ష‌ర్మిల టీం..

జిల్లాల అధ్య‌క్షులు..

అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడుగా సాతాక బుల్లిబాబు, శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు, విజయన గరం – మరిపి విద్యాసాగర్, విశాఖపట్నం – వెంకట వర్మ రాజు, అనకాపల్లి – మీసాల సుబ్బన్న, కాకినాడ – మద్దేపల్లి సత్యానందరావు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ – కొండేటి చిట్టిబాబు(ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరారు), ఈస్ట్ గోదావరి – విశ్వేశ్వర్ రెడ్డి, వెస్ట్ గోదావరి – హరి కుమార్ రాజు, ఏలూరు – రాజనాల రామ్మోహన్ రావు, కృష్ణాజిల్లా – గొల్లు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా – బొర్రా కిరణ్, గుంటూరు – చిలకా విజయ్, బాపట్ల – ఆమంచి కృష్ణమోహన్, పల్నాడు – అలెక్స్ సుధాకర్, ప్రకాశం – షేక్ సైదా, నంద్యాల – జంగేటి లక్ష్మి నరసింహ యాదవ్, కర్నూలు – పరిగెల మురళి కృష్ణ, అనంతపురం – మధుసూదన్ రెడ్డి, క‌డ‌ప‌- విజయజ్యోతి, శ్రీ సత్యసాయి – హినయ్ తుల్లా, నెల్లూరు జిల్లా- చేవూరు దేవ కుమార్ రెడ్డి, తిరుపతి – బాలగురవం బాబు, చిత్తూరు – పోటుగారి భాస్కర్ నియ‌మితుల‌య్యారు.

న‌గ‌ర పార్టీ అధ్య‌క్షులు..

విజయవాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా నరహరి శెట్టి నరసింహ రావు, కాకినాడ సిటీ – చెక్కా నూకరాజు, రాజమండ్రి – బాలేపల్లి మురళీధర్, శ్రీకాకుళం – రెల్లా సురేష్, విశాఖపట్నం – పిరిడి భగత్, తిరుపతి – గౌడపేరు చిట్టిబాబు, చిత్తూరు – టిక్కారాం, ఒంగోలు – నాగలక్ష్మి, కర్నూలు – షేక్ జిలానీ భాషా, కడప – అఫ్జల్ అలీ ఖాన్ ఉన్నారు.

This post was last modified on September 8, 2024 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…

15 minutes ago

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

37 minutes ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

1 hour ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

2 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

7 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

9 hours ago