Political News

త‌న టీంను రెడీ చేసుకున్న ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఎట్ట‌కేల‌కు త‌న టీంను రెడీ చేసుకున్నారు. గ‌త నెల మొదటి వారం లోనే ఏపీలో త‌న‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ప్ర‌త్యేకంగా కొంత మంది పేర్ల‌తో కూడిన బృందాన్ని ఎంపిక చేసుకుని ఢిల్లీ చేరుకున్నారు. దీనికి అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీతో ఆమోద ముద్ర వేయించుకున్నారు. దీనిపై కొన్ని విమ‌ర్శ‌లు, మ‌రికొన్ని సూచ‌న‌లు వ‌చ్చినా.. వెన‌క్కి త‌గ్గ‌ని ష‌ర్మిల‌.. మొత్తానికి అధిష్టానంతో ఆమోదం ముద్ర వేయించుకోవ‌డంలో సక్సెస్ అయ్యారు.

ప్ర‌ధానంగా వైఎస్‌కు అనుచ‌రులుగా పేరొందిన చాలా మందికి ష‌ర్మిల త‌న బృందంలో చోటు ఇచ్చారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణ మోహ‌న్ కూడా ఉన్నారు. ఈయ‌న‌కు బాప‌ట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా సీనియ‌ర్ నాయ‌కుడు న‌ర‌హ‌రిశెట్టి న‌ర‌సింహారావుకు విజ‌య‌వాడ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా చాన్స్ ఇచ్చారు. ఈయ‌న వైఎస్‌కు అత్యంత విధేయ నేతగా గుర్తింపు పొందారు.

మొత్తంగా 25 జిల్లాలకు కాంగ్రెస్ అధ్య‌క్షులు, 13 మంది రాష్ట్ర స్థాయి ఉపాధ్య‌క్షులు, 37 మంది ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, 10మంది న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల‌తో ష‌ర్మిల త‌న కొత్త టీంను ఏర్పాటు చేసుకున్న‌ట్టు అయింది. అయితే.. ఎన్నికల త‌ర్వాత‌.. ష‌ర్మిల‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారిని ఈ క‌మిటీ నుంచి ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్మం. సుదీర్ఘ కాలం పార్టీలో ప‌నిచేసిన సుంక‌ర ప‌ద్మ‌శ్రీ వంటివారికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఇదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. సాకే శైల‌జానాథ్ వంటివారికి కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదు.

ఇదీ.. ష‌ర్మిల టీం..

జిల్లాల అధ్య‌క్షులు..

అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడుగా సాతాక బుల్లిబాబు, శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు, విజయన గరం – మరిపి విద్యాసాగర్, విశాఖపట్నం – వెంకట వర్మ రాజు, అనకాపల్లి – మీసాల సుబ్బన్న, కాకినాడ – మద్దేపల్లి సత్యానందరావు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ – కొండేటి చిట్టిబాబు(ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరారు), ఈస్ట్ గోదావరి – విశ్వేశ్వర్ రెడ్డి, వెస్ట్ గోదావరి – హరి కుమార్ రాజు, ఏలూరు – రాజనాల రామ్మోహన్ రావు, కృష్ణాజిల్లా – గొల్లు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా – బొర్రా కిరణ్, గుంటూరు – చిలకా విజయ్, బాపట్ల – ఆమంచి కృష్ణమోహన్, పల్నాడు – అలెక్స్ సుధాకర్, ప్రకాశం – షేక్ సైదా, నంద్యాల – జంగేటి లక్ష్మి నరసింహ యాదవ్, కర్నూలు – పరిగెల మురళి కృష్ణ, అనంతపురం – మధుసూదన్ రెడ్డి, క‌డ‌ప‌- విజయజ్యోతి, శ్రీ సత్యసాయి – హినయ్ తుల్లా, నెల్లూరు జిల్లా- చేవూరు దేవ కుమార్ రెడ్డి, తిరుపతి – బాలగురవం బాబు, చిత్తూరు – పోటుగారి భాస్కర్ నియ‌మితుల‌య్యారు.

న‌గ‌ర పార్టీ అధ్య‌క్షులు..

విజయవాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా నరహరి శెట్టి నరసింహ రావు, కాకినాడ సిటీ – చెక్కా నూకరాజు, రాజమండ్రి – బాలేపల్లి మురళీధర్, శ్రీకాకుళం – రెల్లా సురేష్, విశాఖపట్నం – పిరిడి భగత్, తిరుపతి – గౌడపేరు చిట్టిబాబు, చిత్తూరు – టిక్కారాం, ఒంగోలు – నాగలక్ష్మి, కర్నూలు – షేక్ జిలానీ భాషా, కడప – అఫ్జల్ అలీ ఖాన్ ఉన్నారు.

Satya

Recent Posts

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

22 minutes ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

3 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

4 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

5 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

5 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

6 hours ago