టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడం పెను సంచలనం రేపింది. తనను బెదిరించి లైంగికంగా వేధించారంటూ ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం దుమారం రేపింది. తిరుపతిలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె వీడియోను బయటపెట్టిన వైనం రాష్ట్ర రాజకీయాలలో షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను, ఆదిమూలం రాసలీలల వీడియోను ఆమె మీడియాకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఆదిమూలం ఖండించారు. అయితే, తాజాగా ఆ మహిళ ఫిర్యాదుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అధికారికంగా ప్రకటించారు.
ఈ ఏడాది జూలై 6వ తేదీన తిరుపతిలోని ఓ హోటల్ కు తాను వెళ్ళానని, రూమ్ నెంబర్ 109 లో సాయంత్రం 4 గంటలకు ఆదిమూలం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత జూలై 17వ తేదీన అదే హోటల్లోనే రూమ్ నెంబర్ 105లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించారు. ఆ తర్వాత అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యే తనకు ఫోన్ చేస్తున్నారని, ఆ ఫోన్ కాల్స్ గురించి తన భర్త నిలదీయడంతో జరిగిన విషయాన్ని బయటపెట్టానని చెప్పుకొచ్చారు.
భర్త సూచనల ప్రకారం ఎమ్మెల్యే ఆదిమూలంకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని, ఆ క్రమంలోనే పెన్ కెమెరాలో ఈ వ్యవహారాన్ని రికార్డ్ చేశానని ఆమె చెప్పారు. ఆగస్టు 10న హోటల్లో ఆదిమూలం రాసలీలల వీడియో రికార్డు చేసి తన భర్తకి ఇచ్చానని ఆమె వివరించారు. ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
This post was last modified on September 5, 2024 4:31 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…