టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడం పెను సంచలనం రేపింది. తనను బెదిరించి లైంగికంగా వేధించారంటూ ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం దుమారం రేపింది. తిరుపతిలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె వీడియోను బయటపెట్టిన వైనం రాష్ట్ర రాజకీయాలలో షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను, ఆదిమూలం రాసలీలల వీడియోను ఆమె మీడియాకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఆదిమూలం ఖండించారు. అయితే, తాజాగా ఆ మహిళ ఫిర్యాదుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అధికారికంగా ప్రకటించారు.
ఈ ఏడాది జూలై 6వ తేదీన తిరుపతిలోని ఓ హోటల్ కు తాను వెళ్ళానని, రూమ్ నెంబర్ 109 లో సాయంత్రం 4 గంటలకు ఆదిమూలం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత జూలై 17వ తేదీన అదే హోటల్లోనే రూమ్ నెంబర్ 105లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించారు. ఆ తర్వాత అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యే తనకు ఫోన్ చేస్తున్నారని, ఆ ఫోన్ కాల్స్ గురించి తన భర్త నిలదీయడంతో జరిగిన విషయాన్ని బయటపెట్టానని చెప్పుకొచ్చారు.
భర్త సూచనల ప్రకారం ఎమ్మెల్యే ఆదిమూలంకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని, ఆ క్రమంలోనే పెన్ కెమెరాలో ఈ వ్యవహారాన్ని రికార్డ్ చేశానని ఆమె చెప్పారు. ఆగస్టు 10న హోటల్లో ఆదిమూలం రాసలీలల వీడియో రికార్డు చేసి తన భర్తకి ఇచ్చానని ఆమె వివరించారు. ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
This post was last modified on September 5, 2024 4:31 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…