టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడం పెను సంచలనం రేపింది. తనను బెదిరించి లైంగికంగా వేధించారంటూ ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం దుమారం రేపింది. తిరుపతిలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె వీడియోను బయటపెట్టిన వైనం రాష్ట్ర రాజకీయాలలో షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను, ఆదిమూలం రాసలీలల వీడియోను ఆమె మీడియాకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఆదిమూలం ఖండించారు. అయితే, తాజాగా ఆ మహిళ ఫిర్యాదుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అధికారికంగా ప్రకటించారు.
ఈ ఏడాది జూలై 6వ తేదీన తిరుపతిలోని ఓ హోటల్ కు తాను వెళ్ళానని, రూమ్ నెంబర్ 109 లో సాయంత్రం 4 గంటలకు ఆదిమూలం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత జూలై 17వ తేదీన అదే హోటల్లోనే రూమ్ నెంబర్ 105లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించారు. ఆ తర్వాత అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యే తనకు ఫోన్ చేస్తున్నారని, ఆ ఫోన్ కాల్స్ గురించి తన భర్త నిలదీయడంతో జరిగిన విషయాన్ని బయటపెట్టానని చెప్పుకొచ్చారు.
భర్త సూచనల ప్రకారం ఎమ్మెల్యే ఆదిమూలంకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని, ఆ క్రమంలోనే పెన్ కెమెరాలో ఈ వ్యవహారాన్ని రికార్డ్ చేశానని ఆమె చెప్పారు. ఆగస్టు 10న హోటల్లో ఆదిమూలం రాసలీలల వీడియో రికార్డు చేసి తన భర్తకి ఇచ్చానని ఆమె వివరించారు. ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
This post was last modified on September 5, 2024 4:31 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…