టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడం పెను సంచలనం రేపింది. తనను బెదిరించి లైంగికంగా వేధించారంటూ ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం దుమారం రేపింది. తిరుపతిలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె వీడియోను బయటపెట్టిన వైనం రాష్ట్ర రాజకీయాలలో షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను, ఆదిమూలం రాసలీలల వీడియోను ఆమె మీడియాకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఆదిమూలం ఖండించారు. అయితే, తాజాగా ఆ మహిళ ఫిర్యాదుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అధికారికంగా ప్రకటించారు.
ఈ ఏడాది జూలై 6వ తేదీన తిరుపతిలోని ఓ హోటల్ కు తాను వెళ్ళానని, రూమ్ నెంబర్ 109 లో సాయంత్రం 4 గంటలకు ఆదిమూలం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత జూలై 17వ తేదీన అదే హోటల్లోనే రూమ్ నెంబర్ 105లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించారు. ఆ తర్వాత అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యే తనకు ఫోన్ చేస్తున్నారని, ఆ ఫోన్ కాల్స్ గురించి తన భర్త నిలదీయడంతో జరిగిన విషయాన్ని బయటపెట్టానని చెప్పుకొచ్చారు.
భర్త సూచనల ప్రకారం ఎమ్మెల్యే ఆదిమూలంకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని, ఆ క్రమంలోనే పెన్ కెమెరాలో ఈ వ్యవహారాన్ని రికార్డ్ చేశానని ఆమె చెప్పారు. ఆగస్టు 10న హోటల్లో ఆదిమూలం రాసలీలల వీడియో రికార్డు చేసి తన భర్తకి ఇచ్చానని ఆమె వివరించారు. ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
This post was last modified on September 5, 2024 4:31 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…