వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను బాగు చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో 2 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మురుగు కాల్వల్లో పూడిక తీత, రోడ్డపై ఉన్న చెతను తొలగించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. ఇదేసమయంలో ఇళ్ల లో పేరుకుపోయిన బురద సహా రోడ్లపై పేరుకు పోయిన బురదను తొలగిస్తున్నట్టు చెప్పారు.
దీనికిగాను 100కుపైగా ఫైరింజన్ల సేవలను విజయవాడలో వినియోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బడమేరుకు కనీవినీ ఎరుగని వరద వచ్చిందని.. అయితే.. ఆ నీరు పోయేందుకు అవకాశం లేకపోవడంతో నే ఊళ్లను ముంచేసిందని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. బుడమేరును ఆక్రమించుకున్నారని.. దీంతో వరద ప్రవాహం ఇళ్లను ముంచేసిందన్నారు. తన 45 ఏళ్ల రాజకీయాల్లో ఎప్పుడూ.. ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
మంగళవారం వరకు.. 10 లక్షల ప్యాకెట్ల ఆహారం, 9 లక్షల లీటర్ల మంచినీరును సరఫరా చేసినట్టు సీఎం తెలిపారు. బుధవారం ఒక్కరోజే.. 6 లక్షల ప్యాకెట్ల ఆహారం.. 3 లక్షల ప్యాకెట్ల పాలు, 4 లక్షల లీటర్ల మంచి నీరు అందించామన్నారు. బాధితులను 24 గంటలు ఆదుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విజయవాడకు సంకటంగా మారిన బుడమేరకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. బుడమేరుపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సీఎం బుధవారం మీడియాతో మాట్లాడారు.
This post was last modified on September 4, 2024 9:35 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…