వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను బాగు చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో 2 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మురుగు కాల్వల్లో పూడిక తీత, రోడ్డపై ఉన్న చెతను తొలగించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. ఇదేసమయంలో ఇళ్ల లో పేరుకుపోయిన బురద సహా రోడ్లపై పేరుకు పోయిన బురదను తొలగిస్తున్నట్టు చెప్పారు.
దీనికిగాను 100కుపైగా ఫైరింజన్ల సేవలను విజయవాడలో వినియోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బడమేరుకు కనీవినీ ఎరుగని వరద వచ్చిందని.. అయితే.. ఆ నీరు పోయేందుకు అవకాశం లేకపోవడంతో నే ఊళ్లను ముంచేసిందని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. బుడమేరును ఆక్రమించుకున్నారని.. దీంతో వరద ప్రవాహం ఇళ్లను ముంచేసిందన్నారు. తన 45 ఏళ్ల రాజకీయాల్లో ఎప్పుడూ.. ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
మంగళవారం వరకు.. 10 లక్షల ప్యాకెట్ల ఆహారం, 9 లక్షల లీటర్ల మంచినీరును సరఫరా చేసినట్టు సీఎం తెలిపారు. బుధవారం ఒక్కరోజే.. 6 లక్షల ప్యాకెట్ల ఆహారం.. 3 లక్షల ప్యాకెట్ల పాలు, 4 లక్షల లీటర్ల మంచి నీరు అందించామన్నారు. బాధితులను 24 గంటలు ఆదుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విజయవాడకు సంకటంగా మారిన బుడమేరకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. బుడమేరుపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సీఎం బుధవారం మీడియాతో మాట్లాడారు.
This post was last modified on September 4, 2024 9:35 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…