వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను బాగు చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో 2 వేల మందికిపైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మురుగు కాల్వల్లో పూడిక తీత, రోడ్డపై ఉన్న చెతను తొలగించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. ఇదేసమయంలో ఇళ్ల లో పేరుకుపోయిన బురద సహా రోడ్లపై పేరుకు పోయిన బురదను తొలగిస్తున్నట్టు చెప్పారు.
దీనికిగాను 100కుపైగా ఫైరింజన్ల సేవలను విజయవాడలో వినియోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బడమేరుకు కనీవినీ ఎరుగని వరద వచ్చిందని.. అయితే.. ఆ నీరు పోయేందుకు అవకాశం లేకపోవడంతో నే ఊళ్లను ముంచేసిందని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. బుడమేరును ఆక్రమించుకున్నారని.. దీంతో వరద ప్రవాహం ఇళ్లను ముంచేసిందన్నారు. తన 45 ఏళ్ల రాజకీయాల్లో ఎప్పుడూ.. ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
మంగళవారం వరకు.. 10 లక్షల ప్యాకెట్ల ఆహారం, 9 లక్షల లీటర్ల మంచినీరును సరఫరా చేసినట్టు సీఎం తెలిపారు. బుధవారం ఒక్కరోజే.. 6 లక్షల ప్యాకెట్ల ఆహారం.. 3 లక్షల ప్యాకెట్ల పాలు, 4 లక్షల లీటర్ల మంచి నీరు అందించామన్నారు. బాధితులను 24 గంటలు ఆదుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విజయవాడకు సంకటంగా మారిన బుడమేరకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. బుడమేరుపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సీఎం బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…