ఏపీ సీఎం చంద్రబాబు తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన కార్యాలయానికే పరిమితం కాకుండా.. సమీక్షలు.. సూచనలతోనే సరిపుచ్చకుండా.. కార్యరంగంలోకి దిగారు. పోటెత్తిన వరదలతో విజయవాడ నగర శివారు ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది.
దాదాపు 24 గంటలకు పైగానే ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. కనీసం తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం కూడా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో వారి అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో సీఎం చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. తానే స్వయంగా మంత్రి నారాయణతో కలిసి కార్యరంగంలోకి దిగారు.
బాధిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ శాఖకు చెందిన పడవలలో బయలు దేరి సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ముందుకు సాగారు. రోడ్లకు ఇరు వైపులా దీనంగా ఉన్న వరద బాధితులను ఆయన పలకరించారు. ప్రతి ఒక్కరినీ పలకరించారు. వరద నీటిలోనే మరపడవలను బాధితులకు దగ్గరగా తీసుకువెళ్లి పలకరించారు.
అంతేకాదు.. అక్కడికక్కడే వారిని ఓదారుస్తూ.. భరోసా కల్పించారు. నేనున్నానంటూ.. వారికి ధైర్యం చెప్పారు. వాస్తవానికి ముఖ్యమంత్రిగా.. చంద్రబాబు కాలు కదప కుండా వ్యవహరించే అవకాశం ఉంది. ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచో.. లేక.. సచివాలయం నుంచో ఆయన పనిచేయొచ్చు.
కానీ, బాధితులను నేరుగా కలుసుకుని.. వారికి ఓదార్పు వచనాలు చెప్పడంతోపాటు… వారి బాధను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. గతంలోనూ వరదలు వచ్చాయి. తుఫాన్లు వచ్చాయి. కానీ, అప్పటి ముఖ్యమంత్రి కేవలం క్యాంపు కార్యాలయం నుంచి సమీక్షించి..వదిలేశారు. వరదలు తగ్గాక.. వెళ్లి పరామర్శించారు.
దీనివల్ల బాధితులకు మనో వేదన చెప్పుకొనేందుకు.. స్వయంగా ముఖ్యమంత్రి తెలుసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. కానీ, దీనికి భిన్నంగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగడం.. బాధితులకు ఓదార్పు ఇవ్వడంతో వారికి మానసికంగా అయినా.. ధైర్యం కల్పించే అవకాశం ఏర్పడింది.
కాగా, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదల కారణంగా.. ఏపీలో చాలా జిల్లాలు జలదిగ్భంలో చిక్కుకున్నాయి. విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లు, మంత్రులు పర్యటిస్తున్నారు.
This post was last modified on September 1, 2024 9:52 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…