Political News

రాజ్య‌స‌భ రేసు.. బాబు నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌.. !

రాజ్యసభ రేసులో ఇద్దరు ప్రముఖుల పేర్లు తెర‌ మీదకు వచ్చాయి. ఇటీవల వైసిపి కి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద‌ మస్తాన్ రావు.. ఇద్దరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిలో మోపిదేవి వెంకటరమణ నేరుగా టిడిపిలో చేరుతున్నట్టు ప్రకటించారు.

ఇక మస్తాన్రావు విషయానికి వచ్చేసరికి కొంత సస్పెన్షన్ సాగుతోంది. ఆయన కూడా టిడిపిలోకి రావడం ఖాయం అని అంటున్నారు. అయితే వీరిలో మోపిదేవి వెంకటరమణకు మళ్ళీ రాజ్యసభ కాకుండా ఎమ్మెల్సీ ఇస్తారనేది ఒక ప్రచారం. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన ఒక సీట్ నుంచి మోపిదేవిని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అంతేకాదు.. అనంతరం ఆయనకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనేది ఒక వర్గం చెబుతున్న మాట. కానీ దీనిలో పెద్దగా వాస్తవం అయితే కనిపించటం లేదు. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులు మంత్రులుగా ఉన్నారు.

అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా మత్య‌కార సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మోపిదేవి వెంకటరమణకు మంత్రివర్గంలో చోటు లభించడం కష్టం, పైగా అనగాని సత్యప్రసాద్ మోపిదేవి వెంకటరమణ ఇద్దరు కూడా రేపల్లె నియోజకవర్గానికి చెందిన నాయకులు.

కాబట్టి ఒకే నియోజకవర్గ నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వ‌డం కూడా కష్టం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఎమ్మెల్సీ అయితే ఖాయం అనేది విశ్వస‌నీయ‌ వర్గాల మాట. ఇక బీద మస్తాన్రావుని ఏం చేస్తారనేది చర్చనీయాంశంగానే మారింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాజ్యసభకు ఖాళీ అయిన రెండు స్థానాలు టీడీపీకే దక్కనున్నాయి.

వీటిలో ఒక దానిని జనసేన పార్టీ కోరుతోంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాజ్యసభకు పంపించాలని వ్యూహంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక టిడిపికి దూరమై అసలు రాజకీయాలు చేయనని చెప్పిన‌ గల్లా జయదేవ్‌ పేరు కూడా ఇప్పుడు రాజ్యసభ రేసులో వినిపిస్తుండడం విశేషం.

ఎన్నికలకు ముందు ఆయన రాజకీయాలకు దూరమని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతోనే ఎన్నారై పెమ్మ‌సాని చంద్రశేఖర్ ని తీసుకువచ్చి గుంటూరు నియోజకవర్గంలో చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు గల్లా జయదేవ్ రాజ్యసభకు వెళ్తానని చెప్పడం పార్టీలో కొంతమంది నాయకులు చెబుతున్న మాట.

వ్యాపారాలపరంగా రాజకీయ అండదండలు లేకపోతే కష్టమని జయదేవ్ ఒక నిర్ణయానికి వచ్చారని, అందుకే రాజ్యసభకు తన పేరును పరిశీలించాలని చంద్రబాబుకు విన్నవించార‌నేది వీళ్ళు చెబుతున్న మాట. మొత్తానికి ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఇద్దరు పేర్లు బలంగా వినిపిస్తుండడంతో చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి.

This post was last modified on September 1, 2024 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 minutes ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago